RSS NEWS

  • అయోధ్య బాల రాముడ్ని దర్శించుకున్న 1.5 కోట్ల మంది భక్తులు
    అయోధ్యలోని రామజన్మభూమి ఆలయానికి జనవరి 22న జరిగిన రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం తర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 1.5 కోట్ల మంది భక్తులు అయోధ్య బాల రాముడిని ద‌ర్శించుకున్న‌ట్టు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులకు కేంద్రంగా మారిన తీర్ధయాత్ర కోసం ప్రతిరోజూ సుమారు లక్ష మంది ఆలయ పట్టణాన్ని సందర్శిస్తున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ […]
  • “పోలింగ్ బూత్‌లోనే ఓటు వేస్తా” : 112 ఏళ్ల మ‌హిళ స్ఫూర్తిదాయ‌క నిర్ణ‌యం
    ఇంటి నుంచి ఓటు వేసే అవ‌కాశం కాద‌ని, పౌర విధుల్ని పాటిస్తూ పోలింగ్ బూత్‌లో ఓటు వేయాల‌ని నిర్ణ‌యం 112 సంవత్సరాల వయస్సులో, దక్షిణ ముంబైకి చెందిన కంచన్‌బెన్ బాద్షా మే 20న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఆమె వయస్సును బ‌ట్టి ఇంటి నుంచే ఓటు వేసే అవ‌కాశం ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రానికి వ‌చ్చి ఓటు వేసేందుకు ఆస‌క్తి చూపుతోంది. ఎన్నికల సంఘం 85 ఏళ్లు […]
  • Hanuman Janmotsav: Celebrating tradition, belief and community service; know all about Bajrang Bali’s favourite food
    Hanuman Janmotsav, is widely celebrated on April 23 this year, coinciding with the revered day of Tuesday. This auspicious occasion commemorates the birth of Bhagwan Hanuman, the Rudra avatar of Bhagwan Shiv, believed to be immortal and present on earth to this day. According to legend, Hanuman was born at sunrise on Chaitra Purnima, which […]
  • సర్వలక్షణ సమన్వితుడు హనుమ
    శ్రీమద్రామాయణ కావ్య నాయకుడు శ్రీరామచంద్రమూర్తి. తరువాత అంతటి ఉన్నత స్థానం అందుకున్నవారు హనుమే. ఆ కావ్యంలోని బాల, అయోధ్య, అరణ్యకాండల తరువాత కిష్కింధకాండలో ఆయన ప్రస్తావన వస్తుంది. ఆ తరువాత సుందరకాండలో హనుమ విశ్వరూపం కనపడుతుంది. శ్రీరామ పట్టాభిషేకం వరకు కథ ఆయన చుట్టే తిరుగుతుంది. ఆంజనేయుడు పరమ భాగవతోత్తముడే కాదు ప్రభుభక్తి పరాయణుడు, దాస్యభక్తికి ప్రథమోదాహరణ. అనితరసాధ్యుడు, పట్టుదలకు మారుపేరు. అభయం కోరిన వారిని ఆదుకోవడంలో అవసరమైతే ప్రభువుకే వినయ పూర్వకంగా ఎదురునిలిచిన ధీరుడు. వ్యక్తిత్వ […]
  • కేర‌ళ: ఐదేళ్ల‌లో 5338 మంది బాలిక‌లు మిస్సింగ్
    కేర‌ళ రాష్ట్రంలో అనేక మంది బాలిక‌లు, మ‌హిళ‌లు అచూకీ క‌న‌బ‌డ‌కుండా పోతున్నారు. 2019 జనవరి నుండి 2023 డిసెంబర్ 31 వరకు 5 సంవత్సరాల వ్యవధిలో కేరళ రాష్ట్రంలో 5338 బాలికల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని సమాచార హక్కు చ‌ట్టం ద్వారా వెల్లడ‌యింది. 2024 ఏప్రిల్ 12న తిరువనంతపురంలో స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, ప్ర‌జా స‌మాచార అధికారి వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఇది గిరీష్ భరద్వాజ్, 11 – అస్థిత్వ, రైల్వే సమాంతర రహదారి, శేషాద్రిపుర, బెంగళూరు […]
  • चरित्रवान व्यक्ति ही अपने परिवार, समाज एवं राष्ट्र का भला कर सकते हैं
    हिंदी विवेक प्रकाशित ‘तीर्थंकर भगवान महावीर’ विशेषांक का पुणे में विमोचन पुणे. भगवान महावीर के २५५०वें निर्वाण वर्ष के उपलक्ष्य में हिंदी विवेक मासिक पत्रिका द्वारा प्रकाशित ‘तीर्थंकर भगवान महावीर’ विशेषांक का पुणे में विमोचन किया गया. जैन तपस्वी उपाध्याय प. पू. प्रवीण ऋषि जी महाराज और राष्ट्रीय स्वयंसेवक संघ के अखिल भारतीय प्रचार प्रमुख […]
  • VIDEO : సమాజపరివర్తనకై పంచ పరివర్తన్
    రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రారంభించి 2024 సంవత్సరం విజయదశమి పండుగకు 99 సంవత్సరాలు పూర్తయి 100వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నది… ఈ సందర్భంగా సంఘం కొన్ని సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ తద్వారా దేశంలో ఒక సామాజిక పరివర్తన సాధించడానికి యోజన చేసింది. అవే పంచ పరివర్తన్ The post VIDEO : సమాజపరివర్తనకై పంచ పరివర్తన్ appeared first on VSK Telangana.
  • మాతృభూమికి వందనం
    పంచభూతాలైన పృథ్వి (భూమి), వాయువు (గాలి), జలం (నీరు), అగ్ని (నిప్పు), ఆకాశం (శూన్యం).. వాటి సమన్వయంపైన మన జీవన వ్యవస్థలు ఏ విధంగా ఆధారపడి ఉన్నదీ మన పూర్వీకులు వివరించారు. ప్రకృతిలో భాగమైన ఈ పంచభూతాలే దైవత్వానికి నిదర్శనాలు. మన జీవనానికి ఆధారభూతంగా ఉన్న నేలని తల్లిగా కొలవడం మన సంస్కృతి గొప్పతనం. ప్రపంచంలో ఏ దేశంలోని ప్రజలు కూడా తాము నివసిస్తున్న భూమిని తల్లిగా భావించరు. మన దేశంలో మాత్రమే ఈ మట్టిని మాతృభూమిగా […]
  • నెస్లే సెరిలాక్ మోతాదుకు మించి చక్కెర
    గ్లోబల్ ఫుడ్ అండ్ బెవరేజీ దిగ్గజం నెస్లే యూరప్‌లోని మార్కెట్లతో పోలిస్తే పేద దక్షిణాసియా (భారతదేశంతో సహా), ఆఫ్రికన్, లాటిన్ అమెరికా దేశాలలో చక్కెర కంటెంట్‌తో కూడిన పిల్ల‌లు తినే ఉత్పత్తులను విక్రయిస్తుందని స్విస్ NGO, పబ్లిక్ ఐ, ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్‌వర్క్ (IBFAN) నివేదిక పేర్కొంది. వివిధ కౌంటీలలో విక్రయించే సుమారు 150 పిల్లల‌ బేబీ ఉత్పత్తులను నివేదిక కోసం పరిశీలించారు. అందులో అంతర్జాతీయ ఆహార భద్రతా మార్గదర్శకాలకు మించి చక్కెర ఉన్నట్లు […]
  • పరాక్రమ స్వభావంతోనే పూర్తిగా స్వతంత్రులం అవుతాం: మోహన్‌ భగవత్‌ జీ
    హిందువుల్లో ఏర్పడ్డ ఆత్మవిస్మృతి కారణంగా మనం ఎవరో పూర్తిగా మరిచిపోయామని, దీనిపై స్పష్టతను కూడా కోల్పోయామని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ సర్ సంఘ్ చాలక్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. అనేక సార్లు విదేశీయుల దండయాత్రల కారణంగా బానిస మనస్తత్వం ఏర్పడిరదని, ఇది మన ఆలోచనలపై పదే పదే ప్రభావం చూపిస్తోందని అన్నారు. దీంతో ఆలోచనల్లో స్పష్టత లోపిస్తోందని, ఆత్మవిశ్వాసం కూడా ఘోరంగా పడిపోతోందని అన్నారు. బానిస మనస్తత్వం కారణంగా సమాజంలో భేదభావాలు, స్వార్థం బాగా వ్యాపించిపోయాయని వివరించారు. […]

సమర్థ రామదాస స్వామి – సామాజిక సమరసత

శ్రీ సమర్థగురు రామదాస్ (విక్రమ. సం. 1665-1739; క్రీ.శ. 1608-1682)

గురు సమర్ధ రామదాస స్వామి జయంతి (17 ఫిబ్రవరి) సందర్భంగా……

సమర్థగురు రామదాసస్వామి ప్రపంచంలో మహాత్ములైన యోగులలో ఒకరు. మహారాష్ట్రలో `జామ్బ్’ అనే  గోదావరీతట ప్రాంతంలో జన్మించిన వీరు చిన్నతనం నుంచీ శ్రీరామ, శ్రీ ఆంజనేయ భక్తుడు. వివాహ సమయంలో పురోహితుడు ముహూర్త సమయానికి `సావధాన’(జాగ్రత్త) అనగానే లేచి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు.

అఖండ సాధన 

గోదావరీతట `నాసిక’ వద్ద శ్రీ సమర్థగురు పన్నెండు సంవత్సరాల కఠోర సాధన చేసారు. ప్రాతఃకాలం నుంచి మధ్యాహ్నం వరకు గోదావరి నీళ్ళల్లో నుంచుని గాయత్రీ మంత్రజపం చేసేవారు. శ్రీరామనామజపం `శ్రిరామజయరామ జయజయరామ’ మంత్రాన్ని పదమూడుకోట్లసార్లు జపించారు. తర్వాత దేశమంతా తీర్థస్థలాలు పర్యటించారు. పండరీపురంలోనూ ఆయనకు ఆ రాముడే కనిపించాడు. అక్కడే ఆయన భక్త తుకారామ్ ను కూడా కలిసారు. ఆ కాలంలోని దేశ సామాజిక, రాజకీయ, ఆర్ధిక దుస్థితి చూసి ఆయనకు చాలా దుఖం కలిగింది. సాక్షాత్తు శ్రీరాముడే వీర శివాజీకి సహాయం చేయమని ఆదేశించినట్లు ఆయనకు తోచింది.   

కుల,భేదభావాలు

సమాజంలో కుల వైషమ్యాలు, ఒక పెద్ద వర్గం అవమానానికి గురై బాధ పడడం చూసి,  శ్రీ సమర్థగురు రామదాస్ ఎంతో మనస్తాపం చెందారు. ఈ భేదభావాలను సమూలంగా తొలగించడానికి సమాజాన్ని జాగృతం చేసే పనికి ఉపక్రమించారు. ఇదే విషయాన్ని తమ ప్రఖ్యాత `దాసబోధ’ గ్రంథంలో సైద్ధాంతికంగా తెలియచేస్తూ, `పెద్ద- చిన్న, రాజు- పేద, స్త్రీ -పురుష తారతమ్యాలు ఏమీ లేవు, అందరూ ఒకటే, అందరిలోనూ ఒకే పరబ్రహ్మము ఉంటాడు’ అని బోధించారు. `బ్రాహ్మణుడైనా, శూద్రుడైనా, రాజైనా, ప్రజలైనా, అందరిలోనూ పవిత్రమైన పరబ్రహ్మము ఒక్కటే’ అంటూ ఆయన సమస్త మానవులలోనూ ఒకే భగవత్ స్వరూపాన్ని దర్శించి, కుల విభేదాలని తోసిపుచ్చారు. అందరి హృదయాలను సంభాలించడమే దైవభజన అని చెప్పారు. `సంత్ చోఖామేలా’,`వర్కారి సంప్రదాయం’లో (శ్రీ పాండురంగ భక్తి సంప్రదాయం) `మహార్’కులానికి చెందిన స్వామీజీ గురించి వ్రాస్తూ… `అనాథనాథుడైన భగవంతునికి ఏ జాతి లేదు, ఆయన `చోఖామేలా’తో కూర్చుని పాలు, పెరుగు భోజనం చేస్తాడు’ అన్నారు. మరొకచోట వ్రాస్తూ `ఎక్కువ తక్కువ కులాలనే వ్యత్యాసం లేదు. హరినామ సంకీర్తనతో నిండిన అటువంటి వ్యక్తుల పవిత్ర పాదధూళికి నేను నమస్కరిస్తున్నాను’ అన్నారు. `ఇంకొకరి స్పర్శమాత్రం చేత అపవిత్రమైపోతే నీదేపాటి పవిత్రత? పెద్ద-చిన్న కులభేదాలను తోసిపుచ్చి అందరినీ హృదయపూర్వకంగా ప్రేమించండి, ఆదరించండి; అప్పుడే అందరి హృదయాలు పునీతమౌతాయి’ అన్నారు. 

`అంటరానివారి’తో భోజనం, దక్షిణ

చాఫల్ ప్రాంతంలో, భేర్వాడి గ్రామంలోని `అంటరానివాళ్ళు’ అనబడే దంపతులను, శ్రీ సమర్థగురు రామదాస్ తమ శ్రీరామనవమి ప్రవచనాలకు ఆహ్వానించారు. వారు `మాండ్’ నదిలో స్నానం చేసిన తరువాత, సంప్రదాయానుసారం వారిద్దరికీ చీర-ధోవతులు పెట్టి, సహపంక్తి భోజనం కావించి, దక్షిణ సమర్పించారు. ఆ కాలంలో ఈ సంఘటన ఒక గొప్ప విప్లవంగా పేర్కొనవచ్చని డా. సచ్చిదానంద పర్లికర్ తమ పుస్తకంలో వ్రాసారు, `కులం, వర్ణం, ప్రాంతం, భాషా భేదాల పేరుతో, మనుషుల మధ్య  అంతరాలు శ్రీ సమర్థగురు రామదాస్ గారికి ఎంతమాత్రం అంగీకారం కాదు’ అని వ్రాసారు.  శ్రీ సమర్థగురు రామదాస్ అంటారు. `భక్తిమార్గములో వెళ్లే ప్రతి వ్యక్తి పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడే, అన్ని వర్ణాలు దీనికి అర్హులే, చిన్నా-పెద్దా ఎవరూ లేరు, మూర్ఖుడైనా భగవంతుడి నామస్మరణతో భవసాగరాన్ని దాటవచ్చు. మంచి పనులు చేసే వ్యక్తి శ్రేష్టుడు, చెడు చేసేవాడు నికృష్టుడు, కర్మానుసారం మనుషులు పాపకర్మలు లేక పుణ్యకార్యాలు చేస్తుంటారు’ అని ఉద్బోధించారు.

దేశోద్ధారణ

ఆ కాలంలో భారతదేశం మీద ఇస్లాంమత దాడులనుంచి దేశాన్ని విముక్తం చేయడానికి శ్రీ సమర్థగురు రామదాస ప్రణాళికాబద్దంగా కృషి చేసారు. పవిత్ర కృష్ణానది ఉద్భవించిన మహాబలేశ్వర్ కొండలలో ఆయన ప్రధమంగా శ్రీ వీరహనుమాన్ దేవాలయం, మఠం నిర్మించారు; ఆ తరువాత 11 క్షేత్రాల్లో శ్రీ ఆంజనేయ దేవాలయాలు, మఠాలు స్థాపించారు. నెమ్మదిగా శ్రీ సమర్థగురు రామదాస్ మహారాష్ట్ర అంతటా వేయి హనుమాన్ మందిరాలు, అఖాడాలు నిర్మించారు.

ఆ కాలంలో పూర్తి దేశమంతా ముస్లింల చేతిలో హిందువులు ఎన్నో భయంకర దాడులకు, అత్యాచారాలకు గురౌతున్నారు. ఎన్నో ప్రాంతాల్లో రాజ్యాధికారం ముస్లిముల చేతిలోనే ఉంది. భక్తి ఉద్యమంతో పాటు, ముస్లిముల చేతుల్లోంచి అధికారం తిరిగి పొందడం కూడా దైవకార్యంగానే శ్రీ సమర్థగురు రామదాస్ భావించారు. `స్వరాజ్యం ధర్మకార్యం. పరమేశ్వరుని శిరసు మీద ధరించి, మన దేశాన్ని సర్వనాశనం చేసిన ముస్లిం రాజుల మీద యుద్ద్ధం ప్రకటించండి, దేశం కోసం ప్రాణాలను అర్పించడానికి వెనుకాడకండి’ అని శ్రీ సమర్థగురు రామదాస్ పిలుపు నిచ్చారు. `హిందూ ఆలయాలను ధ్వంసం చేసినవారు దైవద్రోహులు, అటువంటివారిని శిక్షించిన వారు దేవదాసులు, ఈశ్వరుని భక్తులు; ఈశ్వర భక్తులకి విజయం తధ్యం’.  అని అన్నారు

శ్రీరామనవమి మహోత్సవాలు

హిందూ సమాజాన్ని ఐకమత్యంతో ఒక్కతాటిపై తేవడానికి శ్రీ సమర్థగురు రామదాస్, శ్రీరామనవమి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆనాడు జరిగే  శ్రీరామ రథోత్సవాలలో, అన్ని కులాలు వర్గాలవారు ఎంతో ఉత్సాహంతో పాల్గొనేవారు.  

శిష్య పరంపర

శ్రీ సమర్థగురు రామదాస్ దేశ వ్యాప్తంగా హిందూ సమాజాన్ని జాగృతం చేసి, ఒక్కతాటిపై సమీకరించడానికి కృషి చేసారు. ఆయన తమ విస్తృత శిష్యపరంపర నుంచి, దాదాపు 1100మందిని `మహంత్’లుగా తీర్చిదిద్దారు, అందులో 300మంది మహిళలు, ఆనాటి సమాజంలో అది చాలా పెద్ద సంస్కరణ, ముందడుగు. వీరంతా దేశమంతా విస్తరించి, అనేక స్థానాల్లో, హిందూ సమాజాన్ని ఏకీకృతం చేసే పని నిర్వహించారు. వీరు కులాలకి అతీతంగా వేయి పైగా మఠాల స్థాపన చేసారు. తంజావూరు నుంచి కాశ్మీరు దాకా వ్యాపించిన ఈ మఠాలు, అఖాడాలు, ఛత్రపతి శివాజీ మహారాజుకి ఎంతో సహకారం అందించాయి. శివాజీ మహారాజు పుత్రుడు శ్రీ రాజారాం మహారాష్ట్ర విడిచి దక్షిణ భారతానికి వచ్చినపుడు, తంజావూరు మఠం ఆయనకు సర్వంసహా మద్దతు ఇచ్చినందువల్ల ఆయన ఇరవై సంవత్సరాల పాటు ఔరంగజేబుతో యుద్ధం చేయగలిగారు.

సాహిత్య రచనలు

హిందూ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీ సమర్థగురు రామదాస్ అనేక ఉత్కృష్ట రచనలు చేసారు. అందులో ప్రముఖమైనవి- `దాసబోధ’ `కరుణాష్టక్’ `మనాచే శ్లోక్’ `సుందరకాండ మరియు యుద్ధకాండ’. వేలాదిమంది కార్యకర్తలను సుశిక్షితులుగా తయారుచేసి, సామాజికంగా సంఘటితం చేయడానికి ఎనలేని కృషి చేసారు. `అందరి హృదయాలలో శ్రీరాముడు నివాసముంటాడు, కులభేదాలు పట్టుకువేళ్ళాడడం అంటే మనందరిలోని శ్రీరాముడి అస్తిత్వాన్ని నిరాకరంచడమే’ అన్నారు.  వెనకబడిన కులాలనబడే వారితో పనిచేసి, వారిని సంఘటితం చేసి ఛత్రపతి శివాజీ మహారాజుకి తోడుగా తెచ్చి నిలబెట్టారు.

 (`భారత్ కీ సంత్ పరంపర ఔర్ సమాజిక్ సమరసతా’ హిందీ గ్రంథం ఆధారంగా)

–  శ్రీ కృష్ణ గోపాల్ శర్మ

అనువాదం: ప్రదక్షిణ