RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

సమర్థ రామదాస స్వామి – సామాజిక సమరసత

శ్రీ సమర్థగురు రామదాస్ (విక్రమ. సం. 1665-1739; క్రీ.శ. 1608-1682)

గురు సమర్ధ రామదాస స్వామి జయంతి (17 ఫిబ్రవరి) సందర్భంగా……

సమర్థగురు రామదాసస్వామి ప్రపంచంలో మహాత్ములైన యోగులలో ఒకరు. మహారాష్ట్రలో `జామ్బ్’ అనే  గోదావరీతట ప్రాంతంలో జన్మించిన వీరు చిన్నతనం నుంచీ శ్రీరామ, శ్రీ ఆంజనేయ భక్తుడు. వివాహ సమయంలో పురోహితుడు ముహూర్త సమయానికి `సావధాన’(జాగ్రత్త) అనగానే లేచి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు.

అఖండ సాధన 

గోదావరీతట `నాసిక’ వద్ద శ్రీ సమర్థగురు పన్నెండు సంవత్సరాల కఠోర సాధన చేసారు. ప్రాతఃకాలం నుంచి మధ్యాహ్నం వరకు గోదావరి నీళ్ళల్లో నుంచుని గాయత్రీ మంత్రజపం చేసేవారు. శ్రీరామనామజపం `శ్రిరామజయరామ జయజయరామ’ మంత్రాన్ని పదమూడుకోట్లసార్లు జపించారు. తర్వాత దేశమంతా తీర్థస్థలాలు పర్యటించారు. పండరీపురంలోనూ ఆయనకు ఆ రాముడే కనిపించాడు. అక్కడే ఆయన భక్త తుకారామ్ ను కూడా కలిసారు. ఆ కాలంలోని దేశ సామాజిక, రాజకీయ, ఆర్ధిక దుస్థితి చూసి ఆయనకు చాలా దుఖం కలిగింది. సాక్షాత్తు శ్రీరాముడే వీర శివాజీకి సహాయం చేయమని ఆదేశించినట్లు ఆయనకు తోచింది.   

కుల,భేదభావాలు

సమాజంలో కుల వైషమ్యాలు, ఒక పెద్ద వర్గం అవమానానికి గురై బాధ పడడం చూసి,  శ్రీ సమర్థగురు రామదాస్ ఎంతో మనస్తాపం చెందారు. ఈ భేదభావాలను సమూలంగా తొలగించడానికి సమాజాన్ని జాగృతం చేసే పనికి ఉపక్రమించారు. ఇదే విషయాన్ని తమ ప్రఖ్యాత `దాసబోధ’ గ్రంథంలో సైద్ధాంతికంగా తెలియచేస్తూ, `పెద్ద- చిన్న, రాజు- పేద, స్త్రీ -పురుష తారతమ్యాలు ఏమీ లేవు, అందరూ ఒకటే, అందరిలోనూ ఒకే పరబ్రహ్మము ఉంటాడు’ అని బోధించారు. `బ్రాహ్మణుడైనా, శూద్రుడైనా, రాజైనా, ప్రజలైనా, అందరిలోనూ పవిత్రమైన పరబ్రహ్మము ఒక్కటే’ అంటూ ఆయన సమస్త మానవులలోనూ ఒకే భగవత్ స్వరూపాన్ని దర్శించి, కుల విభేదాలని తోసిపుచ్చారు. అందరి హృదయాలను సంభాలించడమే దైవభజన అని చెప్పారు. `సంత్ చోఖామేలా’,`వర్కారి సంప్రదాయం’లో (శ్రీ పాండురంగ భక్తి సంప్రదాయం) `మహార్’కులానికి చెందిన స్వామీజీ గురించి వ్రాస్తూ… `అనాథనాథుడైన భగవంతునికి ఏ జాతి లేదు, ఆయన `చోఖామేలా’తో కూర్చుని పాలు, పెరుగు భోజనం చేస్తాడు’ అన్నారు. మరొకచోట వ్రాస్తూ `ఎక్కువ తక్కువ కులాలనే వ్యత్యాసం లేదు. హరినామ సంకీర్తనతో నిండిన అటువంటి వ్యక్తుల పవిత్ర పాదధూళికి నేను నమస్కరిస్తున్నాను’ అన్నారు. `ఇంకొకరి స్పర్శమాత్రం చేత అపవిత్రమైపోతే నీదేపాటి పవిత్రత? పెద్ద-చిన్న కులభేదాలను తోసిపుచ్చి అందరినీ హృదయపూర్వకంగా ప్రేమించండి, ఆదరించండి; అప్పుడే అందరి హృదయాలు పునీతమౌతాయి’ అన్నారు. 

`అంటరానివారి’తో భోజనం, దక్షిణ

చాఫల్ ప్రాంతంలో, భేర్వాడి గ్రామంలోని `అంటరానివాళ్ళు’ అనబడే దంపతులను, శ్రీ సమర్థగురు రామదాస్ తమ శ్రీరామనవమి ప్రవచనాలకు ఆహ్వానించారు. వారు `మాండ్’ నదిలో స్నానం చేసిన తరువాత, సంప్రదాయానుసారం వారిద్దరికీ చీర-ధోవతులు పెట్టి, సహపంక్తి భోజనం కావించి, దక్షిణ సమర్పించారు. ఆ కాలంలో ఈ సంఘటన ఒక గొప్ప విప్లవంగా పేర్కొనవచ్చని డా. సచ్చిదానంద పర్లికర్ తమ పుస్తకంలో వ్రాసారు, `కులం, వర్ణం, ప్రాంతం, భాషా భేదాల పేరుతో, మనుషుల మధ్య  అంతరాలు శ్రీ సమర్థగురు రామదాస్ గారికి ఎంతమాత్రం అంగీకారం కాదు’ అని వ్రాసారు.  శ్రీ సమర్థగురు రామదాస్ అంటారు. `భక్తిమార్గములో వెళ్లే ప్రతి వ్యక్తి పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడే, అన్ని వర్ణాలు దీనికి అర్హులే, చిన్నా-పెద్దా ఎవరూ లేరు, మూర్ఖుడైనా భగవంతుడి నామస్మరణతో భవసాగరాన్ని దాటవచ్చు. మంచి పనులు చేసే వ్యక్తి శ్రేష్టుడు, చెడు చేసేవాడు నికృష్టుడు, కర్మానుసారం మనుషులు పాపకర్మలు లేక పుణ్యకార్యాలు చేస్తుంటారు’ అని ఉద్బోధించారు.

దేశోద్ధారణ

ఆ కాలంలో భారతదేశం మీద ఇస్లాంమత దాడులనుంచి దేశాన్ని విముక్తం చేయడానికి శ్రీ సమర్థగురు రామదాస ప్రణాళికాబద్దంగా కృషి చేసారు. పవిత్ర కృష్ణానది ఉద్భవించిన మహాబలేశ్వర్ కొండలలో ఆయన ప్రధమంగా శ్రీ వీరహనుమాన్ దేవాలయం, మఠం నిర్మించారు; ఆ తరువాత 11 క్షేత్రాల్లో శ్రీ ఆంజనేయ దేవాలయాలు, మఠాలు స్థాపించారు. నెమ్మదిగా శ్రీ సమర్థగురు రామదాస్ మహారాష్ట్ర అంతటా వేయి హనుమాన్ మందిరాలు, అఖాడాలు నిర్మించారు.

ఆ కాలంలో పూర్తి దేశమంతా ముస్లింల చేతిలో హిందువులు ఎన్నో భయంకర దాడులకు, అత్యాచారాలకు గురౌతున్నారు. ఎన్నో ప్రాంతాల్లో రాజ్యాధికారం ముస్లిముల చేతిలోనే ఉంది. భక్తి ఉద్యమంతో పాటు, ముస్లిముల చేతుల్లోంచి అధికారం తిరిగి పొందడం కూడా దైవకార్యంగానే శ్రీ సమర్థగురు రామదాస్ భావించారు. `స్వరాజ్యం ధర్మకార్యం. పరమేశ్వరుని శిరసు మీద ధరించి, మన దేశాన్ని సర్వనాశనం చేసిన ముస్లిం రాజుల మీద యుద్ద్ధం ప్రకటించండి, దేశం కోసం ప్రాణాలను అర్పించడానికి వెనుకాడకండి’ అని శ్రీ సమర్థగురు రామదాస్ పిలుపు నిచ్చారు. `హిందూ ఆలయాలను ధ్వంసం చేసినవారు దైవద్రోహులు, అటువంటివారిని శిక్షించిన వారు దేవదాసులు, ఈశ్వరుని భక్తులు; ఈశ్వర భక్తులకి విజయం తధ్యం’.  అని అన్నారు

శ్రీరామనవమి మహోత్సవాలు

హిందూ సమాజాన్ని ఐకమత్యంతో ఒక్కతాటిపై తేవడానికి శ్రీ సమర్థగురు రామదాస్, శ్రీరామనవమి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆనాడు జరిగే  శ్రీరామ రథోత్సవాలలో, అన్ని కులాలు వర్గాలవారు ఎంతో ఉత్సాహంతో పాల్గొనేవారు.  

శిష్య పరంపర

శ్రీ సమర్థగురు రామదాస్ దేశ వ్యాప్తంగా హిందూ సమాజాన్ని జాగృతం చేసి, ఒక్కతాటిపై సమీకరించడానికి కృషి చేసారు. ఆయన తమ విస్తృత శిష్యపరంపర నుంచి, దాదాపు 1100మందిని `మహంత్’లుగా తీర్చిదిద్దారు, అందులో 300మంది మహిళలు, ఆనాటి సమాజంలో అది చాలా పెద్ద సంస్కరణ, ముందడుగు. వీరంతా దేశమంతా విస్తరించి, అనేక స్థానాల్లో, హిందూ సమాజాన్ని ఏకీకృతం చేసే పని నిర్వహించారు. వీరు కులాలకి అతీతంగా వేయి పైగా మఠాల స్థాపన చేసారు. తంజావూరు నుంచి కాశ్మీరు దాకా వ్యాపించిన ఈ మఠాలు, అఖాడాలు, ఛత్రపతి శివాజీ మహారాజుకి ఎంతో సహకారం అందించాయి. శివాజీ మహారాజు పుత్రుడు శ్రీ రాజారాం మహారాష్ట్ర విడిచి దక్షిణ భారతానికి వచ్చినపుడు, తంజావూరు మఠం ఆయనకు సర్వంసహా మద్దతు ఇచ్చినందువల్ల ఆయన ఇరవై సంవత్సరాల పాటు ఔరంగజేబుతో యుద్ధం చేయగలిగారు.

సాహిత్య రచనలు

హిందూ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీ సమర్థగురు రామదాస్ అనేక ఉత్కృష్ట రచనలు చేసారు. అందులో ప్రముఖమైనవి- `దాసబోధ’ `కరుణాష్టక్’ `మనాచే శ్లోక్’ `సుందరకాండ మరియు యుద్ధకాండ’. వేలాదిమంది కార్యకర్తలను సుశిక్షితులుగా తయారుచేసి, సామాజికంగా సంఘటితం చేయడానికి ఎనలేని కృషి చేసారు. `అందరి హృదయాలలో శ్రీరాముడు నివాసముంటాడు, కులభేదాలు పట్టుకువేళ్ళాడడం అంటే మనందరిలోని శ్రీరాముడి అస్తిత్వాన్ని నిరాకరంచడమే’ అన్నారు.  వెనకబడిన కులాలనబడే వారితో పనిచేసి, వారిని సంఘటితం చేసి ఛత్రపతి శివాజీ మహారాజుకి తోడుగా తెచ్చి నిలబెట్టారు.

 (`భారత్ కీ సంత్ పరంపర ఔర్ సమాజిక్ సమరసతా’ హిందీ గ్రంథం ఆధారంగా)

–  శ్రీ కృష్ణ గోపాల్ శర్మ

అనువాదం: ప్రదక్షిణ