RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

వేములవాడ రాజన్న ఆలయ చరిత్ర

సామాన్య శకం 8వ శతాబ్దంలో నిర్మించిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారమై విలసిల్లుతోంది. కోరిన కోరికలు తీర్చే వేములవాడ రాజన్న ఆలయం ఎంతో పురాతన ప్రాశస్త్యం కలిగినది. పశ్చిమ చాళుక్యల వారికి ఈ ప్రాంతం రాజధానిగా వుండేదని పురాతత్వ ఆధారాలు తెలుపుతున్నాయి. దానిప్రకారం క్రీ.శ. 8వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించబడినట్లు ఆధారాలున్నాయి.

ఆనాటి వేములవాడ ప్రాంతానికి మొదటి చాళిక్యరాజు అయిన నరసింహుడు రాజుగా ఉండేవారు. ఆయనకు ‘రాజాదిత్య’ అనే బిరుదు ఉండేది. ఆయన పేరు మీదుగానే ఈ ఆలయానికి రాజరాజేశ్వర ఆలయం అని పేరు వచ్చిందని చరిత్రకారులు అభిప్రాయపడుతుంటారు.

చాళిక్యుల కాలంలో ఈ క్షేత్రం మహామహివాన్విత క్షేత్రంగా వెలుగొందని చరిత్రకారుల అంచనా. ఈ ఆలయం చుట్టూ వున్న దేవాలయాలను నిర్మించడానికి ఆనాటి చాళిక్యుల కాలంలో సుమారు 220 సంవత్సరాల కాలం పట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయ లింగ ప్రతిష్ట వెనుక కూడా ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం అర్జునుడి మునిమనవడయిన నరేంద్రుడు ఒక మునిని చంపడం వల్ల అతనికి బ్రహ్మ హత్యాపాతకం కలుగుతుంది. దాని నుండి విమోచన పొందడం కోసం నరేంద్రుడు దేశాటన చేస్తూ వేములవాడ ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడే వున్న ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తూ కాలాన్ని గడిపాడు.

 

 

అలా ఆవిధంగా జపం చేస్తున్న నరేంద్రునికి ఒకరోజు కొలనులో ఒక శివలింగం దొరికిందట. ఆ శివలింగాన్ని అతను ఇప్పుడున్న వేములవాడ ప్రాంతంలో ప్రతిష్టించి భక్తితో పూజించడం మొదలుపెట్టాడు. శివుడు అతడి భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నరేంద్రుడు తనని బ్రహ్మ హత్యాపాతకం నుండి విమోచనం చేయవలసిందని కోరగా… శివుడు అతడికి విముక్తి ప్రసాదిస్తాడు.

ఇలా ఈవిధంగా ఏర్పడిన ఈ క్షేత్రం ‘లేంబాల వాటిక’గా, ‘భాస్కర క్షేత్రం’, ‘హరిహర క్షేత్రం’గా పిలవబడింది. ఈ రాజేశ్వర ఖండంకు సంబంధించిన కథ భవిష్కోత్తర పురాణంలో వివరంగా చెప్పబడి వుంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా 100 మంది అర్చకులతో ఈ మహాలింగానికి అర్చన చేయబడుతుంది.

 

ఇక్కడ భక్తులు నిర్వహించుకునే ప్రధాన పూజలలో కోడెముక్కు ఒకటి. ఈ పూజలో మొదటగా భక్తులు ఒక గిత్తను తీసుకుని గుడిచుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో దానిని కట్టేసి, దక్షిణగా ఇచ్చేస్తారు. ఈ విధంగా ఈ పూజను నిర్వహించుకోవడం వల్ల వారికి సంతానం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.

 

మనదేశంలో అనేక హిందూ దేవలయాలనానుకుని విదేశీ దూరాక్రమనదారులచే నిర్మింపబడిన మసీదులూ, దర్గాలూ ఉన్నట్లే మన వేములవాడ దేవాలయం పరిక్రమలో కూడా ఒక అక్రమ దర్గా నిర్మింపబడింది. ఈ అక్రమ మసీదులు, దర్గాల నిర్మాణం గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 

హిందూ దేశం తన సుదీర్ఘమైన చరిత్రలో ఎన్నో విదేశీ దండయాత్రలను ఎదుర్కోవలసి వచ్చింది. అటువంటి దండయాత్రలను ఎదిరించటమే గాక, ఆ ఆక్రామకులను తరిమికొట్టిన చరిత్ర హిందువులకు ఉన్నది. కాగా క్రీ.శ. 712లో బాగ్దాద్లోని అరబ్ పాలకుల ద్వారా పంపబడిన మొహమ్మద్ బిన్ కోసం దండయాత్రతో మొదలుకొని కొన్ని శతాబ్దాలపాటు హిందువులు జీవన్మరణ సమస్యగా దాపురించిన అనేక దండయాత్రలను ఎదుర్కోవలసి వచ్చింది. అనుక్షణమూ పోరాడుతూ గడపవలసి వచ్చింది. క్రీ.శ.712 నాటి అరబ్బుల దండయాత్ర నుండి క్రీ.శ 1707లో ఔరంగజేబ్ మరణం వరకూ గల కాలఖండం ఒక సుదీరమైన పీడకల. ఐరోపాలో ‘నూరు సంవత్సరాల యుద్ధం’గా వర్ణింపబడిన యుద్ధముకు ఇంగ్లాండ్, ఫ్రాన్సు దేశాల మధ్య సంభవించింది. కాగా ఇక్కడ మనదేశంలో  హిందువులు ఆక్రామకులుగా వచ్చిన మహమ్మదీయులతో వేయిసంవత్సరాలపాటు యుద్ధం సాగించవలసి వచ్చింది.

 

ముస్లింల ఈ దండయాత్రలలో చెప్పనలవి కాని బాధలకు, అంతకు ముందెన్నడూ వినియండని దుస్సహమైన అవమానాలకు ఇక్కడి ప్రజలను గురిచేశారు. ఒకరి తర్వాత ఒకరుగా గుంపులు గుంపులుగా రాక్షసమూకలుగా వచ్చిన ఆక్రామకులు ఈ దేశాన్ని మృత్యుసాగరంలోకి త్రోసివేయ యత్నించారు. తమ సేనలలోని యువకులను రెచ్చగొట్టారు. ఇలా దుష్కృత్యాలు సాగిపోతున్న సమయంలో హిందువులు ఎంతో నిబ్బరంగా వాటిని ఎదుర్కొన్నారు. హిందువులు శారీరకంగా ఎన్నో బాధలు పడి ఉండవచ్చు కాని తలవంచలేదు. ఆక్రామకులు ఎన్నో విధాలుగా హిందువులను గాయపరచి ఉండవచ్చు. అయిన హిందువులు తమ వినమ్రతను సహజమైన మంచిగుణాన్ని వదిలిపెట్టలేదు. భయంకరమైన నరమేధం, బలవంతంగా మతాంతరీకరణలు, స్త్రీల అపహరణములు, దేవాలయాల విధ్వంసము నిత్యకృత్యాలుగా జరిగిపోతున్న రోజులలో సైతం హిందువులు ఎంతగా ధైర్యం వహించి, ఈ ఆపదలను సహించారో, ఓర్చుకున్నారో తెలిసికొన్నపుడు ఎంతటివారైనా అవాక్కవుతారు. తమకు ఎదురే లేదు అనుకొని విర్రవీగిన వారిని హిందువులు నిలువరించి సవాలు చేశారు. జయం లభించినా కూడా కొన్ని చోటల మనకున్న ఆధ్యాత్మిక భావన వలన విదేశీ దురాక్రమణ దారుల సమాధులను దర్గాల పేరుతో  మనం పూజించడం చూస్తున్నాం.  అలాంటి వాటిలో వేముల వాడ లోని మహశివలింగంతో పాటుగా హజరత్ దర్గాని కూడా పూజించడం జరుగుతోంది. ఆ దర్గాకి సంభందించిన కొన్ని వివరాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాము.

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయములో ఉన్న హజరత్ బాబ ఖాజ దర్గా రూపంలో వున్న సమాధి ఒక కీచకుడిది. వేములవాడలో కొలువైన శివలింగం అత్యంత పవిత్రమైన క్షేత్రం. ఈ శివలింగాన్ని దర్శించుకోడానికి వందలాది హిందువులు వచ్చేవారు. నిత్యం రకరకాల అభిషేకాలతో శివలింగాన్ని పూజించుకునేవారు మన హిందువులు. ఆ సమయంలో నైజాం పాలకుల్లో ఒకడైన “హజరత్ ఖాజ” తన బలగాలతో హిందూ భక్తుల పై దాడిచేసి, హిందువులు పరమపవిత్రంగా పూజించే మహాశివలింగంపై మూత్రం పోసి అపవిత్రం చేశాడు. దానిని శుద్ధీకరణ చేసి హిందువులు ఆ మహా శివలింగాన్ని పూజించారు.

 

ఇది తెలిసిన ఆ హజరత్ ఖాజా, మళ్ళీ వాడి సైన్యంతో వచ్చి హిందువులపై దాడి చేసి తిరిగి  మూత్రవిసర్జన చేసాడు. ఇలా ఆ దుష్ట ముస్లీము హిందువులపై హిందూ దేవుళ్ళపై దాడులు చేశాడు. మహాశివరాత్రి రోజున వేములవాడలో శివలింగానికి అభిషేకం చేస్తున్న సమయంలో హజరత్ ఖాజ తన  సైన్యంతో వచ్చి హిందువులపై విచ్చలవిడిగా దాడులు చేస్తూ శివలింగం పై మూత్రవిసర్జన చేస్తున్న సమయంలో శివభక్తులు అందరూ కలిసి ఆ హజరత్ ఖాజ అనబడే దుర్మార్గుడిని చంపివేసారు.. ఈ విషయాన్ని తెలుసుకున్న నైజాం పాలకులు వేములవాడ చేరుకొని విచక్షణా రహితంగా, దుర్మార్గంగా హిందువులపై దాడులుచేసి అనేకమంది శివభక్తులను చంపివేసి మహిళల మానప్రాణాలు చెరిపి, ఆ హజరత్ ఖాజ దుర్మార్గుడి శవాన్ని అక్కడే శివలిగానికి ఎదురుగా పాతిపెట్టి, సమాధి కట్టి హజరత్ బాబ ఖాజ దర్గాగా మార్చి శివలింగాన్ని దర్శించుకునే హిందువులందరూ ముందుగా ఆ హజరత్ ఖాజ అనే కీచకుని దర్గాను దర్శించుకోవాలని ఆంక్షలు విధించారు. ఆ విధంగా విధించబడిన బలవంతపు  ఆంక్షలు, కాలక్రమేణా ఓ రివాజుగా మారి నేటికీ అనేకమంది హిందువులు ఆ దర్గా అని పిలువబడే ఒక పాశవికుని సమాధిని దర్శిస్తూనే ఉన్నారు.

హిందూ జాతిపై, హిందూ దేవుళ్ళ విగ్రహాలపై, హిందూ స్త్రీలపై, దాడులు చేసిన హజరత్ బాబ ఖాజ దర్గా వేములవాడ పవిత్ర రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉండడం మన జాతికి ఓ కళంకం. అటువంటి కళంకితుడైన ఓ దుష్టుడిని దర్శించుకోవడం ఎంతవరకూ సహేతుకం అన్నది హిందూ బంధువులందరూ ఆలోచించాలి. దేవాలయ పరిక్రమలోనుండి దర్గాగా  పిలువబడే అ సమాధిని తొలగించిననాడే  హిందూ సమాజానికి నిష్కృతి.