RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

వి ఓ చిదంబరం పిళ్లై

1915లో మహాత్మాగాంధీ చెన్నైలో పర్యటిస్తున్న సమయంలో, తిరునల్వేలికి చెందిన ఓ వ్యక్తి ఆయన్ను కలవాలని ఉవ్విళ్లూరాడు. మహాత్ముడికి మొదట్లో అనుమానం వచ్చినప్పటికీ చివరకు అంగీకరించాడు.  నిజానికి ఆ వ్యక్తి ఒకప్పుడు చాలా సంపన్న వ్యాపారి. అయితే  తన సంపదనంతా జాతి గౌరవం నిలబెట్టడం కోసం చేసిన పోరాటంలో పోగొట్టుకున్నాడు.  సౌతాఫ్రికాలో కొందరు అతని కోసం డబ్బు సేకరించి గాంధీ ద్వారా పంపారు.  అయితే, ఆ మొత్తాన్ని అతనికి అందించడానికి గాంధీ అంగీకరించినప్పటికీ, ఎందుకనో ఆలస్యం చేస్తూ వచ్చారు.   చివరకు ఏడాది తర్వాత రూ.347 చెల్లించి అతని అప్పులు తీర్చగలిగేందుకు అంగీకరించాడు. 

ఆ వ్యక్తి మరెవరో కాదు వలియప్పన్ ఒలగనాథన్ చిదంబరం పిళ్లై, లేదా వి.ఓ.సి గా సుప్రసిద్ధుడు.   తమిళనాడుకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరైన అతనిని ‘కపలోతియ తమిళన్ అని కూడా పిలిచేవారు. రూ.347 కోసం గాంధీని ఉత్తరాలతో వెంటాడి, భారత్ తొలి స్వదేశీ షిప్పింగ్ సర్వీసును ప్రారంభించిన వ్యక్తి,  ఒకప్పుడు విజయవంతమైన వ్యాపారవేత్త కావడం విడ్డూరం.

ఒట్టపిడారం టుటికోరిన్ జిల్లాలోని ఒక చిన్న పట్టణం.  ఇది అమ్మన్ ఆలయానికి ప్రసిద్ధి చెందింది.   ఇక్కడికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో పాంచాలంకురిచ్చి వద్ద పురాణ తమిళ యోధుడు వీర పాండ్య కట్టబొమ్మన్ కోట  ఉంది.   ఈ ఒట్టపిడారం పట్టణంలో,  1872  సెప్టెంబర్ 5న వి.ఓ. చిదంబరం పిళ్లై ఒలగనేరహతన్ పిళ్లై, పరమయి అన్నల్ దంపతులకు జన్మించారు.  అమ్మమ్మ దగ్గర శివుని గురించి, తాత దగ్గర రామాయణం నేర్చుకుంటూ పెరిగాడు. అతనికి గురువు సుబ్రమణ్య పిళ్ళై.  ఈయన చిదంబరానికి  మహాభారతం  బోధించాడు.  తన వయస్సులోని ఇతర పిల్లల మాదిరిగానే, ఇతను కూడా గోలి, కబడ్డీ, సిలంబట్టం వంటి ఆరుబయట ఆటలు ఆడటానికి ఇష్టపడేవాడు. చదరంగం క్రీడలో కూడా  ఆరితేరాడు. 

చిదంబరం పిళ్లై, తన 14వ యేట తూత్తుకుడి వెళ్లి, కాల్డ్ వెల్ హైస్కూల్ లో, ఆ తర్వాత తిరునల్వేలిలోని హిందూ కాలేజ్ హైస్కూల్ లో విద్యాభ్యాసం కొనసాగించారు. తండ్రి న్యాయశాస్త్రం చదవడానికి తిరుచ్చికి పంపడానికి ముందు అతను కొంతకాలం గుమస్తాగా పనిచేశాడు. అతను 1894 లో న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు.  మరుసటి సంవత్సరం ప్లీడర్ గా ప్రాక్టీస్ చేయడానికి ఒట్టపిడారానికి తిరిగి వచ్చాడు. భారతదేశానికి ఏదైనా చేయాలనే స్వామి వివేకానంద భావజాలంతో ప్రభావితుడైన ఆయన, రామకృష్ణ మఠంలో మహాకవి భారతీయర్ ను కలుసుకున్నారు.

స్వాతంత్రోద్యమంలో మునిగిపోయిన వి.ఒ.సి,  తిలక్ భావజాలానికి ప్రభావితుడై ఆయన అనుయాయులలో ఒకరిగా మారాడు.  సుబ్రమణ్య శివ, భారతీయార్ లతో కలిసి మద్రాసు ప్రెసిడెన్సీలో స్వాతంత్ర్యోద్యమ ప్రముఖుల్లో ఒకరిగా ఎదిగారు.  1905 లో బెంగాల్ విభజన తరువాత, అతను భారత జాతీయ కాంగ్రెస్ లో చేరి, లాల్ బాల్ పాల్ త్రయం నేతృత్వంలోని అతివాద వర్గంలో భాగమయ్యాడుచిదంబరం పిళ్లై, యువనేష్ ప్రచార సభ, దేశీభామన సంఘం, మద్రాసు ఆంగ్లో ఇండస్ట్రియల్ సొసైటీ లిమిటెడ్ వంటి అనేక సంస్థలను స్థాపించారు. భారత్ తొలి స్వదేశీ షిప్పింగ్ సర్వీసును ఏర్పాటు చేయడమే ఆయన సాధించిన అతిపెద్ద విజయం.

ఆ రోజుల్లో బ్రిటీష్ వారికి షిప్పింగ్ సేవలపై గుత్తాధిపత్యం ఉండేది.  ముఖ్యంగా భారతదేశం నుండి అన్ని సేవలను బ్రిటిష్ ఇండియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ నడిపేది.  భారతదేశ షిప్పింగ్ రంగంపై బ్రిటీష్ వారి పట్టును విచ్ఛిన్నం చేయడానికి అతను 1906 లో భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ షిప్పింగ్ కంపెనీని ప్రారంభించాడు. 10 లక్షల రూపాయల పెట్టుబడితో, విఓసి,  అక్టోబర్ 1906 లో స్వదేశీ షిప్పింగ్ కంపనీని రిజిస్టర్ చేసాడు.  దీనికి డైరెక్టర్ ఈ ప్రాంతానికి చెందిన ప్రభావవంతమైన జమీందారు మరియు మదురై తమిళ సంఘం వ్యవస్థాపకుడు పాండి తురై తేవర్. కంపెనీకి మొదట్లో సొంత నౌకలు లేకపోవడంతో వాటిని షాలిన్ స్టీమర్స్ నుంచి లీజుకు తీసుకోవాల్సి వచ్చింది. లీజును రద్దు చేయాలని బ్రిటీష్ ఇండియా స్టీమ్, షాలిన్ పై ఒత్తిడి తెచ్చినప్పుడు, చిదంబరం మనకంటూ స్వంత నౌకాదళం ఏర్పాటు చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు. 

వి ఓ చిదంబరం పిళ్లై భారతదేశం అంతటా ప్రయాణించి, కంపెనీ వాటాలను విక్రయించడం ద్వారా నౌకల కోసం డబ్బును సేకరించాడు.  “నేను ఓడలతో తిరిగి వస్తాను, లేకపోతే  సముద్రంలో నశిస్తాను” అని ప్రమాణం చేసి చివరకు ఫ్రాన్స్ నుండి ఎస్ఎస్ గలియా, తరువాత ఎస్ఎస్ లావో రెండింటినీ కొనుగోలు చేయగలిగాడు.  బ్రిటీష్ ఇండియా స్టీమ్, తన సంస్థను కొనుగోలు చేసి వ్యాపారంలో పిళ్లై ని దెబ్బతీసేందుకు ప్రయత్నించగా, ఒప్పందాన్ని సున్నితంగా తిరస్కరించాడు.  పిళ్లై,  తూత్తుకుడి మరియు కొలంబో మధ్య మొట్టమొదటి భారతీయ షిప్పింగ్ సేవ ప్రారంభినచ్చాడు. 

1908 ఫిబ్రవరి 23న తూత్తుకుడిలోని కోరల్ మిల్లులో కార్మికులు సమ్మెకు దిగినప్పుడు, సుబ్రహ్మణ్య శివతో కలిసి, వీవోసీ వారికి మద్దతుగా ప్రసంగించి, అధిక వేతనాలు, మెరుగైన పని పరిస్థితులను డిమాండ్ చేస్తూ సమ్మెకు నాయకత్వం వహించారు. యాజమాన్యం చివరకు వీరి డిమాండ్లను అంగీకరించింది.  శ్రీ అరబిందో తన వందేమాతరం దినపత్రికలో చిదంబరం మరియు శివ ఇద్దరినీ ప్రశంసించాడు. దీనితో  వి.ఒ.సి.కి పెరుగుతున్న ప్రజాదరణ గురించి బ్రిటిష్ వారు ఆందోళన చెందారు.  ఒక బ్రిటిష్ అధికారి, వించ్, ఎటువంటి రాజకీయ తిరుగుబాటులో పాల్గొనబోనని హామీ ఇవ్వమని చిదంబరం పిళ్లై ని కోరాడు.  వి.ఒ.సి నిరాకరించడంతో, 1908 మార్చి 12 న, శివతో పాటు అతన్ని అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచారు.

వీవోసీ అరెస్టుకు నిరసనగా తిరునల్వేలిలో పాఠశాలలు, దుకాణాలు, కళాశాలలు మూతపడగా, తూత్తుకుడిలో భారీ సమ్మె జరిగింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, వీవోసీ అరెస్టును ఖండిస్తూ ర్యాలీలు నిర్వహించారు. రాజద్రోహం నేరం మోపి 1908 జూలై నుంచి 1910 డిసెంబరు వరకు కోయంబత్తూరులోని కేంద్ర కారాగారంలో నిర్బంధించారు. ఈ తీర్పును దేశ నాయకులందరూ విస్తృతంగా ఖండించారు.  బ్రిటిష్ మీడియా కూడా ఇది అన్యాయమని పేర్కొంది.  తదుపరి అప్పీలుపై, శిక్షను 4 సంవత్సరాల జైలు శిక్ష మరియు 6 సంవత్సరాల ప్రవాసానికి మార్చారు.

కోయంబత్తూరు, ఆ తర్వాత కన్ననూరులో నిర్బంధంలో ఉన్న వీవోసీని రాజకీయ ఖైదీగా పరిగణించకుండా, దోషిగా పరిగణించి, కష్టపడి పనిచేసేలా చేశారు. ఎద్దులకు బదులుగా, ఈయనను  పెట్టి,  ఎండలో నూనె గానుగను త్రిప్పించేవారు, కొట్టేవారు.  జైలులో అతను అనుభవించిన శ్రమ మరియు చిత్రహింసలు అతని ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి.

1912 డిసెంబరులో విడుదలైన వీవోసీ జీవితం పూర్తిగా నాశనమైంది. అతని షిప్పింగ్ కంపెనీని బ్రిటీష్ వారు రద్దు చేశారు.  వారు అతని నౌకలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అతని లా లైసెన్స్ ను రద్దు చేశారు. చిదంబరం పిళ్లైని   తిరునల్వేలికి తిరిగి వెళ్ళడానికి అనుమతించలేదు.  బతుకుదెరువు కోసం భార్య, ఇద్దరు కుమారులతో కలిసి చెన్నైకి మకాం మార్చి అక్కడ చిన్నపాటి నిత్యావసరాల దుకాణం నడిపాడు.  ఆ సమయంలోనే గాంధీజీతో తనకు అత్యంత అవసరమైన డబ్బు గురించి సుదీర్ఘంగా వాగ్వివాదం జరిగింది.

గాంధీజీతో సైద్ధాంతిక విభేదాల కారణంగా, 1920లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి, రచనా వ్యాసంగానికి  ఎక్కువ సమయం కేటాయించి కార్మిక సంఘాలను స్థాపించారు. కొద్దిపాటి ఆదాయంతో మళ్లీ లా ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించగా, ఎట్టకేలకు అనుమతి లభించింది.  1927లో కోవిల్పట్టిలో న్యాయవాద వృత్తిని ప్రారంభించి సేలంలో తిరిగి కాంగ్రెస్ లో చేరారు. అయితే కాంగ్రెసు వారి తీరుతో విసిగిపోయి మరోసారి ఆయన పార్టీని వీడారు.  అతను 1932 లో తూత్తుకుడికి తిరిగి వెళ్ళాడు, అక్కడ అతను తన మిగిలిన సమయాన్ని పూర్తిగా రచనా వ్యాసంగంలో గడిపాడు.  వీరి రచనలలో,  తిరుక్కురళ్ మరియు టోల్కాపియంపై వ్యాఖ్యానం కూడా ఉంది. ఆయన రచించిన మరో ప్రసిద్ధ గ్రంథం మెయ్యారమ్.  ఇందులో  అతను తన స్వీయచరిత్ర నేపథ్యంలో నీతివంతమైన జీవితం, ప్రవర్తన  రచించాడు. 

చివరకు 1936 నవంబర్ 18న వి.ఓ. చిదంబరం పిళ్లై కన్నుమూశారు. బ్రిటీష్ వారిని ఎదిరించి, భారత్ తొలి షిప్పింగ్ సర్వీసును ప్రారంభించిన వ్యక్తి కనుమరుగైపోయారు. అయినప్పటికీ, తన ప్రజల కోసం నూనె గానుగ కూడా లాగిన మహానుభావుడు  కపలోతియ తమిళన్ గా,  చెక్కిలుత్త చెమ్మల్ గా తమిళ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన గౌరవార్థం టుటికోరిన్ పోర్టుకు చిదంబరం పిళ్లై పేరు పెట్టగా, ఆయన విగ్రహాలు చెన్నై, తిరునల్వేలి, తూత్తుకుడిలో ఉన్నాయి. స్వాతంత్ర్య సమరయోధుడు, ఆలోచనాపరుడు, జాతీయవాది, రచయిత, పారిశ్రామికవేత్త వి.ఒ.చిదంబరం పిళ్లై స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో పాల్గొన్న వారిలో  మొదటి వరుసలో నిలుస్తారు.