RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

మల్లినాథ సూరి

  • రామకృష్ణ వెల్లంకి

కోలాచలం మల్లినాథసూరి లేదా మల్లినాథుడు తెలుగుకవి, సంస్కృత పండితుడు, విమర్శకుడు. అతను విమర్శకుడిగా బాగా పేరు పొందాడు. అతను 14 వ శతాబ్దం ఉత్తరార్ధంలోని వాడు. కాకతీయ రాజుల ఆదరణతో ఓరుగల్లు చేరాడు. కాకతీయ రాజుల పతనం తర్వాత రాచకొండ రాజుల ఆస్థానానికి వచ్చాడు. వీరిది కామకాయన గోత్రమని అతని ఊళ్ళో అదే రకమైన ఇంటిపేరు ఉన్నవారు చెప్పుకొంటారు. కొంతమంది అతని గోత్రం కాశ్యపస గోత్రమని చెప్పుకొంటారు. ఈ గోత్ర భేదాలతో మల్లినాథసూరి వంశపరంపరలోనివారు ఎవ్వరని నిర్ణయించడానికి తగిన ఆధారాలు లేవు. సంస్కృతంలోని పంచమహాకావ్యాలకూ అతడు రాసిన భాష్యాలు పేరు తెచ్చి పెట్టాయి. అతను మహామహోపాధ్యాయ, వ్యాఖ్యాన చక్రవర్తి అనే బిరుదులు పొందాడు. ఇతను రాచకొండరాజైన సింగభూపాలుడు, విజయనగరాన్ని మొదటి దేవరాయలు పాలిస్తున్ననాటివాడు. అతని రాతలను బట్టి అతను 1350-1450 మధ్య కాలపు వాడని తెలుస్తోంది.

మల్లినాథుడి ఇంటిపేరు కోలాచలం అని మనకు సంస్కృత వాఙ్మయంలో కన్పిస్తుంది. దీనికి కొలచేల, కొలిచాల, ఇంకా కొలిచెలమ అనే వికారాలున్నాయి. కొలిచెలమ (నేటి కొల్చారం) అనే గ్రామం మెదక్ జిల్లా కేంద్రమైన మెదక్ కు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకతీయుల పాలన సమాప్తమయ్యాక కొలచెలమ వారు సింగభూపాలుని రాజధాని రాచకొండకు వలస వెళ్ళారు. సంజీవని రాసిన గద్యాల నుండి తెలియవచ్చేదేమిటంటే సింగభూపాలుడు మల్లినాథుడిని మహామహోపాధ్యాయునిగా, మల్లినాథుని కొడుకును మహోపాధ్యాయుని బిరుదుతో సత్కరించాడు.

మల్లినాథ సూరి మెదక్ జిల్లా కొల్చారంలో జన్మించాడు. ఆయన సా.శ. 1350-1430 మధ్య కాలంలో జీవించాడు. చిన్నతనంలో మల్లినాథసూరికి చదువు అబ్బకపోవడంతో పశువులను కాసేవాడు,. ఈ క్రమంలోనే అడవిలో ఓ యోగి పరిచయం కాగా, ఆ యోగి అవసాన దశలో ఉండగా, మల్లినాథసూరి ఆయనకు సపర్యలు చేశాడు. దీనితో ఆ యోగి మల్లినాథసూరికి మంత్రోపదేశం చేసి నాలుకపై బీజాక్షరాలు వ్రాశాడు. వెంటనే దుర్గామాత సాక్షాత్కారం పొందిన మల్లినాథ సూరి కాశీకి వెళ్ళి అక్కడ 19 శాస్త్రాల్లో ప్రావీణ్యం సాధించి మహాభాషా కర్తగా, విద్యాపండితుడిగా ఖ్యాతి పొందాడు.

ఈయన మొదట కాళిదాసు రచించిన కుమార సంభవం కావ్యానికి వ్యాఖ్య రాశాడు. అంతకు ముందు దీనిపై 37 వ్యాఖ్యానాలున్నాయి. రఘు వంశ సంజీవిని అనేది సూరి మొదటి వ్యాఖ్యానం. దీని ముందు అవన్నీ దిగ దుడుపే. ప్రతి సర్గ వ్యాఖ్యానానికి ముందు అద్భుత మైన శ్లోకం రాసి కొత్త దారి తొక్కాడు. కుమార సంభావానికి అంతకు ముందున్న 25 వ్యాఖ్యానాలు సూరి వ్యాఖ్యానం ముందు తల వంచాయి. అయితే ఉన్న పదిహేడు సర్గలలో ఏడు సర్గల వ్యాఖ్యానమే లభిస్తోంది. ఎనిమిదో దానికి సీతా రామ పండితుడు వ్యాఖ్య రాశాడు . అదే పార్వతీదేవిపరమేశ్వరుల సంభోగ శృంగారం. మేఘదూతానికి 50 వ్యాఖ్యానాలున్నాయి. సూరి వ్యాఖ్య మాత్రమే బహుళ ప్రచారం పొందింది.

మల్లినాథసూరిని వ్యాఖ్యాన చక్రవర్తి అంటారు. ఆయన సంస్కృత భాషలో మహాకావ్యాలైన మేఘసందేశం, కుమారసంభవం, రఘువంశం ( ఈ మూడూ కాళిదాస మహా కవి కృతులు), కిరాతార్జునీయం ( ఇది భారవి రచన). శిశుపాలవధ ( ఇది మాఘుని రచన ), హర్షనైషధం ( ఇది శ్రీహర్ష మహారాజ కృతి) లను తన వ్యాఖ్యానాలతో జనరంజకం చేశాడు. న మూలం లిఖ్యతే/నానపేక్షిత ముచ్యతే-మూలంలో లేనిది చెప్పను, అనవసరమైనదీ చెప్పను అంటూ ఆయన తన వ్యాఖ్య రచనా సరళి గురించి చెప్పుకున్న విషయాలు సుప్రఖ్యాతం.

మల్లినాథుడు వ్యాఖ్యానకర్త అయినప్పటికీని ఎన్నో సృజనాత్మక కృతులు కూడా చేసాడు. ఈయన రాసిన సంజీవని అనే మేఘసందేశ భాష్యం మిక్కిలి ప్రసిద్ధమయినది.  అతను కవి అన్న విషయం చాలా మందికి తెలియదు. కానీ సంస్కృత సాహిత్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించినవారికి ఇతను సుపరిచితుడే.