RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

సింగరకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం — శాసనాలు, చరిత్ర, భక్తి పరంపర, తరంగ సంప్రదాయం

ఆంధ్రదేశ చరిత్రలో దేవాలయాలు కేవలం పూజా కేంద్రాలుగా మాత్రమే కాకుండా, ఒక సమగ్ర సామాజిక–ఆర్థిక సాంస్కృతిక వ్యవస్థగా పనిచేసినవని శాసనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అటువంటి మహత్తర వ్యవస్థకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన క్షేత్రమే అద్దంకి సమీపంలోని సింగరకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం.

ఈ క్షేత్రం విజయనగర సామ్రాజ్య కాలం నుంచీ ఆధునిక యుగం వరకు నిరవధికంగా కొనసాగుతున్న భక్తి, ఉత్సవ, సంగీత పరంపరకు కేంద్రంగా నిలిచింది.

 

సింగరకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం –
శాసనాధారిత చరిత్ర.

క్రీ.శ. 1443లో, సింగరకొండపై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఒక ముఖ్యమైన శాసనం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ శాసనం ప్రత్యక్షంగా కనిపించకపోయినా, నెల్లూరు జిల్లా శాసనాల విభాగం ఈ శాసనాన్ని నమోదు చేసింది. ఆ కాలంలో అద్దంకి ప్రాంతం పరిపాలనా పరంగా నెల్లూరు జిల్లాలో భాగంగా ఉండటం గమనార్హం.

ఈ శాసనం విజయనగర సామ్రాజ్య పరిపాలకుడు రెండవ దేవరాయల (క్రీ.శ. 1424–1446) కాలానికి చెందింది. శాసనంలో ఆయనను వీరప్రతాప దేవరాయలుగా పేర్కొన్నారు. ఇది రాజు పుణ్యంకోసం వేయించిన ధర్మశాసనమని స్పష్టంగా తెలుస్తోంది.

 

రెండవ దేవరాయలు – రాజకీయ నేపథ్యం.

రెడ్డిరాజుల పాలన 1325లో ప్రారంభమై 1424 నాటికి క్షీణించింది. ఈ సమయంలో విజయనగర సామ్రాజ్యాన్ని రెండవ దేవరాయలు పరిపాలిస్తున్నారు.
వారు తీరాంధ్రంపై దండయాత్ర చేసి—
నర్సరావుపేట,అద్దంకి,
పొదిలి ప్రాంతాలను జయించారు.
1428లో కొండవీడును స్వాధీనం చేసుకుని తన రాజ్యాన్ని సింహాచలం దాకా విస్తరించారు.

సింహళదేశం నుండి గుల్బర్గా వరకు, ఓడ్రదేశం నుండి మలబారు తీరం వరకు రెండవ దేవరాయల సామ్రాజ్యం విస్తరించింది.

1444లో కపిలేశ్వర గజపతి దేవరాయలు తీరాంధ్రపై దండయాత్ర చేసినప్పుడు, రెండవ దేవరాయలు పంపిన మల్లపవడయ చమూపతి (దేవరాజయ వడయులు) అనే దళవాయి ఈ దురాక్రమణను సమర్థంగా త్రిప్పికొట్టాడు.

శాసనంలో పేర్కొన్న ధర్మకార్యాలు.

విజయయాత్రలో భాగంగా అద్దంకికి వచ్చిన దళవాయి, సింగరకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించి, తన ప్రభువు రెండవ దేవరాయల పుణ్యం కొరకు ధర్మం చేశాడు. ఈ ధర్మకార్యాల నిర్వహణకు సంబంధించిన వివరాలు మనూరి దేవళ చేత నిర్వహించబడినట్లు శాసనం తెలియజేస్తుంది.

 

శాసనం ద్వారా తెలిసిన ముఖ్య విషయాలు—

వసంతపున్నమి,తిరునాళ్ళు,18 శాఖల వైష్ణవులు
56 దేశాల నుండి వచ్చిన భక్తులు స్వామివారి మహోత్సవాలకు హాజరవుతుండేవారని స్పష్టమవుతుంది.
ఆ కాలంలో “దేశం” అనే పదం సమీప గ్రామ సమూహాలకు ప్రయోగించబడేదని పరిశోధకులు పేర్కొంటారు.

దేవాలయ ఆర్థిక వ్యవస్థ – శాసన పదాల విశ్లేషణ.

ఈ శాసనం ప్రాచీన దేవాలయ వ్యవస్థ ఎంత సమగ్రంగా పనిచేసేదో తెలియజేస్తుంది. అందులోని ముఖ్య పదాలు.

పెండ్లిరూకలు – స్వామివారి కళ్యాణ మహోత్సవానికి కేటాయించిన నిధి.

బండి బానిసలు –

వాహన సేవలు, సరుకుల రవాణా నిర్వహించే సేవకులు.

సుంకపు తలారి –
అమ్మకాలు, రవాణాపై పన్ను వసూలు చేసే అధికారి.

తీరువా / దేవలం.

తీరువా – రాజ్యానికి / దేవాలయానికి చెల్లించే పంట పన్ను.

కమతలారి కట్నం –

రాజ్య భూముల పన్నును దేవాలయానికి కానుకగా సమర్పించడం.

మానిధారాపూర్వక –

అత్యంత పవిత్రంగా ఆచారబద్ధంగా అంకితం చేయడం.

ఈ ఆదాయం ద్వారా—
కళ్యాణ మహోత్సవాలు
వాహన సేవలు
సేవకుల పోషణ
ధాన్యాలు
పట్టుచీరలు, విలువైన వస్త్రాలు
అన్నీ సమృద్ధిగా నిర్వహించబడేవి.

రెడ్డిరాజుల కాలం – దేవాలయ నిర్మాణంపై నిర్ణయం.

రెడ్డిరాజుల తొలి రాజధాని అద్దంకి (1325–1364). ఈ కాలంలో అనేక దేవాలయాలు వైభవంగా వికసించినప్పటికీ, ప్రోలయవేమారెడ్డి కాలంలో సింగరకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉన్నట్లు ఆధారాలు లేవు. వీరు అహోబిల నరసింహస్వామికి, శ్రీశైలానికి, పాతాళగంగకు మెట్లుకట్టారని తెలుస్తుంది.వారి ఆస్థాన కవి కవిత్రయంలో ఒకరైన ఎర్రాప్రెగ్గడ కూడా అహోబలనరసింహునిపై స్థుతించాడే తప్ప సింగరకొండ నృసింహస్వామి స్థుతించ లేదు .మీదుమిక్కిలి తన కావ్యాల్లో ఎక్కడా సింగరకొండ నృసింహ స్వామిని ప్రస్తావించలేదు.

రెడ్డిరాజుల శాసనాలలో
సింగరకొండ నరసింహుని ప్రస్తావన కనిపించలేదు కాబట్టి ఈ దేవాలయం విజయనగర కాలంలోనే నిర్మితమై ఉండవచ్చునని భావించవచ్చు..

గుహ, గుళ్ళకమ్మ, సంగమేశ్వర క్షేత్రం.

స్థానిక కథనాల ప్రకారం, దేవాలయం వెనుక గుహ ఒకప్పుడు గుళ్ళకమ్మ తీరంలోని సంగమేశ్వర దేవాలయానికి చేరే మార్గంగా ఉండేది. మునులు ఈ మార్గంలో స్నానమాచరించి స్వామిని సేవించేవారని చెబుతారు.

ఈ గుహలోనే నారాయణ తీర్థుల వారు 12 ఏళ్ళ పాటు తపస్సు చేసినట్లు గ్రంథాధారాలు పేర్కొంటున్నాయి.

శ్రీకృష్ణలీలా తరంగిణి – అద్దంకి పాత్ర.

శ్రీకృష్ణలీలా తరంగిణీ కీర్తనలను బహుళప్రచారం చేసిన పుణ్యభూమి అద్దంకి.
నారాయణ తీర్థుల వారి తరంగకాలక్షేపంతో పన్నెండేళ్ల పాటు అద్దంకిసీమ భక్తిరసంతో పులకించింది.

వారి శిష్యపరంపల నోట శృతిలయాన్వితంగా తరంగాలు నినదించాయి. ప్రభాత, సంధ్యా సమయాల్లో చుట్టుపక్కల అరవై గ్రామాల్లో ఇంటింటా కృష్ణలీలాతత్త్వం మార్మోగింది. అద్దంకి సాక్షాత్తు పండరీనాథక్షేత్రంగా, మరో బృందావనంగా ఖ్యాతి గడించింది.

నృసింహభక్తుల పరంపర – సింగరకొండ.

మహానుభావులు
పాలపర్తి నృసింహదాసులు.
1844లో పాలపర్రులో జన్మించిన ఈ మహానుభావుడు సింగరకొండలో నలభై రోజుల మహామంత్ర దీక్ష చేసి, లక్ష్మీనరసింహ స్వామి దర్శనం పొందారు. వాగ్గేయకారుడిగా ‘శ్రీ నృసింహ కీర్తనలు’ గ్రంథాన్ని రచించారు. 76వ ఏట భీష్మనిర్యాణంలా పరమపదించారు.

కామరాజు సింగరిదాసు.

భక్తిశిఖామణి కామరాజు సింగరిదాసు గారు లక్షీనృసింహనామస్మరణతో, కీర్తనలతో సింగరకొండ మహిమను ప్రజల హృదయాల్లో నిలిపిన మహానుభావుడు.
గ్రామజీవితంలో భక్తి సంగీతాన్ని నిత్యజీవనంగా మార్చిన సేవకుడిగా వీరి పాత్ర విశేషమైనది.

అద్దంకి వెంకటరాయుడు
నారాయణ తీర్థుల వారి తరంగ సంప్రదాయానికి అద్దంకిలో జీవస్వరూపమైనవారు అద్దంకి వెంకటరాయుడు. వీరి గొంతులో నినదించిన తరంగాలు అద్దంకి గ్రామాన్ని ఒక ఆధ్యాత్మిక గ్రామంగా మలిచాయి.

ఆధునిక కాల విశేషాలు.

లక్ష్మీనృసింహస్వామి వారి నూతన ధ్వజ ప్రతిష్ఠ సమయంలో దర్శించిన మహావెలుగు, ఆ వెలుగులో కనిపించిన మహాపురుష దర్శనం, ఉత్తరదిక్కున ప్రసన్నాంజనేయ స్వామి అవిర్భావం వంటి సంఘటనలు ఈ క్షేత్ర మహిమను మరింత ప్రతిష్ఠించాయి.
నేడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయాలు భక్తుల కోర్కెలు నెరవేర్చే దివ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి.

సింగరకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం— శాసనాలు, రాజధర్మాలు, భక్తుల తపస్సులు, తరంగాల గానం—అన్నీ కలసి రూపుదిద్దుకున్నగొప్ప చారిత్రక, మహిమాన్విత చరిత్ర గల స్థలం సింగరకొండ.

ఇది కేవలం ఒక ఆలయం కాదు—
ఒక సజీవనాగరికతకు సాక్ష్యం.

-పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి.