RSS NEWS

  • దేశానికి పెను’స‌వాల్’గా ఖ‌లిస్తాన్ 2.0
    -డా. పి. భాస్క‌ర‌యోగి ఇందిరా హ‌యంలో భింద్ర‌న్‌వాలేతో అంతమైపోయిందనుకొన్న ‘ఖలిస్తాన్’ ఉద్యమం మళ్లీ సరికొత్త రూపంలో ‘భారత్’ ను ఇబ్బంది పెట్టనుందా? అన్నది ఇప్పటి కొత్త చర్చ. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాక పట్టపగ్గాలు లేకుండా పోయిన భారత వ్య తిరేక శక్తులు అక్కడ హల్చల్ చేస్తుంటే మరోవైపు విదేశాల్లో వీరు చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఖలిస్తానీల పేరుతో ఈ వారం పదిరోజుల్లో బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తీవ్రవాదశక్తులు […]
  • ABPS 2023 – బలమైన, సంపన్నమైన భారత‌దేశ‌మే RSS ల‌క్ష్యం
    – ర‌త‌న్ శార్దా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భవించి వంద సంవ‌త్స‌రాలు కావ‌స్తోంది. ఆర్‌.ఎస్‌.ఎస్ అనేది సమాజంలో ఒక సాధార‌ణ సంస్థగా కాకుండా, స‌మాజం కోసం, స‌మాజాన్ని ఏకం చేయ‌డానికి పుట్టిన‌టువంటి ఒక‌ సంస్థ ఆర్‌.ఎస్‌.ఎస్ అని సంఘ వ్యవస్థాపకులు ప‌ర‌మ పూజ‌నీయ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ గారి ముఖ్య ఉద్దేశం. సంఘ ప్ర‌యాణం సుదీర్ఘమైన‌ది. ఇది అంత సుల‌భైనది కాదు. గ‌డిచిన శతాబ్దకాలం దేశంలో, ప్ర‌పంచంలోనూ ఎన్నో పెను మార్పుల‌ను సంభ‌వించాయి. మహర్షి అరబిందో, […]
  • Vision for stronger and prosperous Bharat: Interpreting RSS ABPS 2023
    – Ratan Sharda Hundred years of the Rashtriya Swayamsevak Sangh are on the horizon and one can feel a sense of urgency in the organisation’s actions to fulfil the vision of its founder, Dr Keshav Baliram Hedgewar, that the RSS should not be an organisation in the society, but an organisation of the society. His […]
  • హిందూ వృద్ధి రేటుపై కించపరిచే వ్యాఖ్యలు చేసిన రఘురామ్ రాజన్
    “హిందూ వృద్ధి రేటు” కారణంగా భారతదేశం ప్రమాదాపు అంచుల్లో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర రఘురామ్ రాజన్ హేయమైన వ్యాఖ్యలను ఇటీవల చేశారు. అందుకు కారణాలుగా దేశంలోని ప్రైవేట్ రంగంలో పరిమిత పెట్టబడులు, అధిక వడ్డీ రేట్లు, ప్రపంచ వృద్ధి తగ్గడం వంటివి చెప్పుకొచ్చారు. రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు దేశాన్ని, హిందుత్వను కించపరిచేలా గతంలో జరిగిన సంఘటిత ప్రయత్నాలను ప్రతిబింబిస్తోంది. అవమానకరమైన పదం : 1950 నుంచి 1980 సంవత్సరాల కాలంలో దేశ […]
  • VIDEO: హిందువులను చైతన్యపరిచిన వాగ్గేయకారుడు… సంత్ తుకారామ్
    అభంగాలతో హిందూ ధర్మ పరిరక్షణకు సంత్ తుకారామ్ పరోక్షంగా ఊతమిచ్చారు. ధర్మ నిష్టతో పాటుగా ఆధ్యాత్మిక కార్యాచరణ దిశగా హిందువులను చైతన్యపరచడంలో కీలకమైన భూమికను పోషించారు. ముస్లిం పాలకుల దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడటంలో హిందువులను పరోక్షంగా ప్రేరేపించిన వాగ్గేయకారుడు సంత్ తుకారామ్. తాను రచించిన అభంగాల్లో విఠలేశ్వరుని కొలుస్తూనే సత్యాసత్యాలు, ధర్మాధర్మాల పట్ల హిందువుల్లో విచక్షణ కలిగించే మార్గానికి దారి చూపారు. భక్తి ఉద్యమం ద్వారా హిందూ ధర్మ పరిరక్షణకు అజన్మాంతం పాటుపడిన నామ్‌దేవ్ ఏకనాథ్, జ్ఞానేశ్వర్ […]
  • ఉరితాడును ముద్దాడారు
    -‌ కె. హరిమధుసూదనరావు ‘రంగ్‌ ‌దే బసంతి చోలా మాయె రంగ్‌ ‌దే’ మా చొక్కాకు వసంతపు వర్ణాన్ని (కుంకుమ పువ్వు రంగుని) పులమండి అంటూ ఆనందంగా ముగ్గురు మిత్రులు ఒకరినొకరు కౌగలించుకున్నారు. మరుక్షణంలో వారికి మరణం సంభవిస్తుందన్న దిగులు లేదు. వారి మోముపై చిరునవ్వు తొణికిసలాడింది. తెల్లవాళ్ల విషపు గోళ్ల నుంచి భరతమాతను రక్షించడానికి తమ ప్రాణాల్ని సైతం తృణ ప్రాయంగా విడిచి పెట్టడానికి సిద్ధపడిన ఆ అమరవీరులే  భగత్‌సింగ్‌, ‌సుఖ్‌దేవ్‌, ‌రాజ్‌గురులు. వీరిని 1931 […]
  • VIDEO: ఉరికంబాన్ని ముద్దాడిన వీరులు
    అతి చిన్న వయసులోనే బ్రిటీష్ వారిని ఎదిరించి గడగడలాడించిన యువకులు…భూమి భారతికి స్వాతంత్రాన్ని అందించడమే తమ జీవిత లక్ష్యమని చాటిచెప్పి పోరాడిన యోధులు…యువతకు స్పూర్తి ప్రధాతలు..భగత్ సింగ్, సుఖ్ దేవ్. రాజ్ గురు లు. మార్చి 23న వారు ఉరికంబాన్ని ముద్దాడిన రోజు. అందుకే ఈరోజును ప్రతిసంవత్సరం షహీద్ దివస్ గా జరుపుకుంటున్నాం. వారి త్యాగాలను స్మరించుకుంటున్నాం.  The post VIDEO: ఉరికంబాన్ని ముద్దాడిన వీరులు appeared first on VSK Telangana.
  • కాలం అనంతమైనది, దైవ స్వరూపం
    కాలం దైవ స్వరూపం,  కాలం అనంతమైనది,  ఈ సృష్టి అన్వేషణకు మూలం కాల గణన  మనదేశంలో కాల గణన ఎంతో శాస్త్రీయమైనది. మన దేశంలో కాలగణన ఖగోళంలోని గ్రహగమనం ఆధారంగా లెక్కిస్తారు. మన కాలగణనలో మన్వంతరము, యుగాలు,  సంవత్సరాలు, మాసాలు, పక్షము, రోజులు ఉంటాయి. అందులో  14 మన్వంతరాలు ఉన్నాయి. ఆ  మన్వంతరాల  క్రమంలో ప్రస్తుతం ఏడవ మన్వంతరమైన  వైవస్వత  మన్వంతరం ఇప్పుడు నడుస్తున్నది. ఒక మన్వంతరము అంటే 71 మహా యుగాలు, ఒక మహాయుగం అంటే నాలుగు యుగాల మొత్తం. నాలుగు యుగాలు 1] కృతయుగము 2]త్రేతాయుగము 3] ద్వాపరయుగము 4] కలియుగం. ఒక యుగంలో నాలుగు పాదాలు ఉంటాయి. మనము ఇప్పుడు వైవస్వత మన్వంతరం లోని  కలియుగంలో మొదటి […]
  • జాతిలో ఆత్మవిశ్వాసమే డాక్టర్‌జీ జీవిత సందేశం
    సంవత్సరాది నాడు రాబోయే సంవత్సరంలో పొందబోయే సుఖాలను ఊహించుకుని మనిషి  ఆనందపడతాడు. మనసులో నవోత్సాహం పొంగుతూ ఉంటుంది. తన వయసు ఒక సంవత్సరం పెరిగిందన్న దురభిమానం కూడా ఉంటుంది. కాని మృత్యువు మరొక సంవత్సరం దగ్గరైందన్న ఆలోచన రాదు. నిజానికి ఈ విషయాన్నే దృష్టిలో ఉంచుకొని మిగిలి ఉన్న జీవితంలో చేసే  కార్యాలకు మరింత శక్తిని, బుద్ధిని, వేగాన్ని జోడించడం అవసరం. ఆజీవన కార్యం మన అంతఃకరణలలోని ఉదాత్త భావనలు అక్కడే ఉండిపోకూడదు. అవి కాస్తంత ఇతరులకూ […]
  • ‘‌శోభ’కృత్‌కు స్వాగతాంజలి
    సంవత్సరాలకు మన పెద్దలు పేర్లు పెట్టడం వెనుక ఎంత నిగూఢత ఉందో కడచిన నాలుగు సంవత్సరాలలో చవిచూసిన అనుభవాలే ఉదాహరణలుగా చెప్పవచ్చు. ‘వికారి’ (2019) తన పేరుకు తగినట్లే ప్రకృతి, మానవ జీవితాలకు సంబంధించి సకల వికారాలను విస్తృతస్థాయిలో ప్రదర్శించింది. ఆ ఏడాది చరమాంకంలో కరోనా (కొవిడ్‌-19) ‌మహమ్మారి లోకాన్ని ఆవరించింది. ‘శార్వరి’ (2020) అంటే చీకటి. కొవిడ్‌ ‌విజృంభించి జనజీవనాన్ని అంధకారమయం చేసింది. వ్యవస్థలు కుదేలైపోయాయి. ఉపాధికి గండి పడింది. మానవ సంబంధాలు బీటలు వారాయి. […]

సమర్థ రామదాస స్వామి – సామాజిక సమరసత

శ్రీ సమర్థగురు రామదాస్ (విక్రమ. సం. 1665-1739; క్రీ.శ. 1608-1682)

గురు సమర్ధ రామదాస స్వామి జయంతి (17 ఫిబ్రవరి) సందర్భంగా……

సమర్థగురు రామదాసస్వామి ప్రపంచంలో మహాత్ములైన యోగులలో ఒకరు. మహారాష్ట్రలో `జామ్బ్’ అనే  గోదావరీతట ప్రాంతంలో జన్మించిన వీరు చిన్నతనం నుంచీ శ్రీరామ, శ్రీ ఆంజనేయ భక్తుడు. వివాహ సమయంలో పురోహితుడు ముహూర్త సమయానికి `సావధాన’(జాగ్రత్త) అనగానే లేచి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు.

అఖండ సాధన 

గోదావరీతట `నాసిక’ వద్ద శ్రీ సమర్థగురు పన్నెండు సంవత్సరాల కఠోర సాధన చేసారు. ప్రాతఃకాలం నుంచి మధ్యాహ్నం వరకు గోదావరి నీళ్ళల్లో నుంచుని గాయత్రీ మంత్రజపం చేసేవారు. శ్రీరామనామజపం `శ్రిరామజయరామ జయజయరామ’ మంత్రాన్ని పదమూడుకోట్లసార్లు జపించారు. తర్వాత దేశమంతా తీర్థస్థలాలు పర్యటించారు. పండరీపురంలోనూ ఆయనకు ఆ రాముడే కనిపించాడు. అక్కడే ఆయన భక్త తుకారామ్ ను కూడా కలిసారు. ఆ కాలంలోని దేశ సామాజిక, రాజకీయ, ఆర్ధిక దుస్థితి చూసి ఆయనకు చాలా దుఖం కలిగింది. సాక్షాత్తు శ్రీరాముడే వీర శివాజీకి సహాయం చేయమని ఆదేశించినట్లు ఆయనకు తోచింది.   

కుల,భేదభావాలు

సమాజంలో కుల వైషమ్యాలు, ఒక పెద్ద వర్గం అవమానానికి గురై బాధ పడడం చూసి,  శ్రీ సమర్థగురు రామదాస్ ఎంతో మనస్తాపం చెందారు. ఈ భేదభావాలను సమూలంగా తొలగించడానికి సమాజాన్ని జాగృతం చేసే పనికి ఉపక్రమించారు. ఇదే విషయాన్ని తమ ప్రఖ్యాత `దాసబోధ’ గ్రంథంలో సైద్ధాంతికంగా తెలియచేస్తూ, `పెద్ద- చిన్న, రాజు- పేద, స్త్రీ -పురుష తారతమ్యాలు ఏమీ లేవు, అందరూ ఒకటే, అందరిలోనూ ఒకే పరబ్రహ్మము ఉంటాడు’ అని బోధించారు. `బ్రాహ్మణుడైనా, శూద్రుడైనా, రాజైనా, ప్రజలైనా, అందరిలోనూ పవిత్రమైన పరబ్రహ్మము ఒక్కటే’ అంటూ ఆయన సమస్త మానవులలోనూ ఒకే భగవత్ స్వరూపాన్ని దర్శించి, కుల విభేదాలని తోసిపుచ్చారు. అందరి హృదయాలను సంభాలించడమే దైవభజన అని చెప్పారు. `సంత్ చోఖామేలా’,`వర్కారి సంప్రదాయం’లో (శ్రీ పాండురంగ భక్తి సంప్రదాయం) `మహార్’కులానికి చెందిన స్వామీజీ గురించి వ్రాస్తూ… `అనాథనాథుడైన భగవంతునికి ఏ జాతి లేదు, ఆయన `చోఖామేలా’తో కూర్చుని పాలు, పెరుగు భోజనం చేస్తాడు’ అన్నారు. మరొకచోట వ్రాస్తూ `ఎక్కువ తక్కువ కులాలనే వ్యత్యాసం లేదు. హరినామ సంకీర్తనతో నిండిన అటువంటి వ్యక్తుల పవిత్ర పాదధూళికి నేను నమస్కరిస్తున్నాను’ అన్నారు. `ఇంకొకరి స్పర్శమాత్రం చేత అపవిత్రమైపోతే నీదేపాటి పవిత్రత? పెద్ద-చిన్న కులభేదాలను తోసిపుచ్చి అందరినీ హృదయపూర్వకంగా ప్రేమించండి, ఆదరించండి; అప్పుడే అందరి హృదయాలు పునీతమౌతాయి’ అన్నారు. 

`అంటరానివారి’తో భోజనం, దక్షిణ

చాఫల్ ప్రాంతంలో, భేర్వాడి గ్రామంలోని `అంటరానివాళ్ళు’ అనబడే దంపతులను, శ్రీ సమర్థగురు రామదాస్ తమ శ్రీరామనవమి ప్రవచనాలకు ఆహ్వానించారు. వారు `మాండ్’ నదిలో స్నానం చేసిన తరువాత, సంప్రదాయానుసారం వారిద్దరికీ చీర-ధోవతులు పెట్టి, సహపంక్తి భోజనం కావించి, దక్షిణ సమర్పించారు. ఆ కాలంలో ఈ సంఘటన ఒక గొప్ప విప్లవంగా పేర్కొనవచ్చని డా. సచ్చిదానంద పర్లికర్ తమ పుస్తకంలో వ్రాసారు, `కులం, వర్ణం, ప్రాంతం, భాషా భేదాల పేరుతో, మనుషుల మధ్య  అంతరాలు శ్రీ సమర్థగురు రామదాస్ గారికి ఎంతమాత్రం అంగీకారం కాదు’ అని వ్రాసారు.  శ్రీ సమర్థగురు రామదాస్ అంటారు. `భక్తిమార్గములో వెళ్లే ప్రతి వ్యక్తి పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడే, అన్ని వర్ణాలు దీనికి అర్హులే, చిన్నా-పెద్దా ఎవరూ లేరు, మూర్ఖుడైనా భగవంతుడి నామస్మరణతో భవసాగరాన్ని దాటవచ్చు. మంచి పనులు చేసే వ్యక్తి శ్రేష్టుడు, చెడు చేసేవాడు నికృష్టుడు, కర్మానుసారం మనుషులు పాపకర్మలు లేక పుణ్యకార్యాలు చేస్తుంటారు’ అని ఉద్బోధించారు.

దేశోద్ధారణ

ఆ కాలంలో భారతదేశం మీద ఇస్లాంమత దాడులనుంచి దేశాన్ని విముక్తం చేయడానికి శ్రీ సమర్థగురు రామదాస ప్రణాళికాబద్దంగా కృషి చేసారు. పవిత్ర కృష్ణానది ఉద్భవించిన మహాబలేశ్వర్ కొండలలో ఆయన ప్రధమంగా శ్రీ వీరహనుమాన్ దేవాలయం, మఠం నిర్మించారు; ఆ తరువాత 11 క్షేత్రాల్లో శ్రీ ఆంజనేయ దేవాలయాలు, మఠాలు స్థాపించారు. నెమ్మదిగా శ్రీ సమర్థగురు రామదాస్ మహారాష్ట్ర అంతటా వేయి హనుమాన్ మందిరాలు, అఖాడాలు నిర్మించారు.

ఆ కాలంలో పూర్తి దేశమంతా ముస్లింల చేతిలో హిందువులు ఎన్నో భయంకర దాడులకు, అత్యాచారాలకు గురౌతున్నారు. ఎన్నో ప్రాంతాల్లో రాజ్యాధికారం ముస్లిముల చేతిలోనే ఉంది. భక్తి ఉద్యమంతో పాటు, ముస్లిముల చేతుల్లోంచి అధికారం తిరిగి పొందడం కూడా దైవకార్యంగానే శ్రీ సమర్థగురు రామదాస్ భావించారు. `స్వరాజ్యం ధర్మకార్యం. పరమేశ్వరుని శిరసు మీద ధరించి, మన దేశాన్ని సర్వనాశనం చేసిన ముస్లిం రాజుల మీద యుద్ద్ధం ప్రకటించండి, దేశం కోసం ప్రాణాలను అర్పించడానికి వెనుకాడకండి’ అని శ్రీ సమర్థగురు రామదాస్ పిలుపు నిచ్చారు. `హిందూ ఆలయాలను ధ్వంసం చేసినవారు దైవద్రోహులు, అటువంటివారిని శిక్షించిన వారు దేవదాసులు, ఈశ్వరుని భక్తులు; ఈశ్వర భక్తులకి విజయం తధ్యం’.  అని అన్నారు

శ్రీరామనవమి మహోత్సవాలు

హిందూ సమాజాన్ని ఐకమత్యంతో ఒక్కతాటిపై తేవడానికి శ్రీ సమర్థగురు రామదాస్, శ్రీరామనవమి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆనాడు జరిగే  శ్రీరామ రథోత్సవాలలో, అన్ని కులాలు వర్గాలవారు ఎంతో ఉత్సాహంతో పాల్గొనేవారు.  

శిష్య పరంపర

శ్రీ సమర్థగురు రామదాస్ దేశ వ్యాప్తంగా హిందూ సమాజాన్ని జాగృతం చేసి, ఒక్కతాటిపై సమీకరించడానికి కృషి చేసారు. ఆయన తమ విస్తృత శిష్యపరంపర నుంచి, దాదాపు 1100మందిని `మహంత్’లుగా తీర్చిదిద్దారు, అందులో 300మంది మహిళలు, ఆనాటి సమాజంలో అది చాలా పెద్ద సంస్కరణ, ముందడుగు. వీరంతా దేశమంతా విస్తరించి, అనేక స్థానాల్లో, హిందూ సమాజాన్ని ఏకీకృతం చేసే పని నిర్వహించారు. వీరు కులాలకి అతీతంగా వేయి పైగా మఠాల స్థాపన చేసారు. తంజావూరు నుంచి కాశ్మీరు దాకా వ్యాపించిన ఈ మఠాలు, అఖాడాలు, ఛత్రపతి శివాజీ మహారాజుకి ఎంతో సహకారం అందించాయి. శివాజీ మహారాజు పుత్రుడు శ్రీ రాజారాం మహారాష్ట్ర విడిచి దక్షిణ భారతానికి వచ్చినపుడు, తంజావూరు మఠం ఆయనకు సర్వంసహా మద్దతు ఇచ్చినందువల్ల ఆయన ఇరవై సంవత్సరాల పాటు ఔరంగజేబుతో యుద్ధం చేయగలిగారు.

సాహిత్య రచనలు

హిందూ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీ సమర్థగురు రామదాస్ అనేక ఉత్కృష్ట రచనలు చేసారు. అందులో ప్రముఖమైనవి- `దాసబోధ’ `కరుణాష్టక్’ `మనాచే శ్లోక్’ `సుందరకాండ మరియు యుద్ధకాండ’. వేలాదిమంది కార్యకర్తలను సుశిక్షితులుగా తయారుచేసి, సామాజికంగా సంఘటితం చేయడానికి ఎనలేని కృషి చేసారు. `అందరి హృదయాలలో శ్రీరాముడు నివాసముంటాడు, కులభేదాలు పట్టుకువేళ్ళాడడం అంటే మనందరిలోని శ్రీరాముడి అస్తిత్వాన్ని నిరాకరంచడమే’ అన్నారు.  వెనకబడిన కులాలనబడే వారితో పనిచేసి, వారిని సంఘటితం చేసి ఛత్రపతి శివాజీ మహారాజుకి తోడుగా తెచ్చి నిలబెట్టారు.

 (`భారత్ కీ సంత్ పరంపర ఔర్ సమాజిక్ సమరసతా’ హిందీ గ్రంథం ఆధారంగా)

–  శ్రీ కృష్ణ గోపాల్ శర్మ

అనువాదం: ప్రదక్షిణ