RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

గోవా స్వాతంత్రోద్యమ చరిత్ర

-ప్రదక్షిణ

 

గోవా విమోచన దినం- 19 డిసెంబర్ 1961

వేలాదిమంది ఉద్యమకారులు పోర్చుగీస్ ప్రభుత్వంతో చేసిన ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ స్వాతంత్ర్య సంఘర్షణ ఫలితంగా గోవా విమోచనం 1961లో జరిగింది. ఇది వినడానికి వింతగా అనిపించినా, భారత దేశానికంతా ఒకేసారి 1947లో స్వాతంత్ర్యం రాలేదనే విషయం, ఇప్పటి భారత ప్రజలకే తెలియదు. గోవా, దమన్ మరియు దీయు ప్రాంతం పోర్చుగీస్ పాలనలో 1961దాకా ఉండగా; పాండిచ్చేరి, మాహే, యానం నగరాలు ఫ్రెంచ్ ప్రభుత్వం క్రింద 1954 వరకు ఉన్నాయని తెలిస్తే ఆశర్యపోతాము.

గోవా విమోచనోద్యమం 20వ శతాబ్దపు తొలి దశకంలో ప్రారంభమైనా, అది ఊపు అందుకోడానికి చాలా కాలమే పట్టింది.

లూయిస్ బ్రగాంకా 1917లో పోర్చుగీస్ దినపత్రికను, ఆ ప్రాంత విమోచన కోసం రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించగా, పోర్చుగీస్ ప్రభుత్వం అన్ని స్వతంత్ర పత్రికలను, ప్రచురణాలయాలను బలవంతంగా మూసివేసి ప్రజలకు పౌరహక్కులు లేకుండా చేసింది. పోర్చుగీస్ కాథలిక్ చర్చ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, వారు శతాబ్దాలుగా సాగిస్తున్న దమన రాజకీయాలను కొనసాగిస్తూ, క్రిస్టియన్లు పోర్చుగీస్ రాజ్యంలో ఉండాలని, భారత్ తో వారికి ఎలాంటి సంబంధం ఉండకూడదని చర్చిల్లో బోధిస్తుండేవారు.

1928 లో `ట్రిస్టూ బ్రగాంకా కున్హా’, గోవా కాంగ్రెస్ స్థాపించి, దానిని అఖిల భారత కాంగ్రెస్ కి అనుబంధంగా చేసినప్పటికీ, పోర్చుగీస్ ప్రభుత్వ ఒత్తిడితో కాంగ్రెస్ పార్టీ స్తబ్దుగా ఉండిపోయింది, 1938లో బొంబాయి నగరంలో గోవా కాంగ్రెస్ ప్రారంభమైంది. 1940లలో భారతదేశం యావత్తు స్వాతంత్ర్య కాంక్షతో రగులుతుండగా, గోవాలో కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి, అయితే పోర్చుగీస్ ప్రభుత్వం వాటిని నిరంకుశంగా అణిచివేసింది. 1946లో `కున్హా’ని నిర్బంధించగా, ఎ.జి తెoడుల్కర్ గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు అయారు. డా. రాంమనోహర్ లోహియా, ఆయన మిత్రుడు అయిన గోవా నాయకుడు డా.మెనెజెస్ 1946లో సహాయనిరాకరణ ఉద్యమం ప్రారంభించగా, వారిద్దరినీ అరెస్ట్ చేసి తరువాత విడుదల చేసారు. ఆ సమయంలో వేలాదిమందిని జైల్లో పెట్టారు. బ్రగాంకా కున్హా, పురుషోత్తం కాకోడ్కర్, లక్ష్మీకాంత్ భెమ్బ్రే మొదలైన నాయకులను లిస్బన్ తరలించి అక్కడ జైల్లో నిర్బంధించారు. ఆ తరువాత ఉద్యమాలు ఎన్ని జరిగినా, పోర్చుగీస్ ప్రభుత్వం అందరు నాయకులను జైల్లో పెట్టింది e persoDaksha,  e. గాంధీగారి సలహాతో అక్కడి కార్యకర్తలు `క్విట్ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంబించారు. 1947లో తమతో సహా భారతదేశమంతటా స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని గోవా ఉద్యమ నాయకత్వం నమ్మింది. అయితే అనూహ్యంగా డా. లోహియా గోవా ప్రజలు తమ స్వాతంత్ర్య ఉద్యమాన్ని కొనసాగించాల్సి ఉంటుందని ప్రకటించారు. కొందరు స్థానిక నాయకులు గోవాని స్వయంప్రతిపత్తి కల దేశంగా పోర్చుగీస్ కామన్వెల్త్’లో ఉంచాలని కోరారు.

గోవాలో స్వాతంత్ర ఉద్యమం ముమ్మరంగా సాగుతూ కీలక దశకు చేరింది. ఆ కాలంలో `ఆజాద్ గోమంతక్ దళ్’ నాయకులు విశ్వనాథ్ లావండే, నారాయణ్ హరినాయక్, దత్తాత్రేయ దేశపాండే, ప్రభాకర్ శినారి మొదలైన వారు పోలీస్ స్టేషన్లపై దాడి చేసి, పోర్చుగీస్, అంగోలా జైళ్లలో బంధింపబడ్డారు. శివాజీరావు దేశాయి స్థాపించిన `గోవా లిబరేషన్ ఆర్మీ’ ఒక ప్రభుత్వ గనిని పేల్చేసింది. శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తున్న పిడి గైతోండే వంటి ఎందరో నాయకులు 1954లో జైలు పాలయారు.

మొట్టమొదటిసారి 1955లో పణజీ సచివాలయంపై, భారత త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఘనత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేత శ్రీజగన్నాథ్ రావు జోషికి చెందుతుంది; ఇతర పార్టీలతో కలిసి సత్యాగ్రహం చేస్తున్న వేలాదిమంది స్వయంసేవకులు, జనసంఘ్ కార్యకర్తలు అరెస్ట్ అయారు. ఎందరో కాల్పులకి గురై అమరులయారు; కొందరు పోర్చుగీస్ జైళ్లలో ఎన్నెన్నో సంవత్సరాల నరకయాతన అనుభవించారు. 1961లో గోవా విమోచన తరువాత కూడా శ్రీ జగన్నాథ్ జోషి విడుదల అవక, 17సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. అట్లాగే డా. గైతోండే, శ్రీయుత్ దేశపాండేలను కూడా  పోర్చుగీస్ తరలించి అక్కడి జైళ్లలో బంధించారు.

1954–55 తరువాత ఉద్యమం మరింత ముమ్మరoగా సాగింది.  1955లో పోర్చుగీస్ ప్రభుత్వం సత్యాగ్రహులపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపగా ఎందరో ప్రాణత్యాగం చేసారు. ఉజ్జయినికి చెందిన స్వయంసేవకుడు శ్రీ రాజాభావ్ మహంకాళ్ అక్కడినుంచి వేలాది కార్యకర్తలతో గోవాలో ప్రవేశించి సత్యాగ్ర్రహం చేసారు.  మొదటి మూడు వరుసల సత్యాగ్రహులు నేలకి ఒరగగా, సహోదరా దేవి అనే మహిళా కార్యకర్త, జాతీయజెండా అందుకుని ముందుకి వెళ్ళగా, ఆమె కూడా దెబ్బలకి ఒరిగిపోయింది. అప్పుడు శ్రీ రాజాభావ్ ఆమెనుంచి జెండా అందుకుని ముందుకి ఉరికి, ఇతర కార్యకర్తలకి అప్పగించి జెండా ఎగురవేసేలా చూసారు. ఆయన కళ్ళల్లో బుల్లెట్లు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలి అమరులయారు.

భారత ప్రభుత్వ వైఖరి

డిసెంబర్1947లో స్వతంత్ర భారతదేశం, నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు, పోర్చుగీస్ దేశంతో దౌత్య సంబంధాలు ఏర్పరచి, గోవాని భారతదేశంలో విలీనం చేయాలని కోరారు, అయితే దానికి పోర్చుగీస్ అంగీకరించలేదు. (అలాగే పాండిచేరి విలీనంపై ఫ్రాన్స్ అంగీకరించలేదు). 1950 దశకంలో, భారత- పోర్చుగీస్ సంబంధాలు బలహీనమై, భారత ప్రభుత్వం `ఐక్యరాజ్యసమితి’ ద్వారా ఒత్తిడి తేవాలని కొంత ప్రయత్నించింది. అయితే దురదృష్టవశాత్తు గోవాలోని స్వాతంత్ర్య పోరాటానికి, భారత ప్రభుత్వం నుంచి పెద్దగా సహకారం అందలేదు. భారతీయ కార్యకర్తలు, పోర్చుగీస్ రాజ్యంలోకి ప్రవేశించి, వారి సార్వభౌమత్వాన్ని వమ్ము చేస్తున్నారని, పోర్చుగీస్ అంతర్జాతీయంగా ఒత్తిడి తేవడంతో, ప్రధాని నెహ్రూ సత్యాగ్రహుల చర్యలకు ప్రభుత్వ ఆమోదం లేదని ప్రకటన కూడా చేసారు.

నెహ్రూ ప్రకటనతో గోవా స్వాతంత్ర్య ఉద్యమం తీవ్రంగా దెబ్బతింది. 1954లో కొందరు సత్యాగ్రహులు, ముందు దాద్రా, ఆ తరువాత నాగర్-హవేలీలలో, పోర్చుగీస్ సైన్యంపై దాడి చేసి పోరాడి గెలిచి, ఆ ప్రాంతాలకు విముక్తి కలిగించారు. (దీనిపై పోర్చుగీస్ `అంతర్జాతీయ న్యాయస్థానం’ లో కేసు కూడా వేసింది, అయితే అది ఎటూ తేలలేదు). అయినా భారత ప్రభుత్వం ఈ ప్రాంతాలను, దేశంలో విలీనం చేయలేదు; అవి చాలా కాలం `వరిష్ట పంచాయత్’ పేరుతో స్వతంత్రంగా కొనసాగాయి.  అయితే గోవాలోని ఉద్యమం ఈ విజయంతో బలం పుంజుకుంది. ఆరు స్థానిక పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి, స్వాతంత్ర్య ఉద్యమం ఉధృతం చేసాయి. చివరికి డిసెంబర్1961లో, గోవాలో జరుగుతున్న ఉద్యమం, దాని అణచివేతను ఇకపై చూస్తూ ఊరుకోము అని ప్రధాని నెహ్రూ హెచ్చరించారు. భారత సైన్యం గోవా సరిహద్దుల చుట్టూ మొహరించబడింది. 18-19డిసెంబర్1961లో అతి సునాయాసంగా పోర్చుగీస్ సైన్యం లొంగిపోగా, పోర్చుగల్ `లొంగుబాటు ఒప్పందం’పై సంతకం చేసింది. 1963లో గోవాని భారతదేశంలో విలీనం చేస్తూ భారత పార్లమెంట్ తీర్మానించింది. గోవా, దామన్, దీయు  కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించబడింది. దాద్రా నగర్-హవేలీ వేరొక  కేంద్రపాలిత ప్రాంతం అయింది. 1987లో గోవా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఇటీవలే అంటే డిసెంబర్ 2019లో దామన్, దీయు, దాద్రా నగర్-హవేలీలను కలిపి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా పార్లమెంట్ ఆమోదించింది.

ఆధారం:  vsktelangana