RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

వీరాంగన ” నీరా ఆర్య” మొదటి మహిళా గూఢాచారి

~ ఆకారపు కేశవరాజు

జైలర్ కోపంతో నీ గుండెలో నేతాజీ ఉన్నట్లయితే నీ గుండెల్లో నుండి పెకిలించి తీసి బందిస్తానంటూ కోపంతో ఊగిపోతూ మరో వైపు చూస్తూ వెంటనే వచ్చి ఈమె గుండెలను చీల్చేయండి రండి అంటూ ఆజ్ఞాపించాడు…. పనివాడు ఇనుప ఆయుధాలు తీసుకువచ్చి ఆమె వక్షస్థలాన్ని కోయడం ప్రారంభం చేశాడు…. రక్తం చివ్వున చిమ్ముతూ ఉండగా ఆ తల్లి విలవిలలాడి పోయింది వాళ్లేమో రాక్షసంగా నవ్వుకుంటున్నారు…
(ఈ సంఘటన అండమాన్ నికోబార్ దీవుల లోని కాలాపాని జైలులో జరిగింది.)

ఆజాద్ హింద్ ఫౌజ్ లోని ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా రెజిమెంట్ లో శిక్షకురాలు, ఆంగ్లేయులచే అండమాన్ కాలాపాని జైలు శిక్ష విధించబడిన వీరనారి “నీరాఆర్య”.

తనను కట్టుకున్నవాడే ఆంగ్లేయుల పంచన చేరి దేశద్రోహిగా మారి సమరయోధులను హత్య చేయడాన్ని కళ్ళారా చూసి అతడు ఇక భూమిపై ఉండకూడదని నిర్ణయం తీసుకొని పొడిచి చంపి నేతాజీని మరియు అనేక మంది దేశభక్తులను రక్షించిన వీరాంగణ, చివరి దశలో అజ్ఞాతంగానే మన హైదరాబాద్ ఫలక్నుమా ప్రాంతంలో ఉంటూ ఉస్మానియా ఆస్పత్రిలోనే అంతిమ శ్వాస విడిచారు.

భారతదేశ చరిత్రలో మొదటి గూఢచారిణి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ మహిళా విభాగం అయిన ఝాన్సీ లక్ష్మీబాయి రెజిమెంట్ లో కీలక బాధ్యతలు నిర్వహించిన “నీరా ఆర్య” 1902 మార్చి 5 న ఇప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం “భాగ్ పత్ జిల్లా”లోని ‘ఖేకడా’ అనే నగరంలో జన్మించారు.

తండ్రి “శేట్ చజ్ మల్” అప్పటికే దేశంలో గొప్ప పేరున్న వ్యాపారవేత్త, నీరా ఐదవ ఏట తండ్రి వ్యాపార ముఖ్య కేంద్రమైన కలకత్తాకు వలస వెళ్ళాడు.

నీరాఆర్య విద్యాభ్యాసం మొత్తం కలకత్తాలోనే పూర్తయింది, తాను తండ్రితో కలిసి పలు ప్రాంతాల్లో వ్యాపార నిమిత్తం వెళ్లడం వలన తనకు పలు భాషలపై మంచి పట్టు ఉండేది.

తన కూతురు మొదటి నుండి చదువు, ఆటపాటలలో మేటియై,దేశభక్తితో స్వతంత్ర్య భావాలను కలిగి ఉండడం మరియు బ్రిటిష్ వారిని పారద్రోలే ఆలోచనలను కలిగి ఉండడాన్ని కూడా గమనించారు.

యుక్త వయసు రాగానే నాటి బ్రిటిష్ ఇండియా సిఐడి పోలీసు ఇన్స్పెక్టర్ అయిన “శ్రీకాంత్ జొయరంజన్ దాస్” తో వివాహం జరిపించాడు తండ్రి.

తన భర్త బ్రిటిష్ వారి కోసం, తను నేతాజీ నేతృత్వాన దేశంకోసం పనిచేస్తూ కూడా పరస్పర విరుద్ధ భావాలతో ఉన్నప్పటికీ అతడిలో మార్పు తీసుకువచ్చి దేశభక్తుడిగా మార్చాలని ప్రయత్నం చేస్తూనే కలిసి చాలాకాలం జీవనం కొనసాగించారు.

బ్రిటిష్ ప్రభుత్వం నీరాఆర్య భర్తను నేతాజీ కదలికలను గుర్తించడం వీలైతే వెంటనే హతమార్చే పనిలో నియమిస్తారు. ఒక సందర్భంలో నీరాఆర్య భర్త నేతాజీనీ తుపాకీతో కాల్చగ గురి తప్పి డ్రైవర్కు గాయం అవుతుంది, ఈ క్రమంలో నేతాజీని కాపాడటానికి తన వెంటే ఉన్న కత్తితో భర్తను పొడిచి వేసింది దానితో జోయారంజన్ దాస్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

ఆ తర్వాత నీరాఆర్య నాగిని అనే మారుపేరుతో స్వాతంత్రోద్యమ కార్యకలాపాలను నిర్వహించింది. నీరాఆర్య తమ్ముడు బసంత్ కుమార్ కూడా ఆజాద్ హింద్ ఫౌజ్ లో పని చేసేవాడు. మహిళల కోసం ఏర్పాటు చేసిన ఝాన్సీ లక్ష్మీబాయి రెజిమెంట్ కెప్టెన్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళా సైనికులకు శిక్షణ ఇచ్చే వారు. నూతన సైనికులను సమకూర్చేవారు.

భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రవాస ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ సింగపూర్ కేంద్రంగా సైనికులను సమకూర్చుకుని ఆంగ్లేయులను పారద్రోలుటకై భారత్ వైపు బయలు దేరి, చారిత్రాత్మకమైన ‘ఛలో ఢిల్లీ ‘ నినాదం ఇచ్చి ఈశాన్య భారతాన్ని స్వాధీనం చేసుకుని ప్రజలందరూ స్వాగతాలు పలుకుతుండగా ఢిల్లీ వైపు సాగే క్రమంలో వాతావరణం అనుకూలించక పోవడం, వర్షాలు వరదలు తుఫాను తాకిడికి సైన్యం చెల్లాచెదురై పోయారు. మరోవైపు సహాయం కోసం విదేశాలకు వెళ్లిన నేతాజీ అదృశ్యమైపోయారు.

ఆతర్వాత అజాద్ హిందు ఫౌజు సైన్యం లొంగిపోయింది. ఎర్రకోటలో విచారించి అజాద్ హింద్ ఫౌజ్ సైనికులందరికి వివిధ శిక్షలు వేయగా నీరాఆర్య ను మాత్రం ఖైదు చేసి అండమాన్ “కాలాపాని” జైలుశిక్ష విధిస్తారు.

జైలులో ఆమెపై ప్రతిరోజు అతి కిరాతకంగా శారీరకంగా మానసికంగా అనేక చిత్రహింసలకు గురిచేసేవారు.

తను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత స్థానిక ఉర్దూ కవయిత్రి “ఫర్హనా తాజ్” తో తన జీవితంలో ముఖ్యంగా జైలు జీవితంలో జరిగిన ఘటనలను పంచుకోగా, ఆమె వాటిని తన రచనల్లో పొందుపరిచింది.
ఆమె చెప్పిన ప్రకారం.

అండమాన్ కాలాపాని జైల్ లో ఉండగా ఒక రోజు ఒక జైలు ఉద్యోగి వచ్చి రమ్మని వెంట తీసుకు వెళ్ళాడు అప్పటికే నేను బలమైన బరువైన ఇనుప గొలుసులతో కాళ్లను మరియు చేతులను కలిపి బంధించిన ఆ గొలుసులతోనే బరువుగా నడుస్తూ నడుస్తూ అతని వెంట వెళ్ళాను. జైలర్ పక్క గదిలో వరకు తీసుకెళ్లిన అతను ఒక పెద్ద సుత్తి మరియు గొలుసులను తొలగించడానికి మరొక పరికరాన్ని తీసుకొచ్చాడు. ఇనుప సంకెళ్ళను తొలగిస్తున్నానంటూ ప్రారంభించిన వాడు నా చర్మాన్ని కూడా కోసివేస్తున్నాడు. బాధను తట్టుకోలేక పోతున్నాను మరోవైపు సంకెళ్ళు తీసి వేస్తున్నారని మనసులో కొంత ఉపశమనంగా ఉన్నప్పటికీ చేతిని కత్తిరిస్తున్న బాధ భరించలేకపోతున్నాను…

ఇది ఇలా ఉండగా కాళ్లకు సంబంధించిన సంకెళ్లను తొలగిస్తున్నా నంటూ చూసి చూసి ఇనుప సుత్తితో నా కాలి వేళ్లపై రక్తం వచ్చేటట్లు కొడుతున్నాడు, భరించలేని బాధతో ఇలా ఎందుకు కొడుతున్నావ్ అని గట్టిగా అరిచాను., దానితో వాడు కొడతాను ఎక్కడైనా కొడతాను నీ వక్షస్థలంపై కూడా కొడతాను అని మూర్ఖంగా జవాబు ఇస్తే., ఆ జైలులో ఒక బానిసగా ఉన్న నేను వాళ్లేం చేసినా చూడాల్సిందే భరించాల్సిందే, కానీ నేను నాఆత్మాభిమానాన్ని చంపుకోలేక వ్యతిరేకించాను మహిళలపై ఇలాంటి మాటలు ఇలాంటి చేతలు మంచిది కాదని ఇటువంటి పనులు మూర్ఖులు మాత్రమే చేస్తారని అన్నాను‌, ఇంకా ఏమీ చేయలేక వాడిపై ఉమ్మేసాను దీనితో వాడు అరవడం ప్రారంభం చేశాడు ఈ అరుపులు విని జైలర్ అక్కడికి చేరుకున్నాడు.

ఇన్ని బాధలెందుకు పడతావు బ్రిటిష్ రాణి ఎలిజబెత్ శరణు కోరుకో నిన్ను వదిలి వేస్తామని బెదిరింపు లాంటి బుజ్జగింపుగా ఒక మాట అన్నాడు. నేను శరణు వేడితే జగజ్జనని కాళిక మాతనే శరణు వేడుతాను తప్ప, ఇతర దేశాలను ఆక్రమించుకుని దోచుకుంటున్న దోపిడీ దొంగలను శరణువేడను అని నిర్ద్వందంగా చెప్పాను, దానితో వాళ్ళు మరింత రెచ్చిపోయారు.

ఒకవైపు కాలి నుండి స్రవిస్తున్న రక్తం మరొకవైపు చేతి నుండి స్రవిస్తున్న రక్తం… బాధతో విలవిల లాడి పోతున్నాను.

ఇంతలోనే జైలర్ నేతాజీ ఎక్కడున్నాడో చెబితే నిన్ను వదిలి పెడతాం అని అన్నాడు…, అప్పటికే విమాన ప్రమాదంలో నేతాజీ అసువులుబాసినట్లుగా ప్రకటన వెలువడింది దాన్నే అతని గుర్తు చేశాను. విమాన ప్రమాదంలో మృతి చెందిన సుభాష్ బాబు గురించి నీకు ఎంత తెలుసో జైల్లో ఉన్న నాకూ అంతే తెలుసు అని అన్నాను. కానీ అతడు మరింత రెట్టించిన గొంతుతో లేదు సుభాష్ చంద్ర బోస్ ఎక్కడో ఉన్నాడు అది నీకు తెలుసు ఎక్కడున్నాడో చెప్పు అంటూ గద్దించసాగాడు..,

వాడి అరుపులను మౌనంగా భరించి వింటున్నాను కొంతసేపటికి..

చివరకు హాఁ.., ఉన్నాడు నేతాజీ ఉన్నాడు అని అన్నాను వెంటనే ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అంటూ నా వైపు వస్తుండగా నేతాజీ నా గుండెల్లో ఉన్నాడు అని బదులిచ్చాను.

అంతే ఆ సమాధానం విన్న జైలర్ కోపంతో నీ గుండెలో నేతాజీ ఉన్నట్లయితే నీ గుండెల్లో నుండి పెకిలించి తీసి బందిస్తానంటూ కోపంతో ఊగిపోతూ మరో వైపు చూస్తూ వెంటనే వచ్చి ఈమె గుండెలను చీల్చేయండి రండి అంటూ ఆజ్ఞాపించాడు. పనివాడు ఇనుప చిమ్టి లాంటి పరికరాన్ని తీసుకువచ్చి నా శరీరం పైన ఉన్న చీరకొంగును లాగేశాడు, జాకెట్ ను తొలగించాడు వక్షస్థలంపై ఆయుధాన్నుంచి నా కుడి రొమ్మును ఇనుప పరికరంతో తొలగించాలని కోసివేయడం ప్రారంభం చేశాడు భయంకరమైన నొప్పితో విలవిలలాడి పోయాను. రక్తసిక్తమైన దేహంతో శరీరం అంతా కంపించి పోతుండగా ఎక్కడున్నాడో చెప్పు నీ గురువు నీవు దైవంగా నమ్మే నేతాజీ అంటూ అరుస్తూనే ఉన్నాడు నా మెదడు మొద్దుబారిపోతున్నది ఆ తర్వాత ఎప్పుడు స్పృహ లోకి వచ్చి లేచానో నాకే తెలియదంటూ చెప్పారు.

ఇంతటి క్రూర చిత్రహింసలను తట్టుకొని కూడా ఆమె ఏనాడు నేతాజీ గురించిన విషయాలను బ్రిటిష్ వారికి చెప్పలేదు.

నీరాఆర్య జన్మించిన భాగ్ పత్ జిల్లాకు చెందిన సాహితీవేత్త తేజ్ పాల్ సింగ్ దామా రచించిన నీరా జీవిత చరిత్ర అయినా “ఫస్ట్ లేడీస్ స్పై” అనే పుస్తకాన్ని ప్రచురించారు. దీని ఆధారంగా చైనా సినీ నిర్మాత “జాంగ్ హ్యుయిహూ అంగ్ గ్రేసి” త్వరలో సినిమా తీయబోతున్నారని సమాచారం.

భారతదేశ స్వాతంత్ర్యానంతరం కూడా అజ్ఞాతంగానే ఉంటూ భారత యూనియన్ లో విలీనం కాకుండా ఉన్న హైదరాబాద్ స్టేట్ లోని ప్రజల దుఃఖాన్ని కష్టాలను విని ఇక్కడి సమాచారం తన అనుయాయుల ద్వారా భారత యూనియన్ కు చేరవేయడం కోసం హైదరాబాద్ చేరుకున్నట్లు, వివిధ స్థలాలలో గుడిసె వేసుకొని సామాన్య జీవితం గడుపుతూ ఇక్కడి స్థితిగతులను రహస్యాలను చేర వేసినట్లుగా సమాచారం.

హైదరాబాద్ ఫలక్ నుమా ప్రాంతంలో గుడిసెలోనే నివసిస్తూ రోడ్డు పక్కన పూలు అమ్ముకుంటూ జీవనం కొనసాగించిన ఆత్మాభిమానం గల దేశ భక్తురాలు. అప్పుడప్పుడు చుట్టుపక్కల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఏవేవో చదువుకునే లేదా ఆడుకునే వస్తువులను తెచ్చి ఇచ్చేవారని, “బాగా చదువుకోవాలని ఈ దేశానికి పేరు తేవాలని చెబుతుండేవారనీ” పూలమ్మే వృద్ధమాత ఇలా పిల్లలపై ఖర్చు చేస్తుండడం విచిత్రంగా ఉండేదని. ఆ నోటా ఈ నోటా వినవస్తుండేది.

సంపన్న కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి, అన్ని రంగాలలో ఆరితేరి స్వాతంత్రాన్ని సాధించిపెట్టిన ఆజాద్ హింద్ ఫౌజ్ లో ట్రైనర్ అయి ఉండి కూడా తన జీవిత చరమాంకంలో ప్రభుత్వం నుండే కాదు ఎవరి ద్వారా కూడా ఎలాంటి సహకారాన్ని కోరుకోని స్వాభిమానం ఆమెది.

స్వాతంత్ర్య కోసం తన భర్తనే బలి ఇచ్చింది, తన సర్వసంపదలను వదిలిపెట్టింది, బంధుగణం ఎదుటన ఈ పనులు చేయడం అవమానంగా భావించక తన సోదరుడితో సహా స్వాతంత్ర్య సమరంలో దూకింది, తనకోసం తన పిల్లలకోసం తన ఇంటికోసం అంటూ ఆలోచించలేదు.., దేశం కోసం ఇవ్వడమే కాని తీసుకోవడం తెలియని మహాతల్లి తన సర్వస్వాన్ని ధారపోసింది. ఎప్పుడెప్పుడు ఏమేమి ఇవ్వాల్సి వచ్చినా అన్నింటినీ త్యాగం చేసింది , ఇంకా చేయడానికి సిద్ధపడింది భారతదేశ వైభవానికి పునాది రాయిగా ఉండిపోవాలని కోరుకున్నది ఆ తల్లి.

ఒకానొక సందర్భంలో ఆమె వేసుకున్న గుడిసె ప్రభుత్వ భూమిలో ఉందని ఆ గుడిసెను కూడా అప్పటి ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ మున్సిపాలిటీ వారు కూల్చి వేశారు.

చివరికి 26 జూలై 1998 న 96 ఏళ్ళ వయసులో అనారోగ్యంతో ఒక నిరుపేదగా, అసహాయురాలిగా, నిరాశ్రితగా, అనారోగ్య వృద్దమహిళగా చార్మినార్ దగ్గర్లో గల ఉస్మానియా ఆస్పత్రిలో చేరి మరణించింది.

ఆమె మరణించిన విషయాన్ని తెలుసుకొని స్థానిక ఒక పత్రికా విలేఖరి తన మిత్రుల సహాయంతో అంతిమ సంస్కారాలు జరిపించారు.

మహనీయులైన “నీరాఆర్య” గారికి మనం ఏమివ్వగలం…, అశ్రునయనాలతో అమ్మను గుర్తు చేసుకోవడం, ముకులించిన హస్తాలతో నివాళులర్పించడం తప్ప.

~ గత జూలై ఇరవై ఆరవ తేదీన హిందీ ప్రాంతానికి చెందిన మిత్రులు ఎవరో గుర్తుచేస్తూ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన దాన్ని చూసి వివరాలు తెలుసుకోవాలని అఖిల భారత అధికారి రాస్ బిహారీజితో మాట్లాడగా వారు మరిన్ని వివరాలు చెబుతూ ఉంటే ఆశ్చర్యచకితుడనై పోయాను నీరాఆర్య గారి జీవిత చరమాంకం హైదరాబాదులోనే గడిచిపోయిందని అక్కడే మృతి చెందింది అని చెప్పగానే నేను మరింత ఉద్విగ్నతకు లోనయ్యాను. ఈ విషయం గురించి చాలామందిని సంప్రదించాను…. వారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది .

ఇది వ్రాస్తున్నంతసేపు మనసంతా దుఃఖ భారంతో గందరగోళంగా ఉంది. కళ్ళలో కన్నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి.

Source :  Facebook