RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

శ్రీ కురుమూర్తి స్వామి వారి ఉద్దాలోత్సవం

వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

కార్తికమాసం బ్రహ్మోత్సవాలతో శ్రీ కురుమూర్తి జాతర ఆరంభమవుతుంది.. జాతర మొదటి రోజు నుండి ముగిసే వరకు స్వామివారి భక్తులకు ప్రతిరోజు పండుగే ..! జాతర. వచ్చిందంటే పల్లెల నుండి ఎద్దుల బండ్లల్లో వచ్చి వచ్చి నాలుగైదు రోజులు అక్కడే మకాం వేసుకునే వాళ్ళు. ఇప్పటికీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఎద్దులబండ్లతో పాటుగా సొంత లేదా ప్రయివేటు వాహనాల్లో వస్తున్నారు. ఈ భక్తులు స్వామివారికి సంబంధించిన ఆ ఏడు గుట్టల పొడవునా గుడారాలు వేసుకుని జాతర ఆనందాన్ని ఆస్వాదిస్తుంటారు.

జాతరలో ప్రధాన ఘట్టం. ” ఉద్దాలోత్సవం ” ఈ ఉద్దాల ఉత్సవంలో స్వామివారి పాదుకలను కొత్త చాటలో ఉంచి ఉద్దాల మండపం వద్దకు తీసుకు వస్తారు. స్వామివారికి ఉద్దేశించిన పాదుకలను ఉద్దాలు అనడం ఆనవాయితీ.

▪️ఉద్దాలు వివరణ

బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు (1903 ),
బహుజనపల్లి సీతారామాచార్యులు గారి శబ్దరత్నాకరము (1912 ) ,
శంకరనారాయణ గారి తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు ( 1953),
కొట్ర శ్యామలకామశాస్త్రి గారి ఆంధ్ర వాచస్పత్యము (1953 ),
ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారి తెలుగు వ్యుత్పత్తి కోశం (1978 )
రవ్వా శ్రీహరి గారి శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు ( 2004 )

ప్రకారం ఉద్దాలు లేదా ఉద్దములు అనగా పాదరక్షలు, పాదరక్షణము, జోళ్ళు అని చెప్పబడింది.

పాదములు కిర్రుకిర్రని పలుకుచుండి కుచ్చుటుద్దాలు చేపట్టుకోలయమర

▪️ ఉద్దాల తయారీలో గిరిజన , దళితుల వర్ణాల ప్రాముఖ్యత :

కురుమూర్తి ఆలయంతో ఎరుకల మేదరి కులస్థులకు , దళితులకు, విడదీయరాని అనుబంధం ఉన్నది.

వివరాలు గమనిస్తే…

పల్లమర్రికి చెందిన మేదర కులస్తులు ప్రత్యేకంగా చాటను తయారు చేస్తారు. దీపావళి అమావాస్య రోజు చాట తయారీ ప్రారంభించి ఉత్సవం నాటికి పూర్తి చేసి దళితులకు భక్తి శ్రద్దలతో అందజేస్తారు.

చిన్న వడ్డెమాన్‌ గ్రామంలో దళితుల సమక్షంలో ఆవు చర్మంతో స్వామి వారి పాదుకలను దళితులే తయారు చేస్తారు. సమీప నల్లమల అడవుల్లో తిరిగే ఆవులను పులులు చంపుతుంటాయి. పులి వేటలో చనిపోయిన ఆవుల చర్మాన్ని సేకరించి ప్రతి ఏడాది కురుమూర్తికి కొత్త చెప్పులు కుడతారు.
దీపావళి అమావాస్య రోజు నుంచి వారం రోజుల పాటు నియమ నిష్ఠలతో ఉపావాస దీక్షలతో ఉద్ధాలు తయారు చేస్తారు.

ఈ క్రమంలో మొదట చాటను పల్లమర్రిలో గ్రామంలో ఊరేగిస్తారు. తర్వాత పొరుగు గ్రామాలైన లాల్ కోట ,నెల్లికొండి,పెద్ద వడ్డేమాన్ గ్రామాల మీదుగా ఊరేగింపుగా తెచ్చి చిన్న వడ్డేమాన్ గ్రామానికి వస్తారు. ఈ క్రమంలో చాట ఊరేగింపును పురస్కరించుకుని భక్త జనులు గ్రామ గ్రామాన చాట ఆశీర్వాదం కోసం బారులు తీరుతారు. వరుసలుకట్టి కూర్చున్న జనాల మీదనుండి చాటను తీసుకువెళ్తూ
ఉమ్మడిగా ఆశీర్వాదం అందిస్తుంటారు.

చాట వడ్డేమాన్ గ్రామాన్ని చేరుకునే సమయానికి… అక్కడ ఉద్దాలను (పాదుకలను) సిద్ధం చేసి , చాట కోసం భక్తజన సందోహం ఎదురుచూస్తూ ఉండి ఉంటుంది.

తయారుచేసి ఉంచిన స్వామి వారి పాదుకలను
ఆ చాటలో వుంచి ఆనవాయితీగా పూజలు నిర్వహిస్తారు. తర్వాత అప్పంపల్లె శివారు నుండి ఊకచెట్టు వాగులో చాటతో సహా స్వామి వారి పాదుకలను మోస్తూ తిర్మలాపూరం గ్రామానికి చేరుతారు. ఈ ఊరేగింపులో భక్తజనులు ఆశీర్వాదం కోసం బారులు తీరుతారు. ఇక్కడ భక్తజనుల సంఖ్య రెట్టింపు అవుతుంది.

తిరుమలాపురం పూలతో అలంకరించిన వాహనంలో పాదుకలను అంగరంగవైభవంగా ఊరేగిస్తూ కురుమూర్తిస్వామి గుట్టలో ఉన్న ఉద్ధాల మండపానికి చేరుస్తారు. రాజుల కాలంలో ఏనుగులను, తరువాత కాలంలో ఊరేగింపుకు ఎద్దుల బండి ఉపయోగించేవారు.

ఊరేగింపు తర్వాత పాదుకలను మండపంలో ఉంచుతారు. ఈ ఉద్దాల మండపాన్ని
1878లో రాజా శ్రీరాం భూపాల్
నిర్మించగా, 1999లో మరమ్మత్తులు చేశారు. కొండమీద ఉద్దాల మండపంలో దళితులే అర్చకులుగా కొనసాగుతుంటారు

ఉద్దాలు చిన్నవి పెద్దవి ఉంటాయి. పెద్ద ఉద్దాలను మంటపంలో భక్తుల దర్శనానికి ఉంచుతారు. చిన్న ఉద్దాలతో భక్తుల వీపులపై చరుస్తూ ఆశీర్వదిస్తుంటారు. పాదుకలతో వీపులను కొట్టడమే ఇక్కడి ఆశీర్వాదం. వీపుపై పాదుకలతో కొట్టించుకుంటే పాపాలు సమస్యలు కష్టాలు రోగాలు అడ్డంకులు తొలగి పోతాయని భక్తుల తరతరాల నమ్మకం.

▪️స్వామి వారి ఉద్దాలు – నిజానిజాలు

//అసత్య ప్రచారం//

కురుమూర్తి స్వామీ వారి పాదరక్షలు తయారీ గురించి అసత్య ప్రచారం జరుగుతున్నది. ఆ వార్త ఈ కింది విధంగా ఉన్నది

” గోమాతను చంపి ఆ తల్లి చర్మంతో చెప్పులు తయ్యారు చేయడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించండి.శ్రీ కురుమూర్తి స్వామి వారికి గోమాత చర్మంతో చేసిన చెప్పులు కాకుండా వెండితో చేయించండి, ఇంకా వీలైతే బంగారుతో చేయించండి”

గోమాతను వారు చంపుతున్నారు, వీరు చంపుతున్నారు అని కాదు ముందు మనం ఎంతవరకు అచరిస్తున్నాం ఒక్కక్షణం ఆలోచించండి.

ఇటువంటి గోమాత హత్య చేసి చేసే సంబురాలు ధర్మ విరుద్ధం.అందులో పాలుపంచుకోవడం ధర్మ విరుద్ధం. మన గోమాతను మనం కాపాడుకుందాం.గోమాత రక్షణే సర్వ జగత్ రక్ష ”

//వాస్తవం//

వాస్తవాలు గమనిస్తే….స్వామి వారి ఉద్దాలు తయారీ కోసం ఆలయ కమిటీ గోమాతను చంపడం లేదు.

నల్లమల అడవుల్లో ఆవులు సంచరిస్తుంటాయి.ఈ క్రమంలో తరుచూ చిరుతపులుల భారిన పడుతుంటాయి. ఇట్లా కేవలం పులిచేత చంపబడిన ఆవు చర్మంతో మాత్రమే స్వామివారి ఉద్దాలు తయారు అవుతాయి. ఇటువంటి ఆవు కోసం తయారీదారులు సంవత్సరం పొడవునా వేచిచూస్తుంటారు.

▪️సిగాలు / పూనకాలు…

ఉద్దాలోత్సవంలో ఉద్దాల ఊరేగింపు పవిత్రమైన గొప్ప వేడుక. ఈ సందర్బంగా భక్తుల సిగాలు / పూనకాలు… నృత్యాలు… పరవశిస్తూ తన్మయత్వంతో పెట్టే కేకలు… కన్నుల పండుగై కనిపిస్తాయి…..వినిపిస్తాయి.

కొందరు తడి బట్టలతో పూనకంతో ఊగిపోతుంటారు.
బంతి పూలమాలలతో , నెమలీక కట్టలతో, మరికొందరు ఎగిరిదుంకుతుంటారు. స్త్రీ పురుష వయోభేదం లేకుండా ఊగిపోయే పూనకాలను చూస్తే గ్రామదేవతల గణాలు ఒక చోట చేరినట్టుగా ఉంటుంది.

▪️ఉద్దాల ఉత్సవం పై ” పాదుకా పట్టాభిషేకం ”

ఆత్మకూరు సంస్థానం చరిత్ర విస్తృతమైనది. సంస్థానాదీషుల కాలంలో ఆలయాల నిర్మాణాలు సంరక్షణలతో ఆధ్యాత్మికత పరిడవిల్లింది. ఇందుకు సంబందించిన సాహిత్యం విరాజిల్లింది.

శ్రీమాన్ ధన్నవాడ కిడాంబి/కిళాంబి రాఘవాచార్యస్వామి వారు … ఆత్మకూరు సంస్థానాన్ని పాలించిన రాజా శ్రీరామభూపాలుగారి ఆశ్రయం పొందారు. ఈ సమయంలో కురుమూర్తి స్వామి వారి ఉద్దాల ఉత్సవాన్ని గురించి సంస్కృతంలో ” పాదుకార్పణం ” నాటక ప్రబంధం రచించినారు.

ఈ నాటకం రాజాగారి కాలంలోనే ముద్రించబడింది. తర్వాత మహారాణి భాగ్యలక్ష్మీదేవమ్మ కాలంలో ద్వితీయ ముద్రణ పొందింది.

సంస్కృత ” పాదుకాదర్పణం ” నాటకాన్ని ఆచార్యులవారే ” మణివిద్రుమహారము “పేరుతో తెలుగులోకి అనువదించారు. అనువాదం కూడా రెండుపర్యాయాలు ముద్రితం.

సరస్వతీపుత్ర బిరుదాంకితుడు పుట్టపర్తినారాయణాచార్యులుగారి అర్దాంగి కనకమ్మ
గారు రాఘవాచార్యస్వామి వారి కూతురే.

Source : Facebook