RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

శ్రీ అయ్యప్పస్వామి – మకరజ్యోతి

మకరజ్యోతి, మకరవిళక్కులకు శబరిమలతో అనుబంధం ఉంది. మకరజ్యోతి, మకరవిళక్కు రెండూ ఒకటేనని  చాలా మంది భక్తులు నమ్ముతారు. ఇది కొంతమందిలో ఒక సాధారణ అపోహ

మకరవిలక్కు అనేది  పొన్నంబలమేడు వద్ద నిర్వహించే కర్పూర ఆరాధన. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి అంటే ఇంచుమించు జనవరి 14-15 తేదీల్లో మకరవిలక్కు రోజు వస్తుంది. పురాణాల ప్రకారం, పొన్నంబలమేడులో కర్పూర ఆరాధనను దేవతలు, తరువాత మహర్షులు, ఆ తరువాత మలయాళరాయలు నిర్వహించారని నమ్ముతారు. మకర సంక్రాంతి రోజున అయ్యప్పస్వామి దేవస్వం బోర్డు ఉద్యోగులు, అయ్యప్ప భక్తులు పొన్నంబళమేడుకు సురక్షితంగా చేరుకుని కర్పూరం వెలిగిస్తారు.   దీనిని అలంకారాత్మకంగా మూడుసార్లు వెలిగిస్తారు.

మకరజ్యోతి అంటే ఆకాశంలో కనిపించే నక్షత్రం అని అర్థం. మకర మాసం మొదటి రోజున  ఒక్క క్షణం మాత్రమే నిలిచే నక్షత్రాన్ని మకరజ్యోతి అంటారు. సూర్యాస్తమయం తర్వాత నక్షత్రం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ అది కొద్దికాలంలోనే మాయమైపోతుంది. ఇది ఆ స్థల భౌగోళిక స్థితిని బట్టి జరుగుతుందికానీ విశ్వాసం ప్రకారంపందళం నుండి శబరిమలకు తిరువాభరణం (దేవతల పవిత్ర ఆభరణాలు) తీసుకువచ్చిన రోజున నక్షత్రం కనిపిస్తుంది.

 

 

పొన్నంబళమేడు: ఆచారాలు, నమ్మకాలు

మకరవిలక్కును చూసేందుకు లక్షలాది మంది శబరిమలకు వెళ్తుంటారు. కేరళ అటవీ శాఖ పరిధిలోని పొన్నంబళమేడు వద్ద మకర దీపం వెలిగిస్తారు. రోజున, అంటే మకరజ్యోతి దర్శనమిచ్చినప్పుడు, పొన్నంబలమేడు వద్ద కర్పూర హారతి నిర్వహిస్తారు.  దీనిని మకరవిలక్కు అని పిలుస్తారు. ఇది స్పష్టంగా మానవ సంకల్పం.  శబరిమల ఆలయంలో మాదిరిగానే, విగ్రహం వద్ద ఉండే  హారతి జ్వాలల వలనే ఈ మకారవిలక్కును వెలిగిస్తారు.  అయ్యప్పస్వామి పట్ల భక్తికి ప్రతీకాత్మకంగా మకరవిలక్కును మూడుసార్లు వెలిగిస్తారు. అయితే ఇదే సమయంలో ఉదయించే నక్షత్రాన్ని మకరజ్యోతి అనీ, పొన్నంబళమేడు వద్ద చేసే హారతిని మకరవిలక్కు అనీ  పిలుస్తారు.

మకరసంక్రమణం రోజున మకరజ్యోతి దర్శనమిస్తుంది. ఇది హిందువులకు పవిత్రమైన రోజు. సూర్యుడు దక్షిణాయణం (శీతాకాలం) నుండి ఉత్తరాయణానికి (వేసవి) ప్రవేశించే రోజు ఇది. రోజున ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో మకరజ్యోతిని చూడవచ్చు. అంతేకాక  ఇది  భూగోళ దృగ్విషయం. విధంగా శబరిమల సన్నిధానం అనేది మకరజ్యోతిని చూడదగిన ప్రాంతంకాలక్రమేణా దట్టమైన అడవుల్లో నివసిస్తున్న గిరిజనులు పొన్నంబలమేడు వద్ద పరివర్తన సమయంలో నిప్పులు వెలిగించి పూజలు చేశారుఅంటే మానవులు తమ విశ్వాసం, ఆరాధనలో భాగంగా వెలిగించిన అగ్ని మకరవిలక్కుగా పిలువబడే మకరజ్యోతి భూలోక స్వరూపం. శబరిమల నుండి ఈ మకరజ్యోతిని చూడదగిన భూభాగం పొన్నాంబలమేడుఒకప్పుడు పొన్నంబళమేడు వద్దనే  ఆలయం ఉండేదని పూర్వీకులు చెప్పేవారు. ఇప్పటికీ అక్కడ ఒక పురాతన ఆలయ అవశేషాలు ఉన్నాయి. అంతేకాక అక్కడ శ్రీచక్రంతో చెక్కిన రాతి పీఠం  ఉందని కూడా చెబుతారు.

ఉత్తరాయణం మకరసంక్రమణం (సూర్యుడు శీతాకాలం నుండి వేసవి సంక్రాంతికి పరివర్తన చెందే రోజు) తో ప్రారంభమవుతుంది. హిందూ విశ్వాసం ప్రకారం, మకరసంక్రమణాన్ని దేవతల బ్రహ్మ ముహూర్తంగా భావిస్తారు. కాబట్టి, ఇది కూడా అనేక విశిష్ట లక్షణాలతో కూడిన సమయం. మకరజ్యోతిని కొన్ని సెకన్లు మాత్రమే చూడగలం. ఇది నక్షత్రం లాగే కనిపిస్తుంది. అయితే, ప్రదేశం యొక్క భౌగోళిక లక్షణాల కారణంగా, ఇది మన దృష్టి నుండి త్వరగా అదృశ్యమవుతుంది.

చరిత్ర మరియు విశ్వాసాలు 

శబరిమలకు, పందళం   రాజకుటుంబానికి ఉన్న సంబంధాన్ని పరిశీలిద్దాం. అయ్యప్పన్, పందళం రాజకుటుంబానికి చెందినవాడు. అసాధారణ యుద్ధ నైపుణ్యం ఉండి ఆత్మశక్తి ద్వారా తపశ్శక్తిని పొందిన యువకుడు తరువాత కాననవిహార సమయంలో శబరిమల ప్రాముఖ్యతను తెలుసుకున్నాడు. రాజకుటుంబంలోని అంతర్గత సమస్యల కారణంగా ఇంటిని విడిచిపెట్టి, పులి పాలను వెతుక్కుంటూ అడవి గుండా ప్రయాణించి రాణి కోరిక మేరకు పులిపాలను  పొందడం, తన యోగశక్తితో శత్రువులను ఓడించి మహిషి విగ్రహంగా మారడం వంటి కథలు   పురాణాల రూపంలో నేటికీ లభ్యమవుతున్నాయి. పందళం అప్పుడు పాండ్య రాజవంశంతో సంబంధం కలిగి ఉంది. పందళం ప్రాంతంలోని కొందరు తిరుమల నాయకన్ కు భయపడి పాండ్య భూమి నుండి వచ్చారు. పందళం రాజవంశానికి ట్రావెన్కోర్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. అయ్యప్పన్ గా పేరొందిన మణికందన్ దేశాన్ని అభివృద్ధి చేశాడుఅనేక  శత్రురాజులను  ఓడించిన తరువాత, అయ్యప్ప తన రాజ్యాధికారాన్ని, విలాసాలను విడిచిపెట్టి, తీక్షణమైన ధ్యానం మరియు కఠినమైన ఆధ్యాత్మిక శోధనలో  అడవికి వెళ్ళాడుతపసంపన్నుడైన ఆయన తరువాత నేటి శబరిమలలో ఉన్న ఆలయంలోని విగ్రహంలో ఐక్యమయినాడు.  మకరజ్యోతి దర్శనమిచ్చే పద్దెనిమిది పర్వతాల మధ్య ఉన్న భూమి ఎంతో పవిత్రమైనదిపూర్వం ఆ ప్రాంతంలోనే దట్టమైన  అడవిలో ఆలయం ఉండి ఉంటుందని భావిస్తున్నారు.

 

 

దట్టమైన అడవిలో ఉన్నందున శబరిమలలోని ఇతర దేవాలయాల మాదిరిగా ప్రతిరోజూ పూజలు చేయడం అసాధ్యం. కాబట్టి, పూజలు చేయడం కొన్ని సమయాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. మకరవిళక్కు రోజుతో పాటు కొన్ని ఇతర దినాలలో శబరిమలలో ప్రత్యేక పూజలు  నిర్వహిస్తారు. మకరసంక్రమణం రోజున జరిగే పూజ చాలా ప్రసిద్ధమైనది.  సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకరసంక్రమణ  పూజ చేస్తారు. ప్రత్యేకమైన రోజున అయ్యప్ప స్వామి విగ్రహాన్ని తిరువాభరణంతో అలంకరిస్తారు.  ఇది పూజతో పాటు జరిగే ముఖ్యమైన వేడుక. పందళం రాజు శబరిమల అయ్యప్ప స్వామికి పితామహుడిగా నిలుస్తాడు. రాజకుటుంబంలో అత్యంత పెద్ద వయస్కుడు అయిన వ్యక్తి  అయ్యప్ప కోసం పందళం వదిలి,  నాటి రాజు చేసిన దేవత యొక్క పవిత్ర ఆభరణాలను (తిరువాభరణం) తీసుకుని  ప్రజల వెంట శబరిమలకు వెళ్తాడుతిరువాభరణం మూడు పేటికల్లో తీసుకెళ్తారు. రోజున గరుడుడు తిరువాభరణంతో కలిసి నడుస్తాడాని కూడా నమ్ముతారు. మకరవిళక్కు తర్వాత రోజే అయ్యప్పస్వామిని ఏనుగుపై మణిమండపం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి పవిత్రమైన పద్దెనిమిది మెట్ల వైపు తీసుకువచ్చి తిరిగి శ్రీకోవిల్ (గర్భగుడి)లో ప్రవేశపెడతారు.

శబరిమల దక్షిణ భారతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతదేశంలో హిందూ ధర్మాన్ని, తత్వాన్ని నిర్మించడంలో, బలోపేతం చేయడంలో ఆలయం కీలక పాత్ర పోషించిందిశబరిమలకు వెళ్ళే ముందు భక్తులు సనాతన ధర్మశాస్త్రం అనుసరించి దీక్ష స్వీకరిస్తారు.   సమయంలో ధ్యానం, స్వీయ నియంత్రణ మరియు ధర్మ బద్ధంగా తన జీవితాన్ని గడపడంలో దీక్షాధారులు కంకణబద్ధులై ఉంటారు.   శబరిమలను సందర్శించడానికి దీక్షాబద్ద్ధులై ఉన్నవారి ఇంట్లోని ప్రతి ఒక్కరూ ధ్యానం మరియు భక్తితో కాలం గడుపుతారు.  శ్రీ ధర్మశాస్త లేదా శ్రీ అయ్యప్పగా ప్రసిద్ధి చెందిన శబరిమలలోని దేవత  భారతీయ విశ్వాస వ్యవస్థలో అంతర్భాగం, ఇది రెండవ అయ్యనార్, అయ్యప్ప, శాస్త వంటి విభిన్న  గుర్తింపులతో భక్తులను  ఏకం చేస్తుందిశబరిమల విశ్వాసాలకు ముప్పు మొత్తం హిందూ సంస్కృతికి ముప్పు. శబరిమల హిందూ ఐక్యతకు, తత్వానికి ప్రతీక