RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

Balaji Peshwa: బాలాజీ పీష్వా శివాజీ స్వరాజ్య స్వప్నసాధకుడు

శాంతాజీ పేరు చెబితే మొగల్‌ సైన్యం ఎలా హడలిపోయేదో మొగల్‌ల సమకాలికుడైన పర్షియన్‌ చరిత్రకారుడు ‘ఖాఫిఖాన్‌’ ఏమి చెప్పాడో చూడండి. ‘‘మరాఠాల సైన్యాధిపతి శాంతాజీని ఎదుర్కొనే ప్రతివాడూ చావనైనా చచ్చేవాడు, లేక బందీగానైనా చిక్కేవాడు, మొగల్‌ చక్రవర్తి కొలువులో ఏ సర్దార్‌కూ అతనిని నిరోధించేందుకు ధైర్యం చాలేది కాదు.’’ 1699 డిసెంబర్‌ 22న రాజారామ్‌ రాసిన ఈ లేఖను చూస్తే మొగలులపై ఆయన సాధించిన కీలక విజయం మనకు అర్థమవుతుంది. ‘‘మేము ఔరంగాజేబు సైనిక శిబిరంపై దాడి చేసి ఆయన కుమార్తెనే బందీగా చేసుకున్నాం.. త్వరలోనే ఔరంగాజేబును పూర్తిగా ఓడిస్తాం.’’ 1700 మార్చి 2న పిన్న వయసులోనే రాజారామ్‌ జబ్బుపడి, ఆకస్మికంగా మరణించాడు.
‘ఛత్రపతి శివాజీ, శంభాజీల మరణం తర్వాత ఏమి జరిగింది?’’ శంభాజీ మరణానంతరం మరాఠా సామ్రాజ్యానికి ఆయన భార్య ఏసుబాయి తన ఏడేళ్ల కుమారుడిని కాకుండా, తన మరిది, శంభాజీ తమ్ముడైన రాజారామ్‌ను సింహాసనాధిష్ఠుణ్ణి చేసింది. శంభాజీని గెలిచాను కదా, ఇక మరాఠా సామ్రాజ్యం తన వశమైనట్లేనని ఔరంగజేబు కన్న కల మళ్ళీ వక్రీకరించి, ఆయన ఢిల్లీకి వెళ్లకుండా దక్షిణ భారతంలోనే మళ్లీ యుద్ధంలో కూరుకుపోయాడు. మరాఠాలు వారికే ప్రత్యేకమైన గెరిల్లా యుద్ధ తంత్రంతో ఆ పశ్చిమ కనుమల్లో ఔరంగజేబు సైన్యాల్ని చికాకుపరిచి ఓడించారు. ఎంతో వ్యయప్రయాసలకోర్చి ఛత్రపతి రాజారామ్‌ ఉంటున్న జింజికోటను ముట్టడించిన మొగల్‌ సైన్యానికి రాజారామ్‌ చిక్కలేదు. పైగా, 1698లో సతారను కూటమి కేంద్ర స్థానంగా చేసుకుని మొగలులపై యుద్ధం సాగించాడు. ఆయన చేసిన యుద్ధాల్లో ఎంతో సహకరించి కీలకమైన గెలుపులకు కారణమైన సేనాపతి శాంతాజీ గోర్పడే, ధనాజీ జాదవ్‌ల ప్రతాపాన్ని ఇక్కడ చెప్పుకోవాల్సిందే. శాంతాజీ పేరు చెబితే మొగల్‌ సైన్యం ఎలా హడలిపోయేదో మొగల్‌ల సమకాలికుడైన పర్షియన్‌ చరిత్రకారుడు ‘ఖాఫిఖాన్‌’ ఏమి చెప్పాడో చూడండి. ‘‘మరాఠాల సైన్యాధిపతి శాంతాజీని ఎదుర్కొనే ప్రతివాడూ చావనైనా చచ్చేవాడు, లేక బందీగానైనా చిక్కేవాడు, మొగల్‌ చక్రవర్తి కొలువులో ఏ సర్దార్‌కూ అతనిని నిరోధించేందుకు ధైర్యం చాలేది కాదు.’’ 1699 డిసెంబర్‌ 22న రాజారామ్‌ రాసిన ఈ లేఖను చూస్తే మొగలులపై ఆయన సాధించిన కీలక విజయం మనకు అర్థమవుతుంది. ‘‘మేము ఔరంగాజేబు సైనిక శిబిరంపై దాడి చేసి ఆయన కుమార్తెనే బందీగా చేసుకున్నాం.. త్వరలోనే ఔరంగాజేబును పూర్తిగా ఓడిస్తాం.’’ 1700 మార్చి 2న పిన్న వయసులోనే రాజారామ్‌ జబ్బుపడి, ఆకస్మికంగా మరణించాడు.

అనంతరం రాజారామ్‌ భార్య తారాబాయి తన సైనిక వ్యూహాలతో మొగల్‌లపై పోరాటాన్ని ఒక ప్రజాయుద్ధంగా మార్చివేసింది! దీంతో మరాఠాలకు ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మరాఠాల విజయ పరంపరతో మొగలుల సైన్యం నానాటికీ క్షీణించింది. మరాఠాలపై విజయం ఎండమావిగా మారడంతో ఔరంగజేబు మనోవేదనతో కృంగి కృశించి తన 88వ యేట అహ్మద్‌నగర్‌లో చనిపోయాడు. మొగల్‌ పాలకులు అక్బర్‌ నుంచి ఔరంగజేబు వరకు దశాబ్దాల పాటు రాజ్యం పాలించగా, ఔరంగజేబు మరణానంతరం గద్దె నెక్కిన మొగల్‌ బాదుషాలు పట్టుమని ఐదేళ్లు కూడా కొనసాగలేదు. ఒక్కో సంవత్సరంలో అయితే ఇద్దరు గద్దెనెక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. తండ్రి ఎప్పుడు కాలం చేస్తాడా, తను ఎప్పుడు గద్దెనెక్కాలా! అని ఎదురు చూసిన ఔరంగజేబు కుమారుడు ‘మువాజం’, తండ్రి మరణానంతరం గద్దెనెక్కాడు. అటు తర్వాత ఐదు సంవత్సరాలకే 1712లో చనిపోయాడు. ‘మువాజం’ మరణానంతరం ఢిల్లీ సింహాసనం సార్వభౌమత్వాన్ని కోల్పోయి దర్బార్‌లో ఉన్న సర్దార్ల చేతిలోకి వెళ్లిపోయింది! అటు తర్వాత వరుసగా ఆ గద్దెనెక్కిన మొగల్‌ బాదుషాలు కాస్తా, సర్దార్ల చేతిలో కీలుబొమ్మగా మారిపోయారు. మొగలుల మంత్రి జుల్ఫికర్‌ అలీ ఖాన్‌, మువాజంకు పుట్టిన ముగ్గురు కుమారుల్లో పెద్దవాడైన జహందర్‌ షాను చేరదీసి, మిగతా వాళ్ళని చంపివేశాడు. తరువాత అతడిని ఢిల్లీ సింహాసనం మీద ఒక సంవత్సరం మాత్రమే కూర్చోబెట్టాడు.

ఇక ఇక్కడ మరాఠాల విషయానికొస్తే ఛత్రపతి శివాజీ మనవడైన ‘సాహూ’, మరాఠా సామ్రాజ్యానికి ఛత్రపతిగా 1708 జనవరిలో సింహాసనమెక్కాడు. ఉమ్మడి శత్రువైన మొగల్‌ సామ్రాజ్యం ఛిన్నాభిన్నమై నానాటికీ కుంచించుకుపోయాక.. మరాఠా యోధులలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారయ్యారు. వాళ్ళలో వాళ్లే తగవులు పడి చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు. ఈ సందర్భంలోనే జాతీయ స్వరాజ్య యవనికపై ముందుకు వచ్చాడు బాలాజీ పీష్వా. పీష్వా అంటే ఛత్రపతి యొక్క ప్రధానమంత్రి. ఈయన కింద పనిచేసే అష్ట ప్రధానులనే మంత్రులు ఉంటారు. ఈ బాలాజీ పీష్వానే మరాఠా సామ్రాజ్యంలో అత్యంత బలవంతుడైన ‘కన్హోజీ ఆంగ్రే’ను ఛత్రపతికి ఎదురు తిరిగిన సందర్భంలో ఒప్పించి, జాతీయవాద స్వరాజ్య పోరాటంలో ఆయనను భాగం చేశాడు. అసంతృప్తితో ఉన్న మిగతా మరాఠా సర్దార్లను అందరినీ కలిపి శత్రువుకు వ్యతిరేకంగా పరస్పర సహకార పద్ధతిలో మరాఠా మహా మండల్‌ స్థాపించాడు. దాంతో మొగలులు ఆశించినట్టుగా మరాఠాలు విడి పోకుండా మహా మండల్‌ పేరుతో వాళ్లంతా ఐక్యమయ్యారు. ‘‘మహా మండల్‌ తర్వాత నూరేళ్లపాటు దేశం మొత్తాన్ని మరాఠాలు నియంత్రించారు. అటు గుజరాత్‌ నుంచి ఇటు దక్షిణాన కర్ణాటక వరకు వాళ్లదే సామ్రాజ్యం. చివరికి ఢిల్లీ దర్బార్‌ను కూడా వారే నియంత్రించారు. వారి ప్రయోజనాలకు తగ్గట్టుగానే ఢిల్లీ దర్బారులో ఉన్న పాదుషాలను తమ చేతిలో కీలుబొమ్మలుగా చేసుకొని ఆడించారు. బేసన్‌ నుంచి పోర్చుగీసు వారిని ఓడించి తరిమేశారు. ఇంగ్లీష్‌ వారితో సమాన స్థాయిలో రెండు యుద్ధాలు చేశారు. పానిపట్‌ యుద్ధంలో ఘోర పరాజయాన్ని కూడా తట్టుకొని ఢిల్లీలోనూ, ఉత్తర భారతంలోనూ తమ స్వరాజ్యాన్ని స్థాపించగలిగారు.

మరాఠా గొప్ప యోధులందరినీ ఛత్రపతి సాహు పక్షాన కూడగట్టి, ధమాజీ, ధోరాట్‌ లాంటి బందిపోట్ల ముఠాలను బల ప్రయోగంతో అణిచివేసి, రాజ్యంలో శాంతి స్థిరత్వాలను మెరుగుపరిచాక బాలాజీ పీష్వా మొగలులపై దృష్టి పెట్టాడు. మొగల్‌ రాజ్యంలో భాగాలైన ఔరంగాబాద్‌, బేరార్‌, ఖాన్దేశ్‌, బీదర్‌, గోల్కొండ, బీజాపూర్‌ రాజ్యాలలో వసూలయ్యే ‘చౌథ్‌’ పన్నులను తమకే చెల్లించాలని అప్పటి ఢిల్లీ గద్దెపై ఉన్న మొగల్‌ కీలుబొమ్మ బాదుషా ‘ఫారుక్‌ షియార్‌’ని కోరాడు. 1713లో జహందర్‌ షా మరణానంతరం ఆయన వారసుడిగా ఈ ఫారూక్‌ షియార్‌ను సయ్యద్‌ సోదరులని పిలవబడే మొఘల్‌ సర్దార్లు ఢిల్లీ గద్దె నెక్కించారు. అప్పటికే మొగల్‌ సామ్రాజ్యం కేవలం ఢిల్లీ నగరానికి మాత్రమే పరితమైంది. బాలాజీ పీష్వా పెట్టిన ప్రతిపాదనను ఈ ఫారూఖ్‌ షియార్‌ ఒప్పుకోక, మరాఠాలతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. 50వేల సైన్యంతో ఢిల్లీని ముట్టడించిన బాలాజీ పీష్వా, ఫారుక్‌ షియార్‌ని ఓడించాడు.. గద్దెనెక్కించిన సయ్యద్‌ సోదరులే షియార్‌ను ఖైదులో చంపివేశారు. మరో కీలుబొమ్మ ప్రభువైన మహమ్మద్‌ షాను ఢిల్లీ గద్దెపై మొగల్‌ ప్రభువుగా కూర్చోబెట్టారు.

ఈ మహమ్మద్‌ షానే దక్షిణ భారతదేశంలో వసూలయ్యే పన్నును మరాఠాలకే సమర్పిస్తానని ఒప్పందానికి వచ్చాడు. అంటే ఈ ఒప్పందంతో మొగలులు మారాఠాలకు సామంతులుగా మారారని అర్థం! శివాజీ కలలు కన్న నిజమైన స్వరాజ్యాన్ని బాలాజీ పీష్వా ఇలా సాకారం చేశాడు. దీని తర్వాతనే మరాఠాలైన పీష్వాలు ఛత్రపతుల స్థానంలో స్వరాజ్య స్థాపకులుగా మారారు. తర్వాత బాలాజీ పీష్వా కుమారుడైన బాజీరావు, ఛత్రపతి ‘‘సాహు’’ కొలువులో పీష్వాగా నియమించబడ్డాడు. రాజసభ మందిరంలో పైకప్పును దాదాపుగా తాకే నిలువెత్తు విగ్రహం, స్పష్టంగా ఖంగున మోగే గొంతు, ధైర్యం, పౌరుషం ఉట్టిపడే ముఖ కవళికలు, దర్పంతో ఆకట్టుకునే నల్లటి కళ్ళు, అన్నిటికీ మించి అనర్గళ వాగ్ధాటి… ‘నేను మరాఠా పతాకాన్ని సింధూ నది తీరాన ప్రతిష్ఠిస్తాను’ అని ఛత్రపతి సాహు వైపు చూస్తూ గంభీరంగా పలికాడు. బాజీరావు మొగలుల దక్కన్‌ సుబేదారైన నిజామును పాల్‌కేడ్‌లోను ఆ తర్వాత భోపాల్‌లోను చిత్తుగా ఓడించాడు. సిద్దిలు, పోర్చుగీసు వారు ఆక్రమించిన మరాఠా ప్రాంతాలను కూడా విముక్తం చేశాడు. రాజపుత్రుల సహాయంతో ఉత్తర భారతదేశాన్ని పూర్తిగా జయించి, మొగలుల మహా సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేశాడు. ఇదీ, సంక్షిప్తంగా గ్రేట్‌ మారాఠాల చరిత్ర… అంటే.. మన చరిత్ర!

-డా. అంబటి శ్రీనివాస్‌రాజు

(‘మన కాకతీయులు’ గ్రంథకర్త)

అనంతరం రాజారామ్‌ భార్య తారాబాయి తన సైనిక వ్యూహాలతో మొగల్‌లపై పోరాటాన్ని ఒక ప్రజాయుద్ధంగా మార్చివేసింది! దీంతో మరాఠాలకు ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మరాఠాల విజయ పరంపరతో మొగలుల సైన్యం నానాటికీ క్షీణించింది. మరాఠాలపై విజయం ఎండమావిగా మారడంతో ఔరంగజేబు మనోవేదనతో కృంగి కృశించి తన 88వ యేట అహ్మద్‌నగర్‌లో చనిపోయాడు.