RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

రాజా సోమనాద్రి – నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గద్వాల వీరుడు

గద్వాల మహారాజా పెద్ద సోమభూపాలుడు లేదా శ్రీ సోమశేఖర ఆనంద భూపాల్ రెడ్డిని సోమనాద్రి (క్రీ.పూ 1662-1713) అని కూడా పిలిచేవారు. సోమనాద్రి మొదట్లో పూడూరు నుండి పరిపాలించినా, తరువాత ప్రస్తుత తెలంగాణలోని  గద్వాలను రాజధానినగా చేసుకుని ఓ గొప్ప సంస్థానాన్ని నెలకొల్పాడు.  నిజాం కాలంలో వనపర్తి, జటప్రోలు  తదితర ప్రాంతాలతో పాటు గద్వాల కూడా ముఖ్యమైన, పెద్ద సంస్థానాలలో ఒకటిగా కొనసాగింది.

సోమనాద్రి పూర్వీకులు గద్వాల సమీపంలోని రాజవోలు, బోరవెల్లి ప్రాంతాలను పరిపాలించారు. కృష్ణానది తీరం వెంబడి ఉన్న అడవులకు వేటకు వెళ్లి ఆ ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని అక్కడ గద్వాల సంస్థానాన్ని స్థాపించారు.  అయితే అప్పటి హైదరాబాద్ నిజాం నసిరుద్దౌలా సన్నిహితుడు, ‘ఉప్పడుకోట’ పాలకుడు  సయ్యద్ దావూద్ మియాన్ గద్వాల స్థాపనను వ్యతిరేకించాడు.  అయితే ఈ భూమి తనదేనని సోమనాద్రి సయ్యద్ దావూద్ ను ఒప్పించి పట్టణాన్ని నిర్మించడానికి అనుమతి పొందుతాడు.  ఆ తర్వాత బలీయమైన కోటను నిర్మించి, సైన్యాన్ని కూడా ఏర్పరచుకొని, సయ్యద్ దావూద్ తో యుద్ధానికి సిద్ధమవుతాడు. రాయచూరు సమీపంలోని ‘ఆరగిద్ద’లో ఈ యుద్ధం జరిగింది. సయ్యద్ దావూద్ కు మద్దతుగా రాయచూరు నవాబు బాసర్ జంగ్, ప్రొద్దుటూరు (అలంపూర్ సమీపంలోనిది) ప్రాంత పాలకుడు ఇదురు సాబ్ తమ సైన్యాలతో వస్తారు. భీకర యుద్ధం జరిగింది. రాజా సోమనాద్రి సేనలు త్రిముఖ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి, ముగ్గురి సైన్యాలు వెనుదిరగవలసి వస్తుంది.  చివరికి సయ్యద్ దావూద్, రాజా సోమనాద్రికి నమస్కరించడంతో తన రాజచిహ్నాన్ని వదులుకోవాల్సి వస్తుంది.

అయితే సయ్యద్ దావూద్ ఆ అవమానాన్ని భరించలేక హైదరాబాద్ నిజాం వద్దకు వెళ్లి, రాజా సోమనాద్రితో యుద్ధం చేయమని బలవంతం చేస్తాడు.  ఈసారి రాయచూరు నవాబు బాసర జంగ్, ప్రొద్దుటూరు అధినేత ఇదురు సాబ్ నిజాం సైన్యంలో చేరగా, అదనంగా గూటీ సుల్తాన్, కర్నూలు నవాబు దావూద్ ఖాన్ నిజాం సైన్యంలో చేరుతారు. కర్నూలు  లోని తుంగభద్ర నది ఒడ్డున భీకర యుద్ధం జరుగుతుంది.  నిజాం సైన్యం నిడదూరు గ్రామంలో, రాజా సోమనాద్రి సైన్యం కలుగొట్ల గ్రామంలో మోహరిస్తాయి.

రాజా సోమనాద్రి బాగా పొడగరి.  బలిష్టమైన కండరాలు గల  యోధుడు.  శత్రువులతనిని  ‘ప్రళయ భైరవుడు’గా అభివర్ణించేవారు. అతనికి ఒక ప్రత్యేకమైన తెల్ల గుర్రం ఉండేది. యుద్ధాలకు ఆ తెల్ల గుర్రం మీదే స్వారీ చేసి వెళ్ళేవాడు.  సోమనాద్రి, తుంగభద్ర నదిని దాటి, శత్రువుల సైన్యాలపై భయంకరమైన దాడి చేసి, రాత్రికి రాత్రే చాలా మందిని హతమార్చి, తిరిగి తన కలుగొట్ల శిబిరానికి చేరుకున్నాడు.  ఈ పరిణామంతో చాలా కలత చెందిన నిజాం, రాజా సోమనాద్రిపై యుద్ధంలో ఎలా గెలవాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. సోమనాద్రి బలం తన గుర్రంలోనే ఉందని, యుద్ధంలో గెలవాలంటే దాన్ని అపహరించాలని అతని సేనానులలో ఒకరు సలహా ఇయ్యడంతో, ఉదయానికల్లా రాజా సోమనాద్రి గుర్రాన్ని ఎవరు తీసుకువచ్చినా జాగీరు బహుమతిగా ఇస్తామని నిజాం ప్రకటించాడు. సోమనాద్రి పరాక్రమాని ఎరిగిన సైనికులెవరూ నిజాం వేసిన ఎరకు ముందుకు రాలేదు.  చివరకు ఒక సైనికుడు రాజా సోమనాద్రి గుర్రాన్ని దొంగిలించడానికి సాహసించాడు.  అదృష్టం కొద్దీ అతనికి సమయం అనుకూలించింది. ఆ సమయంలో, సోమాద్రి శిబిరంలోని సైనికులందరూ బాగా అలసిపోయి నిద్రపోతున్నారు. నిజాం సైనికుడు గుర్రాన్ని దొంగిలించి తప్పించుకోగలిగాడు. అతను దానిని నిజాం ముందు ఉంచాడు, నిజాం వెంటనే అతనికి ఒక బంగారు కంకణం బహుమతిగా ఇస్తాడు.

గుర్రం దొంగిలించబడిందని తెలుసుకున్న రాజా సోమనాద్రి సైన్యం తీవ్రంగా కలత చెందినది. రాజా సోమనాద్రి తన కుడిచేతిని కోల్పోయినట్టే భావించాడు.  మరుసటి రోజు యుద్ధం ముగిసిన తర్వాత,   రాజా సోమనాద్రి ‘నా గుర్రాన్ని ఎవరు తిరిగి తీసుకువచ్చినా ఆ గుర్రం ఒక్కరోజులో తిరుగగలిగే భూమి మొత్తాన్ని బహుమతిగా ఇస్తాను ‘ అని ప్రకటించాడు.  వెంటనే గద్వాల సమీపంలోని ‘బుచ్చన్న పల్లె’కు చెందిన ‘హనుమప్ప నాయుడు’ అనే సైనికుడు దొంగిలించిన గుర్రంతో తిరిగి వస్తానని బయలుదేరుతాడు.  తన తలపై పశుగ్రాసం కుప్పను సర్దుకుని గుర్రాలకు పశుగ్రాసం అమ్ముతున్నట్లుగా నటిస్తూ,  నిజాం సైనిక శిబిరం వైపు వెళ్తాడు.  దూరంగా రాజా సోమనాద్రి గుర్రాన్ని చూడగా, గుర్రం కూడా అతనిని గుర్తు పడుతుంది. పశుగ్రాసం లేక గుర్రం  ఆకలితో ఉందని భావించిన నిజాం సైనికులు హనుమప్ప నుంచి ఆ గ్రాసమును ఒక్క రూపాయికి కొనుగోలు చేయడానికి బేరసారాలు జరుపుతారు.  ఈ బేరసారాల్లో జరిగిన జాప్యాన్ని ఆసరాగా తీసుకుని, నిజాం సైనికులు కొంతదూరం వెళ్లగానే, హనుమప్ప నాయుడు ఓ  గడ్డి కుప్ప కింద పడుకుని దాగుంటాడు.  అదే ప్రాంతంలో ఉన్న  గుర్రాన్ని కట్టిఉంచిన ఇనుపకడ్డీ పడిపోవడంతో, ఒక సైనికుడు అటుగా వచ్చి దానిని తిరిగి భూమిలోకి త్రవ్వి పాతబొతాడు . దురదృష్టవశాన,  గడ్డి కింద దాక్కున్న హనుమప్ప చేతికి ఆ ఇనుప కడ్డీ  గ్రుచ్చుకుంటుంది.  తన చేతికి తీవ్ర రక్తస్రావం అవుతున్నప్పటికీ, హనుమప్ప  విపరీతమైన ఆ నొప్పిని భరిస్తాడు.  కాసేపటి తర్వాత ఎవరూ కనిపించకపోవడంతో లేవడానికి ప్రయత్నించినా కుడి చేతిలో ఇనుప కడ్డీ  ఇరుక్కుపోవడంతో కుదరదు.  తనను తాను విడిపించుకునేందుకు ఎడమ చేత్తో కత్తి తీసుకుని కుడి చేతిని కోసుకున్నప్పటికీ తీవ్ర రక్తస్రావంతో స్పృహతప్పి పడిపోతాడు. కాసేపటికి మళ్ళీ స్పృహలోకి వచ్చి, కత్తిరించిన కుడి చేతిని తీసుకొని తలపైనున్న  గుడ్డలో చుట్టి, రాజా సోమనాద్రి గుర్రంతో సహా అక్కడి నుంచి తప్పించుకుంటాడు. నిద్రపోతున్న కొందరు సైనికులు లేచి చూస్తారు కానీ,వారు గుర్రాన్నినీరు త్రాగించడానికి తీసుకెళ్తున్నారని భావించి మిన్నకుంటారు. వీరుడైన హనుమప్ప అరగంటలో గుర్రంతో సహా రాజా సోమనాద్రి శిబిరానికి చేరుకుంటాడు. ఆశ్చర్యపోయిన రాజా సోమనాద్రి, హనుమప్పను ఆలింగనం చేసుకుని, తగిన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసి తాను ఇచ్చిన మాట ప్రకారం, గుర్రం ఒక రోజులో తిరగ గలిగినంత మొత్తం భూమిని మంజూరు చేస్తూ లిఖితపూర్వక లేఖ ఇస్తాడు.

మరుసటి రోజు యుద్ధభూమిలో, రాజా సోమనాద్రి తన గుర్రంతో ప్రళయ భైరవుడిగా విరుచుకు పడతాడు. నిజాంకు మద్దతుగా వచ్చిన ప్రొద్దుటూరు, బళ్లారి, ఆదోని నవాబులను హతమార్చి వారి సైన్యాలను పూర్తిగా ఓడిస్తాడు. రాజా సోమనాద్రి గద్వాల సైన్యం, నిజాం సైన్యాన్ని కర్నూలు కోట వరకు వెనక్కు తగ్గేలా చేసింది. నిజాంతో పోరాడుతూ రాజా సోమనాద్రి, అతని సైనికులు కోటలోకి ప్రవేశించగా, కోట ద్వారాలు మూసుకుపోథాయి. బయట ఉన్న గద్వాల సైనికులు కోట గోడలను బద్దలు కొట్టడానికి శాయశక్తులా ప్రయత్నించినా సఫలం కాలేకపోతారు. తమ ప్రయత్నాలు నిష్ఫలమవంతో, గద్వాలకు తిరిగి వస్తామని రాణి లింగమ్మకు సందేశం పంపుతారు. ధైర్యవంతురాలైన ఆ రాణి వారికి సమాధానంగా చీరలు, గాజులు, కుంకుమ పంపింది. దీనితో పొరుషం తెచ్చుకున్న  గద్వాల సైనికులు వీరోచితంగా పోరాడి కర్నూలు కోట ద్వారాలను బద్దలు కొట్టగలుగుతారు. కోట లోపల, రాజా సోమనాద్రి ముప్పది ఆరు గంటలకు పైగా వీరోచితంగా పోరాడాడు.  యుద్ధంలో సోమనాద్రి తన సైనికులనేకమందిని కోల్పోతాడు. తానూ  తీవ్రంగా గాయపడ్డాడు. కోటను బ్రద్దలు కొట్టిన సైనికులు, తీవ్రంగా గాయపడిన రాజా సోమనాద్రిని తమ శిబిరానికి తీసుకెళ్ళిపోతారు.

రాజా సోమనాద్రి కేవలం తన కొద్దిమంది సైనికుల సహాయంతోనే నిజాం సైన్యంలో  అధిక భాగాన్ని హతమార్చి భారీ విధ్వంసం సృష్టిసత్తాడు. ఈ పరిణామంతో భీతిల్లిన గూటీ, రాయచూరుకు చెందిన ఇద్దరు నవాబులు యుద్ధం విరమించుకోవడానికి మొగ్గు చూపుతారు. గద్వాల రాజా సోమనాద్రితో శాంతి చర్చలు జరిపితే మంచిదని నిజాంకు తన సలహాదారులు సూచిస్తారు.  ఈ భారీ యుద్ధానికి ప్రధాన కారకుడైన ఉప్పూరుకోటకు చెందిన సయ్యద్ దావూద్ మియాన్ ఏమీ మాట్లాడలేక తటస్థంగా ఉండిపతాడు.

మరుసటి రోజు ఉదయం నిజాం కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం కోసం రాజా సోమనాద్రి వద్దకు ఒక రాయబారిని పంపుతాడు. ఆ ప్రతిపాదనను రాజా సోమనాద్రి అంగీకరించాడు.  శాంతి ఒప్పందం ప్రకారం, కర్నూలులోని ‘కొండారెడ్డి కోటలోని ప్రసిద్ధ ‘ఎల్లమ్మ ఫిరంగి’, రాయచూరు నవాబులకు చెందిన గోన బుద్ధారెడ్డి నిర్మించిన ‘రామ లక్ష్మణుడు’ అని పిలువబడే రెండు ఫిరంగులను గద్వాల రాజా సోమనాద్రికి కానుకగా ఇస్తారు. కర్నూలు భూముల్లో కొంత భాగాన్ని కూడా రాజా సోమనాద్రికి ఇసత్తారు. నిజాంతో జరిగిన యుద్ధంలో విజయం సాధించి శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్న రాజా సోమ భూపాలుడు/ రాజా సోమనాద్రి విజయ గర్వంతో గద్వాలకు తిరిగి వస్తాడు.

కాలక్రమేణా గద్వాల ఒక శక్తివంతమైన సంస్థానంగా, అభివృద్ధి చెందుతున్న నగరంగా మారింది.   పట్టణంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచినారు. 17వ శతాబ్దంలో గద్వాల కోట లోపల చెన్నకేశవ స్వామి ఆలయంతో సహా అనేక దేవాలయాలను నిర్మించాడు. లింగమ్మ బావి, చొక్కమ్మ బావి అనే రెండు బావులను సోమనాద్రి తన భార్యలు లింగమ్మ, చొక్కమ్మ పేర్లతో నిర్మించాడు. కళలకు కేంద్రంగా వ్యవహరించిన గద్వాలలో సంవత్సరానికి రెండుసార్లు పెద్ద ఎత్తున పండితుల సభలు నిర్వహించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పండితులను, కవులను రప్పించేవారు. గద్వాలను ‘విద్వత్ గద్వాల’ అని పిలిచేవారు.

సోమనాద్రి మనవడు చిన సోమనాద్రి లేదా చిన సోమభూపాలుడు స్వతహాగా గొప్ప పేరున్న కవి, సాహిత్య కార్యక్రమాలను ఎంతగానో ప్రోత్సహించారు. గద్వాల రాజవంశానికి చెందిన మొదటి ముష్టిపల్లి రామభూపాలుడు కూడా సంస్కృత పండితుడు, సాహిత్యం, సంగీతం, ఇతర కళలను ప్రోత్సహించాడు. ఆయన హయాంలో కూడా సుదూర ప్రాంతాలైన వారణాసి, మైసూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పండితులు, కవులు పండిత సభలు నిర్వహించేవారు. ఆయన కుమారుడు సీతారామ భూపాలుడు కూడా గొప్ప కళాపోషకుడు.

గద్వాల చేనేత పరిశ్రమ అద్భుతమైన పట్టుచీరలు, జరీ పనులకు ప్రసిద్ధి చెందింది.

(శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారి “హైందవ వీరులు” అన్న పుస్తక సౌజన్యంతో)

 

 

గద్వాల మహారాజా పెద్ద సోమభూపాలుడు లేదా శ్రీ సోమశేఖర ఆనంద భూపాల్ రెడ్డిని సోమనాద్రి (క్రీ.పూ 1662-1713) అని కూడా పిలిచేవారు. సోమనాద్రి మొదట్లో పూడూరు నుండి పరిపాలించి, తరువాత ప్రస్తుత తెలంగాణలో గద్వాల రాజధానిని స్థాపించిన ఒక ముఖ్యమైన సంస్థానం. వనపర్తి, జట్నూర్ తదితర ప్రాంతాలతో పాటు నిజాం కాలంలో గద్వాల ముఖ్యమైన, పెద్ద సంస్థానాలలో ఒకటిగా కొనసాగింది.

సోమనాద్రి పూర్వీకులు గద్వాల సమీపంలోని రాజవోలు, బోరవెల్లి ప్రాంతాలను పరిపాలించారు. కృష్ణానది తీరం వెంబడి ఉన్న అడవులకు వేటకు వెళ్లి ఆ ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని అక్కడ గద్వాల సంస్థను స్థాపించాడు. అయితే అప్పటి హైదరాబాద్ నిజాం నాసిరుద్దౌలా సన్నిహితుడు, ‘ఉప్పడుకోట’ చీఫ్ సయ్యద్ దావూద్ మియాన్ గద్వాల స్థాపనను వ్యతిరేకించాడు, అయితే ఈ భూమి తనదేనని సోమనాద్రి సయ్యద్ దావూద్ ను ఒప్పించి పట్టణాన్ని నిర్మించడానికి అనుమతించమని ఒప్పించాడు.  ఆ తర్వాత బలీయమైన కోటను నిర్మించి, సైన్యాన్ని సంపాదించి, సయ్యద్ దావూద్ తో యుద్ధానికి సిద్ధమయ్యాడు. రాయచూరు సమీపంలోని ‘ఆరాగిద్ద’లో ఈ యుద్ధం జరిగింది. సయ్యద్ దావూద్ కు మద్దతుగా రాయచూరు నవాబు బాసర్ జంగ్, ప్రొద్దుటూరు (అలంపూర్ సమీపంలో) ప్రావిన్స్ చీఫ్ ఇదురు సాబ్ తమ సైన్యాలతో వచ్చారు. భీకర యుద్ధం జరిగింది. రాజా సోమనాద్రి సేనలు త్రిముఖ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి, ముగ్గురి సైన్యాలు వెనుదిరగవలసి వచ్చింది, చివరికి సయ్యద్ దావూద్ రాజా సోమనాద్రికి నమస్కరించడంతో తన చిహ్నాన్ని వదులుకోవాల్సి వచ్చింది.

అయితే సయ్యద్ దావూద్ అవమానాన్ని భరించలేక హైదరాబా నిజాం వద్దకు వెళ్లి రాజా సోమనాద్రితో యుద్ధం చేయమని బలవంతం చేశాడు. ఈసారి రాయచూరు నవాబు బాసర జంగ్, ప్రొద్దుటూరు అధినేత ఇదురు సాబ్ నిజాం సైన్యంలో చేరగా, అదనంగా గూటీ సుల్తాన్, కర్నూలు నవాబు దావూద్ ఖాన్ నిజాం సైన్యంలో చేరారు. కర్నూల్ లోని తుంగభద్ర ఒడ్డున భీకర యుద్ధం జరిగింది, నిజాం సైన్యం నిడదూరు గ్రామంలో, రాజా సోమనాద్రి సైన్యం కలుగొట్ల గ్రామంలో మోహరించింది, చిహ్నాలు, శిథిలాలు అన్నీ నేటికీ ఉన్నాయి.

రాజా సోమనాద్రి పొడవైన, బాగా నిర్మించబడిన కండరాల యోధుడు; శత్రువులకు ‘ప్రళయ భైరవుడు’గా అభివర్ణించాడు. అతనికి ఒక ప్రత్యేకమైన తెల్ల గుర్రం ఉండేది, దానిపై అతను తన అన్ని యుద్ధాలలో ప్రయాణించేవాడు. సోమనాద్రి తుంగభద్ర నదిని దాటి, క్రూరంగా పోరాడి శత్రువుల సైన్యాలపై దాడి చేసి, రాత్రికి చాలా మందిని హతమార్చి, తిరిగి తన కలుగొట్ల శిబిరానికి చేరుకున్నాడు. చాలా కలత చెందిన నిజాం రాజా సోమనాద్రిపై యుద్ధంలో ఎలా గెలవాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. సోమనాద్రి బలం తన గుర్రంలోనే ఉందని, యుద్ధంలో గెలవాలంటే దాన్ని అపహరించాలని కమాండర్లలో ఒకరు చెప్పగా, ఉదయానికల్లా రాజా సోమనాద్రి గుర్రాన్ని ఎవరు తీసుకువచ్చినా జాగీరు బహుమతిగా ఇస్తామని నిజాం ప్రకటించాడు. సైనికులెవరూ ఎరకు లేవలేదు, చివరకు ఒక సైనికుడు రాజా సోమనాద్రి గుర్రాన్ని దొంగిలించడానికి సాహసించాడు.  అతని అదృష్టం అతనికి అనుకూలంగా ఉంది, గార్డులు అలసిపోయి నిద్రపోతున్నారు, నిజాం సైనికుడు గుర్రంతో దొంగిలించి తప్పించుకోగలిగాడు, అతను దానిని నిజాం ముందు ఉంచాడు, అతను వెంటనే అతనికి బంగారు కంకణం బహుమతిగా ఇచ్చాడు.

గుర్రం దొంగిలించబడిందని తెలుసుకున్న రాజా సైన్యం తీవ్రంగా కలత చెంది, రాజా సోమనాద్రి తన కుడిచేతిని కోల్పోయానని భావించాడు.  ఆ రోజు యుద్ధం తర్వాత ఆ రోజు సాయంత్రం రాజా సోమనాద్రి ‘నా గుర్రాన్ని ఎవరు తిరిగి తీసుకువచ్చినా ఆ గుర్రం ఒక్కరోజులో తిరగగలిగే భూమి మొత్తాన్ని బహుమతిగా ఇస్తారు’ అని ప్రకటించాడు.  వెంటనే గద్వాల సమీపంలోని ‘బుచ్చన్న పల్లె’కు చెందిన ‘హనుమప్ప నాయుడు’ అనే సైనికుడు దొంగిలించిన గుర్రంతో బయటకు వచ్చి తిరిగి వచ్చేశాడు.  వెంటనే తలపై పశుగ్రాసం కుప్పను సర్దుకుని గుర్రాలకు పశుగ్రాసం అమ్ముతున్నట్లు నటిస్తూ నిజాం సైనిక శిబిరం వైపు వెళ్లాడు. దూరంగా రాజా సోమనాద్రి గుర్రాన్ని చూడగా, గుర్రం కూడా అతన్ని గుర్తుపట్టి వెక్కి వెక్కి ఏడ్చింది. గుర్రం పశుగ్రాసం కోసం ఆకలితో ఉందని భావించిన నిజాం సైనికులు హనుమప్ప నుంచి ఒక్క రూపాయికి కొనుగోలు చేయడానికి బేరసారాలు జరిపారు.  సైనికులు అతనికి డబ్బు చెల్లించిన ఒక వ్యక్తిని పంపారు, కాని హనుమప్ప ఇంకా చెల్లించవలసి ఉందని నటిస్తూ అక్కడే వేచి ఉన్నాడు. నిజాం సైనికులు కొంతదూరం వెళ్లగానే వెంటనే గడ్డి కుప్ప కింద పడుకున్నాడు. గుర్రాన్ని కట్టిన రాడ్ పడిపోయినప్పుడు, ఒక సైనికుడు అర్ధరాత్రి వచ్చి దానిని తిరిగి భూమిలోకి తవ్వాడు; దురదృష్టవశాత్తు సిబ్బంది గడ్డి కింద దాక్కున్న హనుమప్ప చేతిని గుచ్చుకున్నారు. చేతికి తీవ్ర రక్తస్రావం అవుతున్నప్పటికీ విపరీతమైన నొప్పిని భరించాడు. కాసేపటి తర్వాత ఎవరూ కనిపించకపోవడంతో లేవడానికి ప్రయత్నించినా కుడి చేయి రాడ్డుతో ఇరుక్కుపోవడంతో కుదరలేదు.  తనను తాను విడిపించుకునేందుకు ఎడమ చేత్తో కత్తి తీసుకుని కుడి చేతిని కోసుకున్నప్పటికీ తీవ్ర రక్తస్రావంతో స్పృహతప్పి పడిపోయాడు. కాసేపటికి మళ్ళీ స్పృహలోకి వచ్చి, కత్తిరించిన కుడి చేతిని తీసుకొని తలపై గుడ్డలో ప్యాక్ చేసి గుర్రంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నిద్రపోతున్న కొందరు సైనికులు పైకి చూశారు, కాని వారు గుర్రాన్ని తాగడానికి నీటి వద్దకు తీసుకెళ్తున్నారని భావించారు, నిరంతర పోరాటం కారణంగా, గుర్రాలను 24 గంటలూ త్రాగడానికి నదికి తీసుకెళ్లడం ఆనవాయితీగా మారింది. అరగంటలో గుర్రంతో రాజా సోమనాద్రి శిబిరానికి చేరుకున్నాడు. ఆశ్చర్యపోయిన రాజా సోమనాద్రి హనుమప్పను ఆలింగనం చేసుకుని, వెంటనే అతని మాట ప్రకారం, గుర్రం ఒక రోజులో తిరగడానికి వీలుగా మొత్తం భూమిని మంజూరు చేస్తూ లిఖితపూర్వక లేఖ ఇచ్చాడు. (హనుమప్ప నాయుడు వారసులకు భూమిపై పూర్తి హక్కులు ఉన్నాయి. వారి కుటుంబంలోని గత తరాల వారు ఇచ్చిన భూముల్లో ఎక్కువ భాగాన్ని ఇతరులకు దానం చేసిన తర్వాత కూడా).

మరుసటి రోజు క్రూరమైన యుద్ధభూమిలో రాజ సోమనాద్రి తన గుర్రంతో భైరవుడిగా తిరిగి వచ్చాడు. నిజాంకు మద్దతుగా వచ్చిన ప్రొద్దుటూరు, బళ్లారి, ఆదోని నవాబులను హతమార్చి వారి సైన్యాలను పూర్తిగా ఓడించారు. రాజా సోమనాద్రి గద్వాల సైన్యం నిజాం సైన్యాన్ని కర్నూలు కోట వరకు వెనక్కు తగ్గేలా చేసింది. నిజాంతో పోరాడుతూ రాజా సోమనాద్రి, అతని సైనికులు కోటలోకి ప్రవేశించగా, కోట ద్వారాలు మూసుకుపోయాయి. బయట ఉన్న గద్వాల సైనికులు కోట గోడలను బద్దలు కొట్టడానికి శాయశక్తులా ప్రయత్నించినా సఫలం కాలేదు. గద్వాలకు తిరిగి వస్తామని రాణి లింగమ్మకు సందేశం పంపారు. ధైర్యవంతురాలైన రాణి వారికి సమాధానంగా చీరలు, గాజులు, కుంకుమ పంపింది. సరిగ్గా అదుపు తప్పిన గద్వాల సైనికులు భీకర శక్తితో పోరాడి కర్నూలు కోట ద్వారాలను బద్దలు కొట్టగలిగారు. కోట లోపల, రాజా సోమనాద్రి 36 గంటలకు పైగా వీరోచితంగా పోరాడాడు, అతను అనేక మంది సైనికులను కోల్పోయాడు మరియు అతను తీవ్రంగా గాయపడ్డాడు. తన సైనికులు తలుపులు పగలగొట్టడంతో తీవ్రంగా గాయపడిన రాజా సోమనాద్రిని తన శిబిరానికి తీసుకెళ్లాడు.

నిజాం సైన్యాన్ని బాగా కలవరపెట్టిన రాజా సోమనాద్రి కొద్దిమంది సైనికుల సహాయంతో వారి సైన్యాలలో అధిక భాగాన్ని హతమార్చి భారీ విధ్వంసం సృష్టించాడు. మరుసటి రోజు పూర్తి శక్తితో యుద్ధానికి తిరిగి వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? గూటీ, రాయచూరుకు చెందిన మిగిలిన ఇద్దరు నవాబులు యుద్ధం విరమించుకోవడానికి మొగ్గు చూపారు. గద్వాల రాజా సోమనాద్రితో శాంతి చర్చలు జరిపితే మంచిదని నిజాం సలహాదారులు సూచించారు.  ఈ భారీ యుద్ధానికి ప్రధాన కారకుడైన ఉప్పూరుకోటకు చెందిన సయ్యద్ దావూద్ మియాన్ ఏమీ మాట్లాడలేక తటస్థంగా, నిశ్శబ్దంగా ఉండిపోయాడు.

మరుసటి రోజు ఉదయం నిజాం కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం కోసం రాజా సోమనాద్రి వద్దకు ఒక రాయబారిని పంపాడు, దీనిని రాజా సోమనాద్రి అంగీకరించాడు.  కర్నూలులోని ‘కొండారెడ్డి బుర్జ్/టవర్’లోని ప్రసిద్ధ ‘ఎల్లమ్మ ఫిరంగి’, రాయచూరు నవాబులకు చెందిన గోన బుద్ధారెడ్డి నిర్మించిన ‘రామ లక్ష్మణుడు’ అని పిలువబడే రెండు ఫిరంగులను గద్వాల రాజా సోమనాద్రికి ‘శాంతి ఒప్పందం’ కానుకగా ఇచ్చారు. కర్నూలు భూముల్లో కొంత భాగాన్ని కూడా రాజా సోమనాద్రికి ఇచ్చారు. నిజాంతో జరిగిన యుద్ధంలో విజయం సాధించి శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్న రాజా సోమ భూపాలుడు/ రాజా సోమనాద్రి విజయంతో గద్వాలకు తిరిగి వచ్చారు.

కాలక్రమేణా గద్వాల ప్రధాన శక్తివంతమైన సంస్థానంగా, అభివృద్ధి చెందుతున్న నగరంగా మారింది.   పట్టణంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, 17వ శతాబ్దంలో గద్వాల కోట లోపల చెన్నకేశవ స్వామి ఆలయంతో సహా అనేక దేవాలయాలను నిర్మించాడు. లింగమ్మ బావి, చొక్కమ్మ బావి అనే రెండు బావులను సోమనాద్రి తన భార్యలు లింగమ్మ, చొక్కమ్మ పేర్లతో నిర్మించాడు. కళలకు కేంద్రంగా వ్యవహరించిన గద్వాలలో సంవత్సరానికి రెండుసార్లు పెద్ద ఎత్తున పండితుల సభలు నిర్వహించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పండితులను, కవులను ఆకర్షించేవారు. గద్వాలను ‘విద్వత్ గద్వాల’ అని పిలిచేవారు.

సోమనాద్రి మనవడు చిన సోమనాద్రి లేదా చిన సోమభూపాలుడు స్వతహాగా గొప్ప పేరున్న కవి, సాహిత్య కార్యక్రమాలను ఎంతగానో ప్రోత్సహించారు. గద్వాల రాజవంశానికి చెందిన మొదటి ముష్టిపల్లి రామభూపాలుడు కూడా సంస్కృత పండితుడు, సాహిత్యం, సంగీతం, ఇతర కళలను ప్రోత్సహించాడు. ఆయన హయాంలో కూడా సుదూర ప్రాంతాలైన వారణాసి, మైసూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పండితులు, కవులు సమావేశమయ్యేవారు. ఆయన కుమారుడు సీతారామ భూపాలుడు కూడా కళలకు గొప్ప పోషకుడు.

గద్వాల చేనేత పరిశ్రమ అద్భుతమైన పట్టుచీరలు, జరీ పనులకు ప్రసిద్ధి చెందింది.

Source:  `Haindava dharma veerulu’ book by Sri Suravaram Pratap Reddy

Translated by Sri Vellanki Ramakrishna