దేశవ్యాప్తంగా సోమవారం లోక్సభ ఎన్నికల 4వ విడత పోలింగ్తో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పర్వం వాడివేడిగా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో ఆయా పార్టీల నడుమ ఘర్షణ వాతావరణం చోటు చేసుకోగా… పాలకుల భవిష్యత్తుని తిరగరాసేందుకు పోలింగ్ బూత్ల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, బీఆరెస్ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నడుస్తుండగా… ఏపీలో అధికార వైసీపీ ఒకవైపు… బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి మరోవైపు హోరాహోరీ పోరాటం చేస్తున్నాయి. […]
ఏప్రిల్ 26, వైశాఖ శుక్ల షష్ఠి – శ్రీరామానుజాచార్య జయంతి మనం ఇప్పుడు చెబుతున్న సామాజిక సమరసతకు ఆనాడే బాటలు పరచిన గొప్ప సమరసతా వారధి శ్రీ రామానుజులు. విశిష్టాద్వైతం బోధించి భక్తి ఉద్యమాన్ని రగుల్కొల్పిన గొప్ప ఆధ్యాత్మిక విప్లవ సారథి శ్రీరామానుజులు. శ్రీ రామానుజులు పింగళనామ (కలియుగం శాలివాహనశకం 4118, క్రీ.శ.1017) సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష పంచమి రోజున కాంతిమతి కేశవాచార్యు లకు, భూతపురి నేటి శ్రీపెరంబుదూరులో (ఇది చెన్నైకి 25కిమీ దూరం) జన్మించారు. వీరిని […]
–రాంపల్లి మల్లిఖార్జున్ ఒకప్పుడు ప్రపంచానికి దారి చూపిన భారతదేశంలో సైద్ధాంతిక గందరగోళం ఏర్పడిన కాలం అది. తత్వం, మతం విషయంలో ఎవరికి తోచినట్లు వాళ్ళు సిద్ధాంతాలు లేవదీస్తున్న పరిస్థితి. చార్వాక, లోకయాతిక, కపాలిక, శాక్తేయ, సాంఖ్యక, బౌద్ధ, మాధ్యమిక ఇలా అనేక సంప్రదాయాలు పుట్టుకువచ్చాయి. ఇలా కొత్తగా పుట్టుకువచ్చిన సంప్రదాయాల సంఖ్య 72కు పైగా ఉంటుంది. వీటన్నింటి మధ్య విభేదాలు, ఘర్షణలతో దేశం అల్లకల్లోలమయింది. సర్వత్రా మూఢనమ్మకాలు, మౌఢ్యం రాజ్యమేలుతున్నాయి. ఋషులు, మునులు, యోగులతో శాంతిమయంగా, ఆధ్యాత్మిక […]
– సత్యదేవ దేశరాజకీయాలు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, దార్శనికులు, మతప్రచారకులు దేశంలో అశాంతికి కారణమవుతున్నప్పుడు, భారతీయ సంప్రదాయానికి ఆధారమైన వైదిక వాజ్ఞ్మయాన్ని సరిగా అధ్యయనం చేసేవారు, వ్యాఖ్యానించే వారు చాలా తక్కువగా ఉన్నప్పుడు శంకరభగవత్పాదులు జన్మించారు. ప్రజల్లో ధార్మికనిష్టను పెంపొందించడానికి నాలుగు మఠాలను స్థాపించారు. ఆదిశంకరులు దేశం నలుమూలలా స్థాపించిన నాలుగు మఠాలనే చతుర్ధామాలు, మఠామ్నాయాలు అని అంటారు. ఈ చతుర్ధామ స్థాపన ఆదిశంకరుల వ్యవస్థానైపుణ్యానికి, కార్యదక్షతకూ ఉదాహరణ. హిందూధర్మాన్ని పునరుజ్జీవింప చేయడానికి, సుస్థిరం చేయడానికి, వ్యాప్తి చేయడానికి […]
ఎస్సీ, ఎస్టీలకు ఎవరు ఏం చేశారన్న చర్చ ఎన్నికల సందర్భంగా విపరీతంగా జరుగుతోంది. కొందరు పనిగట్టుకొని బీజేపీ చేసింది ఏమీ లేదని, అంతా తామే చేశామని, ఆ క్రెడిట్ అంతా తమకే రావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు . కానీ చరిత్ర అంటూ ఒకటి వుంటుంది. ఆ చరిత్ర పుటల్లో ఎవరు ద్రోహులో? ఎవరు సజ్జనులో తేలిపోతుంది.1954 ఉప ఎన్నికల్లో కాంగ్రెసస పార్టీ అంబేద్కర్ ను ఓడించింది నిజం కాదా? అయినా… ప్రతిపక్షాల సహకారంతో అంబేద్కర్ రాజ్యసభ […]
భారత సైన్యం 1998 మే 11న రాజస్థాన్లోని పోఖ్రాన్లో నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో రెండవ అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించిది. దీన్నే పోఖ్రాన్-II అంటారు. దీనిలో భారత్ విజయాన్ని సాధించింది. అప్పటి నుంచే మన దేశాన్ని అణ్వాస్త్ర దేశంగా ప్రకటించడమేకాకుండా మే 11వ తేదీని జాతీయ సాంకేతిక దినోత్సవంగా ప్రకటించి అధికారికంగా సంతకం చేశారు. ఇదేరోజు ఏరోస్పేస్ ఇంజనీరుగా ఉన్న డా. అబ్దుల్ కలాం నిర్వహించిన మొదటి దేశీయ విమానం హంస-3 పరీక్షలు, త్రిశూల్ […]
హైదరాబాద్: దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ ఓటర్స్ సహా ప్రజలందరూ NOTAకు బదులు.. మెరుగైన అభ్యర్థికి ఓటు వేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని “ABVP యువ ఓటర్ల సమ్మేళనం”లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ పిలుపునిచ్చారు. ఓటు హక్కును వినియోగించుకోకుంటే అత్యంత అసమర్ధుడైన అభ్యర్ధి గెలుపొంది దేశాన్ని భ్రష్టుపట్టించే అవకాశముందని, కనుక సరైన ఆలోచనతో దేశం కోసం పనిచేసే వ్యక్తులకు ఓటు వెయ్యాలన్నారు. నగరంలోని నారాయణగూడలో ఉన్న KMIT […]
రవీంద్రనాథ్ ఠాగూర్ 7 మే 1861 (బంగ్లా సం.1268 వైశాఖ 25 ) న కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్రనాథ్ టాగూర్. రవీంద్రునిది బహుముఖ ప్రతిభ, సమాజ సమర్పిత జీవనం. వీరు గత శతాబ్దపు భారత సామాజిక, ధార్మిక,ఆధ్యాత్మిక పునరుజ్జీవన కాల ఖండంలో దీప స్తంభంగా నిలిచారు. వారి సాహిత్యం, ఆలోచనలు భారతీయ సనాతన, శాశ్వత విలువల ఆధారంగా నిలిచాయి. వారి జీవితమంతా ఈ విలువల అభివ్యక్తీకరణమే. మన ప్రాచీన చారిత్రక పరంపర పట్ల గౌరవభావం […]
– గోపరాజు గాఢాంధకారంలో కూడా ముందుకు ఉరకాలంటే ఆకాశంలోని పెద్ద పెద్ద తారకలతో పాటు చిన్న నక్షత్రం ప్రసరించిన చిరువెలుగూ తోడైతేనే సాధ్యం. పరాయి పాలన అనే అంధకారంలో అలమటిస్తున్న దేశం దాస్య శృంఖలాలు తెంచుకుని స్వాతంత్య్రోదయం వైపు సాగించిన ప్రస్థానం అలాంటిదే. ఒక జాతి స్వేచ్ఛ కొన్ని తరాల త్యాగ ఫలం. ఆ సమాజంలోని సర్వుల సమష్టి స్వప్నం. భారత స్వరాజ్య సమరం దీనినే ప్రతిబింబిస్తుంది. కానీ ఆ మేరకు చరిత్ర రచన సమగ్రతను సంతరించు […]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొన్ని సంఘాలు పనిగట్టుకొని ఆర్ఎస్ఎస్ఫై రిజర్వేషన్ విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. అలాగే బీజీపీని ఓడించాలని బహిరంగంగా పిలుపునిచ్చాయి. బాబా సాహెబ్ అంబెద్కేర్ అందరి కోసం ఆలోచించి, దళితులకు దారిచూపించారు. దళితుల పట్ల మొదటి నుండి కాంగ్రెస్ వారి తీరు ఏమిటో ఆలోచించుకోవాలి. అంబెద్కేర్ లోకసభ సభ్యునిగా కాకుండా రెండు సార్లు కాంగ్రెస్ అడ్డుకుంది నిజం కాదా? ఎంతో మందికి భారతరత్న ఇచ్చిన కాంగ్రెస్ మన అంబేద్కర్కి ఎందుకు ఇవ్వలేదు? కాంగ్రెస్ పార్టీ […]