RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

స్వామి సహజానంద

చదువు కావాలంటే మతం మారాల్సిందే! – శతాబ్దం క్రితం ఓ నిరుపేద హరిజన బాలుడికి ఎదురైన ఘటన ఇది. క్రైస్తవంలోకి మారాలంటూ తంజావూరులో సేక్రెడ్ హార్ట్ క్రైస్తవ మిషనరీ పాఠశాల యాజమాన్యం చేసిన ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డ 17 ఏళ్ల బాలిక “లావణ్య” ఉదంతంతో పోల్చిచూస్తే.. ‘ఆధునిక విద్య’ పేరిట మతంమార్చేందుకు మిషనరీలు శతాబ్దం క్రితం అనుసరించిన విధానాలే నేటికీ అమలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ, శతాబ్దం క్రితం జరిగిన ఘటనలో బాలుడు అనుసరించిన విధానం యావత్ హిందూ సమాజానికీ స్ఫూర్తిదాయకం.

1903లో తమిళనాడులో జరిగిన ఘటన ఇది!

1890 జనవరి 27 న అన్నామలై మరియు అలమేలు దంపతులకు జన్మించిన, హరిజన సామాజిక వర్గానికి చెందిన నిరుపేద బాలుడు మునుస్వామి.. చదువుకోవాలన్న తపనతో డిండీవనం క్రైస్తవ మిషనరీ పాఠశాలలో సీటు సంపాదించాడు. తరగతి గదిలోని ఇతర విద్యార్థుల్లో కెల్లా అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందాడు. సీటు అయితే సంపాదించాడు కానీ ఫీజు కట్టేందుకు ఆర్ధిక స్థోమత సరిపోయేది కాదు.

ఆ నిరుపేద నిమ్నవర్గ విద్యార్థి పేదరికాన్ని ఆసరాగా చేసుకుంది ఆ క్రైస్తవ పాఠశాల యాజమాన్యం. మునుస్వామి ముందు రెండు ప్రతిపాదనలు పెట్టింది.. ఒకటి క్రైస్తవంలోకి మారడం.. రెండు, మేము అందిస్తున్న విద్య, భోజనానికి ఫీజు (ఆరోజుల్లో అరవై రూపాయలు) చెల్లించడం.. ఈ రెండూ చేయలేకపోతే పాఠశాల విడిచి వెళ్ళవచ్చు అని తేల్చిచెప్పింది. ఆ బాలుడు ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే పాఠశాల నుండి బయటకు వచ్చేశాడు. అతని ఆధునిక విద్య అంతటితో ముగిసిపోయింది. ఇటిక బట్టీల్లో కార్మికుడిగా చేరాడు. కానీ క్రైస్తవాన్ని మాత్రం స్వీకరించదలేదు. ఈ విషయం అతని గ్రామానికి పర్యటనగా వచ్చిన శ్రీ నీలమేఘ స్వామి దృష్టికి చేరింది. మునుస్వామి జీవితానికిది కీలక మలుపుగా మారింది. స్వామి నీలమేఘ సూచన మేరకు కరపత్ర శివప్రకాశ స్వామి సన్నిధికి చేరి వారి ఆధ్యాత్మిక శిక్షణలో తమిళ సాహిత్యంతో పాటు ఎన్నో శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు అభ్యసించాడు. గురువు సన్నిధిలో సన్యాసాశ్రమ దీక్ష పొందిన ఆ బాలుడు అనంతర కాలంలో స్వామి సహజానందగా ప్రసిద్ధిచెందారు.

తమిళనాడులో ద్రవిడ కజగం పార్టీలు, పెరియార్ వంటి ఉన్మాదులు తమ విషపూరిత “ఆర్య-ద్రావిడ” సిద్ధాంతాలతో నిమ్న వర్గాల ప్రజలలో హిందూ ధర్మం పట్ల తీవ్రమైన వ్యతిరేక భావం కలుగచేస్తున్న ఆ రోజుల్లోనే.. అనేక మార్గాల్లో హిందూ ధర్మాన్ని అణగారిన ప్రజల మధ్య ప్రచారం చేసి వారిని హిందూత్వానికి దగ్గర చేశారు స్వామి శ్రీ సహజానంద. నిమ్న వర్గాల నుండి కూడా గురువులు, ఆధ్యాత్మిక పురుషులు ఉద్భవిస్తారని ఆయన ప్రపంచానికి చూపించారు. వారి జీవితం నుండి అనేక ముఖ్య విషయాలు మనం గ్రహించాల్సి ఉంది.

నిమ్నవర్గాల ప్రజలు హిందువులు కారు అనే దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారు. వారిని ‘ఆది ద్రావిడులు’ అని కాకుండా ఆది హిందువులుగా పిలవాలని ప్రతిపాదించేవారు. అంతేకాకుండా ప్రముఖ ఆలయాల కమిటీల్లో నిమ్నవర్గాలకు చెందిన హిందువులను కూడా సభ్యులుగా చేర్చాలని డిమాండ్ చేసేవారు.

1934లో నిమ్నవర్గాల వారికోసం నటరాజ ఆలయప్రవేశానికై తీవ్రమైన ఉద్యమం ప్రారంభించారు స్వామి సహజానంద. దీంతో అటు ద్రావిడ సిద్ధాంత ప్రచారకులు, పెరియార్ మద్దతుదార్లు స్వామి సహజానందను అనేక ఇబ్బందులకు గురిచేసారు. ఎట్టకేలకు 1947 జూన్ 2 తన ఉద్యమ ఫలితంగా వందలాది నిమ్నవర్గాల ప్రజలతో కలిసి నటరాజ ఆలయప్రవేశం కావించారు. రాజకీయాల్లోకి రావాలిన అనివార్య పరిస్థితులను గుర్తించిన స్వామీ సహజానంద 1936 నుండి 1959 వరకు దాదాపు రెండు దశాబ్దాల కాలం తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి చిదంబరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిథ్యం వహించారు.

తన జీవిత కాలంలో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నో విద్యాలయాలు ఏర్పాటు చేసి, వాటి ద్వారా భారతీయ సాంప్రదాయ విద్యను నిమ్నవర్గాల ప్రజలకు అందించారు. ముఖ్యంగా బాలికలకు విద్య యొక్క ప్రాముఖ్యత వివరించే కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. వీటితో పాటు పాటు షెడ్యూల్డ్ కులాల ప్రజల రాజకీయ, సాంస్కృతిక హక్కుల పరిరక్షణ జీవితాంతం పాటు పడ్డారు శ్రీ సహజానంద.

క్రైస్తవ మిషనరీలు నిమ్నవర్గాల ప్రజలను మతం మార్చడానికి పన్నే మాయోపాయాలపట్ల అవగాహన కలిగిన స్వామీ సహజానంద, ఆ కుట్రపూరిత విధానాలు అరికట్టేందుకు తగిన సూచనలు తరచూ చేస్తుండేవారు.

ఎస్సీ వాడల్లో నెలకొల్పిన పాఠశాలల్లో క్రైస్తవ ఉపాధ్యాయులను కాకుండా హిందూ ఉపాధ్యాయులనే నియమించాలని, మిషనరీలు నిర్వహించే బాలల ఆశ్రమాలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలపై ఆంక్షలు విధించాలని కోరేవారు.
ఈవీ రామస్వామి నాయకర్, జస్టిస్ పార్టీల తీవ్రవాద ఆలోచనలను, విధానాలను స్వామి సహజానంద తీవ్రంగా వ్యతిరేకించేవారు. వారు దేశద్రోహానికే పనిచేస్తున్నారు తప్పు నిమ్నవర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కాదు అని ఖరాఖండిగా చెప్పేవారు. కులాల పట్ల ద్వేషాన్ని నూరిపోసి దాన్నే ఉద్యమంగా ప్రచారం చేసే పద్దతులను తీవ్రంగా వ్యతిరేకించే సహజానంద – సేవా, ఆధ్యాత్మిక మార్గంలో చేపట్టిన నిమ్నవర్గాల అభ్యున్నతి ఉద్యమం ఈనాటికీ తమిళనాట సత్ఫాలితాన్నిస్తోంది