RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

నిజాం పై పోరాటంలో భైరవునిపల్లి ఘట్టం :

రజాకార్లు అడిగిన సొమ్మును గ్రామస్తులు చెల్లించకపోవడంతో లింగాపూర్ గ్రామం మొత్తం నిర్మానుష్యంగా మారింది. ఇళ్లకు నిప్పుపెట్టారు, పురుషులను హత్య చేశారు, మహిళలను అవమానించారు, పిరికిపందలలాగా పిల్లలు, వృద్ధులను చంపారు.  ఈ భయంకరమైన వార్త సమీప గ్రామమైన భైరవునిపల్లికి వ్యాపించడంతో 30-40 మంది వ్యక్తులు కర్రలతో లింగాపూర్ వైపు పరుగెత్తారు, వారికి  దోచుకున్న సంపద, ధాన్యంతో నిండిన బండ్లతో రజాకార్లు కనిపించారు. గ్రామస్థులపై బుల్లెట్ల వర్షం కురిపించినా జంకకుండా రజాకారులను  వెంబడించడం ప్రారంభించారు. కొద్దిసేపటికే రజాకార్లు దోపిడీతో నిండిన బండ్లను మరియు వారి వద్ద ఉన్న తుపాకులను వదిలి పారిపోయారు.

ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత రజాకార్లు పెద్ద సంఖ్యలో భైరవునిపల్లికి వచ్చి దోపిడీ బండ్లతో పాటు  రూ. 1200/- జరిమానా  ఇవ్వాలని డిమాండ్ చేయగా గ్రామ పెద్దలు సున్నితంగా తిరస్కరించారు. రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడారని గ్రామస్తులపై ఆ ప్రాంత పోలీస్ అమీన్ కు ఫిర్యాదు చేశారు రజాకార్లు.  ఈ సంఘటనల ఉధృతిని గమనించిన భైరవునిపల్లి గ్రామస్తులు, లింగాపూర్ ఉదంతం పునరావృతం కాకుండా,  గ్రామాన్ని రక్షించడానికి పక్కా ప్రణాళికతో కూడిన రక్షణ అవసరమని ఏకగ్రీవంగా తీర్మానించారు. దీని ప్రకారం భైరవునిపల్లి టవర్ వద్ద వాచ్ ను ఏర్పాటు చేసి  టవర్ వద్ద  నిరంతరం కాపలా ఏర్పాటు చేశారు.  ఆ గ్రామానికి ఏ ప్రమాదం జరిగినా, గ్రామస్తులందరూ చేతిలో ఉన్న పనిని వదిలేసి, కర్ర, కొడవలి, గొడ్డలి లేదా రాయితో పోరాడటానికి సంసిద్ధులుగా ఉండేవారు.

చుట్టుపక్కల ఉన్న ఎనిమిది గ్రామాలకు చెందిన  50 నుండీ 100 మంది గ్రామస్థులను రాళ్ళు, కర్రలతో కాపలాగా పెట్టి గ్రామస్తుల  మనోధైర్యాన్ని కాపాడే పనిని అప్పగించారు. తదనుగుణంగా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆయుధాలు, పేలుడు పదార్థాలను కూడా సిద్ధంగా ఉంచేవారు.  విశ్వనాథ భట్ జోషి అనే బ్రాహ్మణ యువకుడు తన సైకిల్ పైన తిరుగుతూ సాధారణ గొర్రెల కాపారుల ద్వారా వైర్లెస్ సేవలను ప్రారంభించాడు.

గ్రామస్తుల రక్షణ వ్యవస్థతో భైరవునిపల్లి శత్రుదుర్భేద్యమైనది. రజకారులు ముందుకు సాగే సూచనలు కనిపించకపోవడంతో భువనగిరి డిప్యూటీ కలెక్టర్ ఇక్బాల్ హాషీమ్ అసహనం వ్యక్తం చేశాడు. అందువలన ఈ పెద్దమనిషి సాయుధ బెటాలియన్ తో గ్రామంలో “శాంతిని” నెలకొల్పే వంకతో  బయలుదేరాడు. అతను గ్రామ సరిహద్దులకు చేరుకున్న వెంటనే కేటిల్డ్రం మోగింది. వెంటనే  గ్రామస్థులు తమకు కేటాయించిన స్థానాలనుండి ఇక్బాల్  హాషీమ్ మరియు అతని బెటాలియన్ రజాకార్లపై బుల్లెట్ల వర్షం కురిపించారు. సుమారు 8 గంటల పాటు కొనసాగిన ఈ ఘర్షణలో కేవలం నలుగురు గ్రామస్థులు మాత్రమే అమరులయ్యారు, అయితే 15 మందికి పైగా రజాకార్లు మరణించారు. ఈ ఓటమితో కోపోద్రిక్తుడైన పెద్దమనిషి ఇక్బాల్ హాషీమ్ ప్రతీకారం తీర్చుకుంటానని, భైరవునిపల్లి గ్రామస్తులకు  తగిన గుణపాఠం నేర్పుతానని ప్రతిజ్ఞ చేశాడు.

ఆ రోజుల్లో జనగామ గ్రామం తాలూకా కేంద్రంగా ఉండేది.  నిజాం  సైనికుల కంటోన్మెంట్ ఎప్పుడూ అక్కడే ఉండేది. డీఐజీ స్థాయి అధికారులు, పోలీసు శాఖకు చెందిన డీఎస్పీ, ఆర్మీకి చెందిన ఒక మేజర్, ఇద్దరు కెప్టెన్లు భైరవునిపల్లి పై దాడికి ప్రణాళికలో నిమగ్నమయ్యారు. ఆర్టిలరీ, గన్ పౌడర్ సామగ్రిని యుద్ధప్రాతిపదికన ట్రక్కుల్లో లోడ్ చేసుకుని  అర్థరాత్రి వరంగల్-సిద్దిపేట రహదారి వైపు జీపులు బయలుదేరాయి. కాన్వాయ్ లో నిజాంకి చెందిన 500 మంది సైనికులు ఉన్నారు. సైన్యం, పోలీసు దళం మరియు రజాకార్లతో పాటు 200 మంది పౌర అధికారులు ఉన్నారు.

 

భైరవునిపల్లి గ్రామంలో సాయంత్రం అయింది. పొలాల్లో రోజంతా పనిచేసి ఇంటికి తిరిగి వచ్చే ప్రజలు, పశువుల కాపరులు తమ పశువులతో  తిరిగి తమ గ్రామం వైపు వెళ్లిపోయారు.  రాబోయే విపత్తు గురించి ఎవరికీ అవగాహన లేదు.

తెల్లవారు జాము సమయంలో విశ్వనాథ్ భట్ జోషి కాలకృత్యం తీర్చుకోవడానికి బయలుదేరాడు. తెల్లవారు జామున చీకట్లో నిజాం  సైన్యానికి చెందిన సైనికులు అతడిని పట్టుకున్నారు. అక్కడికి  అర మైలు పరిధిలో ఉన్న భైరవునిపల్లి గ్రామాన్ని రజాకార్ల బలగాలు చుట్టుముట్టాయి. విశ్వనాథ భట్ ని కాల్చి చంపాలనే నిర్ణయానికి వచ్చారు.  కాని సివిలియన్ అధికారులలో ఒకరైన ఎం.ఎన్.రెడ్డి, విశ్వనాథ్  బ్రాహ్మణుడని,  అహింసావాది అని, అందువల్ల అతన్ని విడిచిపెట్టమని వాదించాడు. గ్రామస్తులను అప్రమత్తం చేయడానికే  జోషిని వదిలివేయమని ఆ సివిలియన్ అధికారి ప్రయత్నిస్తున్నాడనే అనుమానం వచ్చినప్పటికీ,  సైనికులు అతన్ని గట్టిగా హెచ్చరించి వదిలేశారు. భైరవునిపల్లి చుట్టుపక్కల గ్రామాల మధ్య వైర్లెస్ సర్వీస్ ఉన్నదన్న విషయం ఆ సైనికులకు తెలియదు. ఇంచుమించు అదే సమయంలో యువ కార్పెంటర్ వెంకట నరసయ్య పట్టుబడ్డాడు కానీ అతను బాగా బలవంతుడైన   వ్యక్తి అవడంతో సైనికులను తోసివేసి రాబోయే దాడి గురించి గ్రామస్తులను అప్రమత్తం చేస్తూ గట్టిగా పరిగెత్తాడు.

గొప్ప విప్లవకారుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ గా ఉరికంబంపై నిలబడి..

నాకు మునుపటి ఆశయాలు లేవు,

నాలో కోరికల గుంపు లేదు

బిస్మిల్ హృదయంలో మిగిలి ఉన్న ఏకైక కోరిక దేశం కోసం చావడమే!

ఆ స్పూర్తి నినాదాలే భైరవునిపల్లి గ్రామస్తులకు స్పూర్తి మంత్రాలయ్యాయి.

కొద్దిసేపటికే కెటిల్ డప్పు మోగింది, ఊరంతా యుద్ధ కేకలు ప్రతిధ్వనించాయి, గ్రామస్థులు తమ తమ స్థానాలను  చేపట్టడానికి పరిగెత్తారు, మహిళలు పిల్లలను, వృద్ధులను రక్షించారు, గ్రామంలో నగారా మ్రోగింది, యుద్ధం ఆరంభమైంది.

తెల్లవారు జామున రజాకార్ల దాడి జరిగిన సమయంలో గ్రామస్తులు చూపిన ధైర్యసాహసాలు, వారు చూపించిన మానవ నిబబామ్, తెగువ  మనను రోమాంచితులను చేస్తాయి.

నిజామీ దళాల నిర్దాక్షిణ్యమైన షెల్లింగ్, కాల్పులతో గ్రామస్తులు తమ సంప్రదాయ ఆయుధాలతో ఎక్కువసేపు నిలబడలేకపోయారు . రజాకార్ల బలాన్ని తెలుసుకునేందుకు టవర్ ఎక్కిన రామయ్య కోలి, భూమయ్య బంజారా అనే ఇద్దరు బాలురను కాల్చి చంపారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న గ్రామస్తులు సంధికి సంకేతంగా తెల్లజెండా ఎగురవేసినా అనాగరిక శక్తులు వెనక్కి తగ్గలేదు. వారు గ్రామంలోకి ప్రవేశించి చరిత్రలో కనీవినీ ఎరుగని  రక్తపాతాన్ని సృష్టించారు . పురుషులు, యువకులకు కళ్లకు గంతలు కట్టి తాళ్లతో కట్టేసి జంతువుల్లా గ్రామం నుంచి బయటకు లాక్కెళ్లి మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువకులు, వృద్ధులు, బలహీనులు, రోగగ్రస్తులు ఎవరినీ  ప్రాణాలతో వదలలేదు .

ఇంత అరరాచకం సృష్టించినా అనాగరికుల రక్తదాహం ఇంకా తీరలేదు. కళ్లకు గంతలు కట్టిన యువతీ యువకులను రప్పించి ఓ ప్రయోగానికి తలపడ్డారు. నిజామీ ఆర్మీ అధికారులువిశ్రాంతి తీసుకుంటూ చర్చించుకుంటున్నారు.  ఒకే వరుసలో నిలబెడితే ఎంతమంది గుండా 303 బుల్లెట్లు వెళతాయి అనే అనుమానాలను తీర్చుకునేందుకు కళ్ళకు గంతలు కత్తివేయబడ్డ యువతీ యువకులను ఎంచుకుని, ఓ యువ పోలీస్ అధికారి ముందుకు వచ్చి వెంటనే ఒకే బుల్లెట్ తో నలుగురిని హతమార్చాడు. దీంతో సంతృప్తి చెందని భువనగిరి డిప్యూటీ కలెక్టర్  ఇక్బాల్ హషీమ్ ముందుకు వచ్చి  పేల్చిన బుల్లెట్ మరో 10 మంది వ్యక్తులను దాటింది, అందరూ మరణించారు. సుమారు 150 మంది మరణించే వరకు దుర్మార్గమైన, క్రూరమైన ఆటలు అల్లాగే కొనసాగాయి. 90 మంది హరిజనులను చంపి సామూహిక సమాధిలో ఖననం చేశారు.

 

 

దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న సమయంలో భైరవునిపల్లిలో  (ఆగస్టు 27, 1948) జరిగిన రక్తపాతం ఒక విస్తుపోయే నిజం.

పిమ్మట దుష్ట రజాకార్లు భైరవునిపల్లి గ్రామాన్ని కొల్లగొట్టారు, పొలాలు ధ్వంసమయ్యాయి, రక్తపు మడుగులు ప్రవహించాయి, తెల్లవారు జామున పక్షుల కిలకిలారావాలతో పాటు భయంకరమైన కేకలు ప్రతిధ్వనించాయి, ఇళ్ల నుంచి వెలువడే దట్టమైన పొగ ఉదయపు ఎండను కప్పేసింది. వివేకవంతుడైన మానవ మేధస్సుకు సన్నివేశం అర్థంకానిది. వినాశనం పూర్తయింది.

సేకరణ శ్రీ వెల్లంకి రామకృష్ణ