RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

అద్దంకి లోని గార్ధభ శాసనం

గార్దభశాసనం

ఈ శాసనం అద్దంకిలోని వినాయకుడి గుడికి దక్షిణంగా, జాతీయ రహదారికి ఆవలగా ఒకప్పుడు ఉండేది. జాతీయ రహదారి తన ఎత్తును పెంచుకుంటూ భూమిపొరల్లో ఈ శాసనాన్ని దాచేసింది. రహదారి విస్తరణ శాసనం యొక్క నోరు నొక్కేసింది. శాసనాన్ని భూమిపొరల్లో దాచేసింది. ఈ శాసనాన్ని మా తరంతో పాటు ఇప్పటితరంకూడా చూశారు. శాసనం పైభాగంలో సూర్య చంద్రులు మధ్యలో శివలింగంఅడుగున గాడిద బొమ్మను చిత్రించారు. అనగా పరమేశ్వరుని సాక్షిగా సూర్యచంద్రులుండే దాకా ఈ శాసన విషయం సత్యమని అర్థం. మరి శాసనంపై గాడిద బొమ్మ ఎందుకు? ఈ గ్రామంలో (అద్దంకిలో నూటొక్క బావులు, నూటొక్క గుళ్ళు లేవనే వాడు గాడిదకడుపున పుడతాడనేది శాసన విషయం. మనకిప్పుడు గ్రామంగా కనపడే అద్దంకి ఒకప్పటి తెలుగువారి రాజధాని. ఇంకొక విషయమేమిటంటే ఈ శాసనం రెడ్డిరాజుల నాటిది కాదని చెప్పవచ్చును. ఎంచేతనంటే రెడ్డిరాజుల నాటికి అద్దంకి వారి రాజధాని. గ్రామం మాత్రం కాదు. రాజధాని హెూదా కోల్పోయిన తర్వాత అద్దంకి ఒక గ్రామంగా మారి ఉండవచ్చును. ఆ సందర్భంలో అద్దంకి గొప్పదనాన్ని చెప్పడానికి వేసిన శాసనంగా దీన్ని భావించవచ్చును. మరొక విషయం కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేస్తున్నది. అది ఏమిటంటే అద్దంకి కోట చుట్టు ఒక్క రెడ్డి గారి పాలెం కూడా లేదు. చుట్టుపక్కల రెడ్డి గార్లుండే పల్లెలు ఉన్నాయి కాని కోట చుట్టూ లేవు. అద్దంకిలోని ప్రముఖ దేవాలయాల జాబితా ఇలా ఉంది.

అద్దంకి కోటకు వెలుపల వేయిస్థంభాల గుడి, వినాయకుడి గుడి కలదు. ఇవి హైదరాబాద్, ఒంగోలు పోయే జాతీయరహదారికి ఇరువైపులా కలవు. రహదారికి పడమటగా వేయిస్థంభాల గుడి, తూర్పుగా వినాయకుడి గుడి. వినాయకుడి గుడికి ఎదురుగా నిలబడి ఉన్న గార్దభశాసనం ఇలాంటి గుళ్ళు మా ఊళ్ళో నూరునొక్కటి గలవని చెప్పేది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అద్దంకికి గొప్ప స్థానం ఉంది. ఇంతేగాక చారిత్రాత్మకమైన ప్రాధాన్యత కలదు. ఊరికి ఉత్తరాన ఉన్న అద్దంకి కొండలో రాక్షస గూళ్ళు కలవు. దీనిని బట్టి అద్దంకి ఒక జనావాసయోగ్యమైన పురాతన ప్రదేశంగా గమనించవచ్చును. గొప్ప సైనికస్థావరమని(బోయకొట్టము) అద్దంకి పండరంగని పద్యశాసనం చెబుతుంది. పద్యశాసనం తెలుగువాడు తల ఎత్తుకుని తిరిగేలా చేసింది. పూర్తి ఛందస్సుగల తరువోజ పద్యంతో మన భాష ప్రాచీనతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. రెడ్డి రాజుల రాజధానిగా తెలుగువారి శౌర్యపరాక్రమాలను, తెలుగువెలుగులను దేశం నలుదిశలా చాటింది. అద్దంకి కళలకు కాణాచిగా విఖ్యాతినొందింది. అర్థాంతరంగా ఆగిపోయిన శేషభారతాన్ని పూరించింది.
ఆలయాలతోరణంగా వెలసిల్లింది.

గార్దభశాసన విషయానికి వస్తే నుయ్యి ఇంట్లో వాడకానికి పనికి వచ్చే జలవనరు. బావి అంటే ఊరి మొత్తానికి పనికి వచ్చే జలవనరు. ఆ ప్రకారం చూస్తే అద్దంకి గ్రామంలో నూటొక్క బావులున్నాయంటే నూటొక్క పాలేలు
ఉన్నాయని అర్థం. ఆ పాలేలలో పాలెంకు ఒక గుడి చొప్పున నూటొక్క దేవాలయాలు ఉన్నాయని అవగతమౌతుంది.
అద్దంకి కోటకు చుట్టూ ఈ పాలేలు ఆనుకొని ఉన్నాయి. కోటలోకి రావాలంటే ఈ పాలేలను దాటుకుంటూ లోనికి ప్రవేశించాలి. అద్దంకి లోని ప్రసిద్ధ దేవాలయాలు వరుసగా

1)వేయిస్థంభాల గుడి 2)శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం, పాత అద్దంకి. 3) శ్రీ రామలింగేశ్వరస్వామి వారి ఆలయం 4) పోలేరమ్మ గుడి 5)శ్రీ కాళికా సమేత కమఠేశ్వర స్వామి వారి ఆలయం 5)శ్రీ మాధవ స్వామివారి దేవాలయం 6) వినాయకుని గుడి 7) శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయం 8)శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం 9)శ్రీ రంగనాయక స్వామి వారి ఆలయం 10)శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం 11)నాంచారమ్మ గుడి 12 గంగమ్మ గుడి 13)గాజుల పాలెం శివాలయం. 14) సింగరకొండ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం 15)సింగరకొండ ఆంజనేయస్వామి వారి ఆలయం.

ఇవి గాక అద్దంకి చుట్టుపక్కల చిన్న చిన్న దేవాలయాలు ఉండవచ్చును. అద్దంకి కోట చుట్టూ ఉండే పాలేలు 1)చినగానుగపాలెం, 2) పెద గానుగ పాలెం. 3) పసుమర్తి వారిపాలెం. 4)గురకాయపాలెం. 5) బలిజపాలెం, 6) నర్రావారి పాలెం. 7)గుంజివారి పాలెం, 8)గాజుల పాలెం. 9) చాకలిపాలెం 10) పెరికపాలెం. 11)కట్టక్రిందపాలెం 12)కాకానిపాలెం. 13) దామావారిపాలెం. 14) నంబూరివారిపాలెం. 15) మొండితోకపాలెం 16) ముతరాసువారి పాలెం 17) పొలిమి పాలెం 18)నాగులపాలెం 19)బోడెంపూడి వారి పాలెం. 20)నృసింహ పాలెం. 21)బత్తుల వారి పాలెం. 22) దూదేకుల పాలెం. 23) వడ్డెర పాలెం 24)యాదవపాలెం 25)కడెంపాలెం 26) ముదామువారిపాలెం 27)గుర్రంవారిపాలెం  28)కోటవారిఅగ్రహారం 29)ముజావారి పాలెం 30)కాటిపాపలపాలెం. ఇవి గాక కోటకు నాలుగైదు మైళ్ళలోపు ఉండే గ్రామాలు 31) నాగులపాలెం 32) జాళ్ళపాలెం 33)చెర్వుకొమ్ముపాలెం 34) బొమ్మనంపాడు 35) కశ్యపురం 36) కలవకూరు 37)ధర్మవరం 38) సింగరకొండపాలెం 39)గోపాలపురం 40)చక్రాయపాలెం 41)తిమ్మాయపాలెం 42)రామాయపాలెం 43)కొటికలపూడి 44)తిమ్మారెడ్డిపాలెం 45)అనమనమూరు 46) మణికేశ్వరం 47) యర్రబాలెం 48) బొడ్డువానిపాలెం 49)
విప్పర్లవారిపాలెం 50) కొంగపాడు 51)వేలమూరిపాడు 52) వెంకటాపురం 53)నృసింహపుర అగ్రహారం. ఏతా వాతా చెప్పొచ్చేది ఏమిటంటే కోటలోపల రాజులు, రాజబంధువుల పరివారము ఆహారం, అవసరాల కోసం కోటచుట్టూ వృత్తులవారీ కుటుంబాలు పాలేలుగా ఏర్పడ్డాయనిపిస్తుంది. అద్దంకి రాజధాని వైభవం నుండి గ్రామస్థాయికి వచ్చేసరికి అద్దంకి గ్రామ పరిథిలోని కొన్ని పాలేలు కాలక్రమేణా రక్షణ కోసం, రాజాశ్రయాల కోసం, బ్రతుకుతెరువు కోసం వెళ్ళి
ఉండవచ్చును. ఎవరు వేయించారో ఈ శిలాశాసనం తెలియదు కాని అద్దంకికి సంబంధించిన చాలా ముచ్చట్లు తెలుసుకునే అవకాశం కలిగింది. మా అద్దంకిలో అనేక దేవాలయాలు, అనేక పాలేలు ఉన్నాయన్న సంగతి చెప్పిన ఈ శాసనం భూమి పొరల్లో దాగున్నది. ఎప్పటికి బయటకు వస్తుందో మనం వేచి చూద్దాం.

-పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి