RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి

రచన – మోదుమూడి సుధాకర్ 

ఆ మహానుభావుడు గతించి ఈ ఏడాదితో నూట ఎనిమిది సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఆయన పరమపదించిన 1917 వ సంవత్సరం నుండీ ఈనాటి వరకూ ఆయన శిష్యవర్గం, ప్రతి ఏడూ క్రమం తప్పక,వారి వర్ధంత్యుత్సవాలు జరుపుతూనే ఉన్నారు. నిజానికి త్యాగరాజస్వామికే దక్కని అదృష్టాన్ని స్వంతం చేసుకున్న ఆయన ఎవరు? ఆయన చేసిన ఘనకార్యమేమిటి?
ఆయనే కృష్ణాజిల్లా పెదకళ్ళేపల్లికి చెందిన సంగీత సద్గురువు #సుసర్ల_దక్షిణామూర్తి_శాస్త్రి గారు…సాక్షాత్తూ త్యాగయ్య గారి ప్రశిష్యులు.

ఆయన తాతగారైన రామమూర్తిశాస్త్రిగారు, గొప్ప సంస్కృత,వేద పండితులు. కడు పేదరికంతో కుటుంబ భారం మోయలేని స్థితిలో ఉన్న ఆయన, ఆ ప్రాంతపు రాజు గారిని ఆశ్రయించగా,వీరి ప్రతిభకు ముగ్ధుడై, రాజు గారు అయిదు గ్రామాలను బహుమానంగా ఇచ్చారు. వాటిలో ఒకటి పెదకళ్ళేపల్లి అగ్రహారం.1860 వ సంవత్సరం,’దక్షిణ కాశీ’ గా ప్రసిద్ధమైన పెదకళ్ళేపల్లిలో జన్మించారు దక్షిణామూర్తి శాస్త్రిగారు. సంగీతం ఆయనకు ఆరోప్రాణం. చిన్నతనంలో ఒకసారి శాస్త్రిగారు బందరులో ఒక తమిళ అయ్యరు గారి కచేరీ వినటం జరిగింది. అయ్యరు గారి పాటలో సంగీతపరమైన దోషాలు కనబడ్డాయి శాస్త్రిగారికి. అయితే, అందరూ ‘శభాషని’ మెచ్చుకుంటుంటే,ఆ దోషాలను విశ్లేషించలేకపోయారు శాస్త్రిగారు. ఆ క్షణానే ఒక ఎలాగైనా సంగీత శాస్త్రం అభ్యసించాలని నిశ్చయానికొచ్చారు.

అయితే..ఆనాడు తెలుగునాట,సంప్రదాయ సంగీతం చెప్పే గురువులు లేరు. మొక్కవోని పట్టుదలతో, కాలినడకన, వందల మైళ్ళు ప్రయాణం చేసి,తంజావూరు చేరుకున్నారు. అక్కడ త్యాగయ్య గారి మేనల్లుడు,ప్రియశిష్యుడు ఆకుమడుల (మానంపూచావడి) వెంకటసుబ్బయ్య గారి గురుకులంలో ప్రవేశించారు. అనేక విధాల పరీక్షించిన పిమ్మట,శాస్త్రి గారికి సంగీత శిక్షణను ప్రారంభించారు సుబ్బయ్యగారు.తెలుగునాట నుండి విద్యార్థియై వచ్చిన అంధులైన ఫ్లూటు శరభ శాస్త్రి గారితో కలిపి రోజూ పాఠం జరిగేది.

కొంతకాలం గడిచింది…సుబ్బయ్యగారు వయోవృద్ధులైనారు. ఒకనాడు వీరిద్దరినీ పిలిచి,’నాయనా! మీ ఊరిని,కన్న వాళ్ళనూ వదలి, ఇంత దూరం సంగీతం కోసం వచ్చిన మిమ్మల్ని చూస్తే నాకెంతో ఆనందం కలుగుతుంది. మీ మీద నాకు అపారమైన నమ్మకముంది. నాకు ఇక ఏ క్షణానైనా భగవంతుడి నుండి పిలుపురావచ్చు. నాకు మీరు ఇరువురూ ఒక ప్రమాణం చేయాలి. నాకు ఎవరూ లేరు, నా తదనంతరం, మీ గురుపత్ని బాధ్యత మీరు తీసుకోవాలి, మీకు నా సంగీత గ్రంథం అప్పగిస్తాను, శ్రద్ధాభక్తులతో నేను చెప్పినట్లు చేయండి. శాస్త్రీ! నీవు ఏకసంథాగ్రాహివి కనుక, పాఠాన్ని వ్రాసుకుంటూ నోటితో వల్లించు. నీకు కంఠస్థమౌతుంది.మరొకసారి, వ్రాసిన పాఠం ఇరువురూ కలసి పాడండి.అంధుడు,ద్విసంథాగ్రాహి అయిన శరభశాస్త్రికి అప్పుడది పట్టుపడుతుంది. ఈ విధంగా ప్రతిరోజూ చేయండి. నా ఆశీస్సులు సదా మీకుంటాయి.’ అలాగే ప్రమాణంచేశారు శిష్యులిద్దరూ. సుబ్బయ్యగారు స్వర్గారోహణం చేశారు. దక్షిణామూర్తిగారు, శరభశాస్త్రిగారు,తమ గురుపత్నిని కన్నతల్లికన్న మిన్నగా చూసుకుంటూ… గురుకటాక్షంతో ప్రాప్తించిన గ్రంథాన్ని త్రికరణశుద్ధిగా అధ్యయనం చేశారు. సంగీత విద్యాపరిపూర్ణులయ్యారు.

కొంతకాలానికి గురుపత్ని కాలంచేశారు. ఇక,దక్షిణామూర్తి,శరభశాస్త్రులిరువురూ కావేరీతీరాన తాము నేర్చిన ‘త్యాగరాజ సంప్రదాయ సంగీతం’తో స్వస్థలమైన కృష్ణాతీరానికి తిరిగి వచ్చారు.శరభశాస్త్రిగారు వేణుగాన ప్రదర్శనలు చేసి, గొప్ప విద్వాంసునిగా కీర్తి సంపాదించారు.
దక్షిణామూర్తిశాస్త్రిగారు తెలుగునాట సత్సంప్రదాయ సంగీత ప్రచార రథసారథి అయ్యారు.అగ్రహారీకులైన ఆయన,కులమత వివక్ష చూపక, భోజనం పెట్టి,విద్యార్థులెందరికో గురుకుల పద్ధతిలో విద్యాదానం చేశారు. వాగ్గేయకారులు,నైష్ఠికులైన ఆయన ఏనాడూ తన విద్యను వేదికపై ప్రదర్శించలేదు! ధనం ఆశించలేదు!!

ఈనాడు తెలుగునాట శాస్త్రీయ సంగీతం పరిఢవిల్లటానికి దక్షిణామూర్తి శాస్త్రులవారే ప్రధాన కారకులు. ‘గాయకసార్వభౌమ’ పారుపల్లిరామకృష్ణయ్య పంతులుగారు,వారి శిష్యులలో ముఖ్యులు.గురువుగారి మరణానంతరం,వారి అడుగుజాడలలో నడచి,బెజవాడ కేంద్రంగా గురుకులం స్థాపించి, బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి,ఎన్.సి.హెచ్.కృష్ణమాచార్యులు గార్ల వంటి విద్వాంసులను లోకానికందించారాయన. పంతులుగారు,త్యాగరాజ ఆరాధనోత్సవాలను, తమ గురువుగారితో కలసి నిర్వహించేవారు.1917 లో గురువుగారు అస్తమించడంతో,సుసర్ల వారి వర్ధంత్యుత్సవాలను కూడా,త్యాగరాజ ఉత్సవాలతో జతచేసి,నిర్వహించేవారు.అదే ఉత్సవాల సమయంలో పంతులుగారు 1951 లో అనూహ్యంగా మరణించడంతో,వారి శిష్యులు,ప్రధానంగా అన్నవరపువారు ఆ ఉత్సవాల నిర్వహణ భారాన్ని తన భుజస్కందాలపై వేసుకొని,నేటివరకూ నిరాటంకంగా ‘సద్గురువుల వర్ధంత్యుత్సవాల’ పేరిట జరుపుతున్నారు.1941 నుండీ ఈ ఉత్సవాలకు సజీవసాక్షిగా నిలచి….ఈయేడు, సుసర్లవారి 108వ, మరియు పారుపల్లివారి 74వ వర్ధంత్యుత్సవాలు బెజవాడలో అన్నవరపు రామస్వామి గురువుగారు నిర్వహిస్తున్నారు.
మరి…ఆ గురుపరంపరతో 84 సంవత్సరాల అనుబంధం వారిది!!

ఇంతకాలంగా నిరాటంకంగా సాగుతున్న ఈ సద్గురు ఆరాధనలో 50 సంవత్సరాలుగా పాల్గొనటం,పనిచేయటం,నిజంగా నా పూర్వజన్మ సుకృతమే…