RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

నవయుగ కవి చక్రవర్తి, కవి కోకిల, కవితా విశారద, మధుర శ్రీనాథ వంటి బిరుదులతో అలరారిన జాషువా అచ్చమైన జాతీయ భావాలు కలిగిన గొప్ప దేశభక్తుడు. గుర్రం జాషువా 1895 సెప్టెంబర్ 28 న గుంటూరు జిల్లా వినుకొండలో గుర్రం వీరయ్య లింగమాంబ దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులు క్రైస్తవ మతావళంబికులైనప్పటికీ జాషువా మాత్రం అచ్చమైన జాతీయవాదిగా ఈ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని అందిపుచ్చుకొని మహాకవిగా ఎదిగాడు.
దేశమంటే ఎనలేని ప్రేమ. ఈ దేశ సంస్కృతి పై అచంచలమైన విశ్వాసం, అంతులేని గౌరవం వెరసి జాషువా విశ్వనరుడైనాడు.

ఆయన సాహిత్య తాత్విక భూమిక ఏమిటంటే విశ్వ మానవ కల్యాణం, సమాజపు అసమానతలు తొలగి మానవులంతా సమానం అనే భావనను పాదుకొల్పడం.తెలుగు నుడికారాన్ని, సీస పద్యాల చమత్కారాన్ని,ప్రాచీన పద్యపు ఇంపును, తెలుగు భాషా ఆధునిక సొంపును అక్షరక్షరంలో ఒంటబట్టించుకున్న కవి జాషువా. పదలాలిత్యంతో పాఠకులనందరిని ఆకట్టుకున్న కళా ప్రపూర్ణులు వారు.నాటి సామాజిక అసమానతలు, కుల పట్టింపులు, కులవివక్ష జాషువా హృదయాన్ని కలసివేశాయి. జాషువా ఎదుర్కొన్న కుల వివక్ష,ఎదురైన తిరస్కారాల అనుభవాలు ఆయనలో భావావేశ తీవ్రతను పెంచి కవిత్వ రూపంలో ఆవిష్కృతం చేశారు. అసమ సమాజం బాకులు గుమ్మినప్పుడు, అంటరానితనం విషాజ్ఞులు  చిమ్మినప్పుడు, దుర్భర దారిద్యం వెన్నాడినప్పుడు,దురంతవేదన గుండెల్లో తుకతుక ఉడికినప్పుడు జాషువా గుర్తుకొస్తాడన్న సినారే మాటలు అక్షర సత్యాలు. అంతమాత్రాన జాషువా ఈ సంస్కృతిని, ఈ దేశాన్ని ఏనాడు తులనాడలేదు. ఈ దేశంలో ఉన్న వివక్షను ఏకిపారేశాడే కానీ తన రాతల ద్వారా ఈ దేశంపై, ఈ సంస్కృతిపై, ఈ ధర్మంపై ద్వేషాన్ని నింపలేదు.

తన ఆవేదనను తన ఆక్రోశాన్ని వెల్లడించాడే తప్ప ఈ సంస్కృతి మీద అక్కసు వెళ్ళగక్కలేదు. ఈ సమాజంలో తన రచనల ద్వారా అశాంతిని నింపలేదు.వేర్పాటు వాదాన్ని, విభజన సిద్ధాంతాన్ని ప్రోత్సహించలేదు. పైపెచ్చు ద్విగుణీకృతమైన జాతీయ భావజాలాన్ని, తన గుండెల నిండా నింపుకొని దేశమాతను కీర్తించిన గొప్ప దేశభక్తుడు జాషువా..తన మొదటి ఖండకావ్యంలోనే మొట్టమొదటి ఖండికలో భరతమాతను కీర్తించడంతోనే తన ఖండకావ్యాల రచన ప్రారంభించడం వారికి గల దేశభక్తి నిదర్శనం.

సగరమాంధాత్రాది షట్చక్రవర్తుల
యంకసీమల నిల్చినట్టి సాధ్వి,
కమలనాభుని వేణుగానసుధాంబుధి
మునిఁగి తేలిన పరిపూత దేహ,
కాళిదాసాది సత్కవికుమారులఁ గాంచి
కీర్తినందిన పెద్ద గేస్తురాలు,
బుద్ధాదిమునిజనంబుల తపంబున మోద
బాష్పము ల్విడిచిన భక్తురాలు.

సింధుగంగానదీజలక్షీర మెపుడుఁ
గురిసి బిడ్డలఁ బోషించుకొనుచు నున్న
పచ్చి బాలెంతరాలు మా భరతమాత
మాతలకు మాత, సకలసంపత్సమేత.

సకల సంపత్సమేత అనడంతో బంకించంద్రుని వందేమాతరం గుర్తుకు రావడం ఖాయం. నేడు ఈ దేశాన్ని వ్యంగ్యంగా చిత్రిస్తూ భారత్ ను మాత అనడమేమిటంటూ వెకసక్కాలాడుతూ హేళన చేస్తున్న ముష్కర మూకలకు జాషువా ఈ పద్యం సమాధానం చెబుతుంది. విభజన వాదుల నోళ్లకు తాళం వేసే విధంగా అమ్మ భారతిని అద్భుతంగా, మరింకెవరు   గుర్తించలేనంత గొప్పగా భరతమాతను పచ్చి బాలింతరాలు అనడం

మా భరతమాత మాతలకు మాత సకల సంపత్సమేత
అంటూ పేర్కోవడం జాషువా దేశభక్తికి నిదర్శనం.

జాషువా కలం నుండి జాలువారిన ప్రతి అక్షరం ఆలోచనత్మకమైనదే అది ఒక్కొక్కసారి అగ్నిని రగిలిస్తే మరొక్కసారి కరుణాంబుధులను కురిపిస్తుంది ఒకసారి సమాజంలోని ఆ సమానతపై ఎప్పుడు పెట్టిన ఇల్లు అవుతుంది. మరొకసారి దేశమాతను కీర్తించే మంత్రమే సాగుతుంది . వారి కవిత్వం మానవజాతి శ్రేయస్సు కోసం వాడినా ఇంద్రుని వజ్రాయుధం.అది విశ్వ కల్యాణమే పరమావధిగా సాగి జాతీయ భావజాల చైతన్య స్రవంతిగా మారి నిరంతరం ఈనాటికి ప్రతి దేశభక్తుని గుండెను తడుతూనే ఉంది.

భరత ఖండంబు నా పాఠశాల
భాగవతంబు నా బాలశిక్ష

అంటూ ఈ దేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఎంతో గౌరవాన్ని,భక్తిని ప్రదర్శిస్తాడు. అనూచానంగా వస్తున్న సంప్రదాయాన్ని గౌరవిస్తూనే సమాజంలో నెలకొన్న వైషమ్యాలను,తారతమ్యాలను, హెచ్చుతగ్గులను నిరసిస్తూ, నిలదీస్తూ తన కవిత్వాన్ని ఝలిపిస్తాడు.

ఆనందంబున నీ సహోదరులు విద్యాస్వీకృతిం జెందినా
రీనా డల్లదె శుభ్రవస్త్రములతో నేతెంచుచున్నారు నీ
తో నిత్యోచిత దైవపూజకని; సంతోషంబునన్ జేర నీ వేని న్నీ వొక రాక్షసాకృతిని సుమ్మీ భారతీనందనా :

అంటరానితనం కూడదని వెనుకబడిన వారంతా నీతో కలిసి నడవడానికి వస్తున్నారని వారిని మీతో కలుపుకోవాలని కలుపుకుపోవాలని చెప్తూ రాక్షస ప్రవృత్తి సరైనది కాదని నిరసిస్తాడు ఇలా జాషువా తన కవిత్వం అంత ప్రజలు భేదాభిప్రాయాలు మర్చిపోయి అందరూ ఒకటే అని భావనతో భరతమాతను సేవించాలని కాంక్షించాడు

భరతమాత భారత వీరుడు తెలుగు తల్లి ఆంధ్రుడు శిశువు గిజిగాడు శిల్పి కృష్ణానది అఖండ గౌతమి శ్రద్ధాంజలి రాష్ట్ర పూజ నేతాజీ బాపూజీ శివాజీ వివేకానందుడు వంటి వివిధ ఖండికల్లో తన ఇతర కావ్యాల్లో దేశభక్తిని జాతీయతను ఉద్దీపింపజేసిన అచ్చమైన జాతీయ కవి జాషువా

నా దేశం బిది, రత్నగర్భ, కవిరాణ్మత్తేభముల్ పూర్ణమ ర్యాదల్ మేలిసువర్ణ వర్షములనభ్యర్చావిధానంబులన్ మోదంబందిన తావు, వీరపురుష స్ఫూర్జత్ ప్రతాపాగ్నికిం బాదంచున్ గళమెత్తిపాడుకొనునీభక్తుండ హిందూరమా

నా రత్నగర్భాని నా దేశ కీర్తిని ఔన్నత్యాన్ని గొంతెత్తి పాడుకుంటానని అమ్మ భారతి భక్తుడనని సగౌరవంగా చాటుకుంటూ దేశమాతను హిందూ రమా అంటాడు జాషువా . ఇంత గొప్పగా జాతీయ భావజాల ప్రకటన చేసిన తెలుగు కవులల్లో జాషువా మొదటి వరుసలో నిలుస్తాడు.ఆవు అనే ఖండికలో

నీ/ విడు సర్వస్వము నారగించుచు కృపా హీనమ్ములై వార్తకం
బడరందూలు నిన్ను వధించెడు మనుష్య వ్యాఘ్రముల్ క్రూరముల్

అంటూ ఆవును వధించే వారిని క్రూర జంతువులైన పులులతో పోల్చడం చూస్తే జాషువాకు ఈ సంస్కృతిలో భాగమైన ఆవు పైన భక్తి ఎంత ఉందో మనం ఊహించవచ్చు. ఈ దేశ సంస్కృతి పై ఎంత మమకారాన్ని చూపించాడో అంతకంటే తీవ్రంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ సమానతలపై స్పందించాడు అంతేకాకుండా క్రైస్తవంలో కూడా కులం ఆధారంగానే వ్యక్తుల గుర్తింపు జరుగుతుందనే బాధతో ఆ విషయంపై కూడా ఘాటుగా స్పందిస్తాడు ఇంటిగుట్టు అనే ఖండికలో

మాల యేసుక్రీస్తు మాదిగలకు గాడు
మాదిగేసుక్రీస్తు మాకు గాడు
ఒకడు చిలువరించు నొకడు స్నానం బిచ్చు
నిరువు రేక మగుట కేది దారి

అని తన ఆవేదనను వెలిబుచ్చుతాడు. అంతేకాకుండా క్రైస్తవులు హిందువులను చూసి ఎగతాళి చేస్తున్నారు ఇతరుల తప్పులను ఓర్చుకునే సహృదయత మనకు లేకపోవడం దారుణం అని చెప్తూ

హిందువులను చూసి యెగతాళి చేసెద
మింటనున్న మురికి కేవగింపు!
మొరుల తప్పిదంబు లోరుచుకొనలేము
సొంత తప్పు మాకు చురుకు లేదు !!

అంటూ ఇతరులను చూసి ఎగతాళి చేసే వారికి గట్టిగా చెరుకు పెడతాడు. జాషువా లోని దేశభక్తి, సాంస్కృతిక అనురక్తి విదేశి మత ప్రేరితులకు నచ్చలేదేమో అందుకే క్రైస్తవ సమాజం వీరిని దూరం పెట్టింది.
జాషువా రాసిన ఖండకావ్యాలల్లో చాలా వాటిలో ఈ దేశం పట్ల ఈ సంస్కృతి పట్ల అవ్యాజమైన ప్రేమ అచంచలమైన దేశభక్తి అడుగడుగునా కనబడతాయి వీరి వివేకానంద అనే ఖండికలో

తెలవార్వేళఁగషాయదీధితుల నుత్తీర్ణత్వముంజెందువె ల్గులఱేనింగనుశ్వేతజాతులకు,మాగోసాయి కాషాయ కాం
తుల భ్రాంతు ల్తలయెత్త, ‘నల్లదె: నరేంద్రుల్ పండితుల్ గేలుమోడ్పులమన్నించిన భారతీయముని, చూడుం’ డండ్రుషస్సంధ్యలన్

ఈ దేశ ప్రతీక అయిన కాషాయ వస్త్రాలు ధరించిన నరేంద్రని దివ్యకాంతులు శ్వేత జాతీయులకు భయానకమైన భ్రాంతులను కలుగజేస్తున్నాయని గొప్పతాత్విక నేపథ్యాన్ని చిత్రీకరిస్తాడు. అలాగే తన వీరపూజ అనే ఖండికలో

నెఱికురులమీఁద బంగారునీలమణులు
వెలయు చందాన నెమిలి కన్నులు రహింప
వెన్నుఁడు రథంబు నడిపిన వీరభూమి
స్వచ్ఛమానస గంగమ్మ సంచరించు!

అంటూ శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని గంగమ్మ స్వచ్ఛతను పవిత్రతను అద్భుతంగా చిత్రిస్తాడు.
జాషువా ప్రతి రచన ఒక గొప్ప కళాఖండం. వారి కవిత్వం అంతా వేదన చెందిన జీవుని ఆవేదననే, అంతరంగా ఆవిష్కరణనే.. తన జీవితమంతా భారత జాతి సమైక్యత కోసం దేశ ప్రజలందరినీ సమానంగా చూడడం కోసం పడిన తాపత్రయంగా చెప్పవచ్చు. ఇందుకోసం భారతీయ సాంస్కృతిక మూలాలను కీర్తిస్తూ తన కవిత్వ భూమికను తాత్విక నేపథ్యంగా ఎంచుకొని సామాజిక చైతన్యం కోసం నిరంతరం తపించిన తాపసి జాషువా. అందుకే జాషువా అచ్చమైన స్వచ్ఛమైన జాతీయ కవి విశ్వమంతా నిండిన విశ్వ నరుడు.

జైహింద్.
గాజుల రవీంద్ర